Political News

మైలవరం టీడీపీ పంచాయతీ తేలినట్లేనా?

ప్రస్తుతం ఏపీలో మైలవరం శాసనసభ టికెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో మైలవరం అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించలేదు. టికెట్ పై చంద్రబాబు నుంచి హామీ వచ్చిన వెంటనే ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైలవరం టికెట్ ను ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. తమిళనాడు మాదిరిగా నాయకులు వంగి వంగి దండాలు పెట్టడం, పాదాభివందనాలు చేయడం, బూతులు మాట్లాడడం చెల్లదని అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని సంచలన విమర్శలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ కేసినేని నాని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు విభేదాలున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరతారని ప్రచారం జరిగినా…తాను వైసీపీలోనే ఉన్నానని ఆయన క్లారిటీనిచ్చారు. అయితే, మైలవరం ఇన్చార్జిగా మరో వ్యక్తిని జగన్ నియమించడంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు అధికారికంగా తాను టిడిపిలో చేరుతున్నానని ప్రకటించారు. మరి, టికెట్ హామీ లభించే వసంత టీడీపీలో చేరబోతోంటే…దేవినేని పరిస్థితి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on February 27, 2024 1:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ…

1 hour ago

రెబ‌ల్ స్టార్ స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు విన్న‌పం

రెబ‌ల్ స్టార్, దివంగ‌త కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు రాజ‌కీయ ప్ర‌చారం…

4 hours ago

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…

5 hours ago

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం…

5 hours ago

ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే…

5 hours ago

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే…

7 hours ago