Political News

పవన్ కు జోగయ్య లేఖ..చంద్రబాబునూ ఇరికించారు

టీడీపీ-జనసేన పొత్తుల నేపథ్యంలో విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై కొంతమంది టీడీపీ-జనసేన నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలకు అసంతృప్త నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కొందరు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు చేగొండి హరి రామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.

ఒకవేళ టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే అందులో పవన్ కళ్యాణ్ అధికారం ఎంత? చంద్రబాబు అధికారం ఎంత? అనే విషయాన్ని స్పష్టం చేయాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. అంతేకాదు, రేపు తాడేపల్లిగూడెంలో జరగబోతున్న బహిరంగ సభలో ఈ విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై తాను అసంతృప్తితో ఉన్నానని చెప్పకనే చెప్పిన రామ జోగయ్య…టీడీపీ-జనసేన కూటమికి రాజ్యాధికారం లభిస్తే అందులో పవన్ పాత్ర ఏమిటి అని ప్రశ్నించారు.

కూటమిలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? అందులో పవన్ పాత్ర ఏమిటో చంద్రబాబు పాత్ర ఏమిటో చెప్పకుండా ముందుకు సాగడానికి వీల్లేదని కూడా ఆయన చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ కు గౌరవప్రదమైన హోదా ఇవ్వాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా సర్వాధికారాలతో ఆ హోదా ఉండాలని హరిరామజోగయ్య మరీమరీ చెప్పారు. ఆల్రెడీ సీట్ల పంపకం విషయంలో నిరసనను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ కు ఈ లేఖ ఇబ్బందికరంగా మారింది.

మరి ఈ లేఖపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా జనసేనకు కనీసం 60 నుంచి 70 సీట్లు డిమాండ్ చేయాలని, ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచిస్తూ హరి రామ జోగయ్య రాసిన లేఖలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

This post was last modified on February 27, 2024 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

6 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

7 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

8 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

10 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

11 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

11 hours ago