Political News

మైలవరం టీడీపీ పంచాయతీ తేలినట్లేనా?

ప్రస్తుతం ఏపీలో మైలవరం శాసనసభ టికెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో మైలవరం అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించలేదు. టికెట్ పై చంద్రబాబు నుంచి హామీ వచ్చిన వెంటనే ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైలవరం టికెట్ ను ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. తమిళనాడు మాదిరిగా నాయకులు వంగి వంగి దండాలు పెట్టడం, పాదాభివందనాలు చేయడం, బూతులు మాట్లాడడం చెల్లదని అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని సంచలన విమర్శలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ కేసినేని నాని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు విభేదాలున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరతారని ప్రచారం జరిగినా…తాను వైసీపీలోనే ఉన్నానని ఆయన క్లారిటీనిచ్చారు. అయితే, మైలవరం ఇన్చార్జిగా మరో వ్యక్తిని జగన్ నియమించడంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు అధికారికంగా తాను టిడిపిలో చేరుతున్నానని ప్రకటించారు. మరి, టికెట్ హామీ లభించే వసంత టీడీపీలో చేరబోతోంటే…దేవినేని పరిస్థితి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on February 27, 2024 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గాడ్జిల్లా చూసాం….ఈ నాగ్జిల్లా ఏంటయ్యా

ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…

30 minutes ago

ఫౌజీ హీరోయిన్ మీద వివాదమెందుకు

యావత్ దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ సంఘటన తర్వాత ఊహించని కోణాల్లో వివాదాలు తలెత్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ ద్వారా హీరోయిన్…

46 minutes ago

వీరయ్య చౌదరి హత్య…రంగంలోకి 12 పోలీసు బృందాలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…

1 hour ago

పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…

2 hours ago

బేరాలు మొదలుపెట్టిన కుబేర

ధనుష్, నాగార్జున కలయికతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఎడిటింగ్…

2 hours ago

‘పెద్ది’తో క్లాష్.. నాని ఏమన్నాడంటే?

ఇంకో వారం రోజుల్లో నాని కొత్త చిత్రం ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమా రిలీజ్‌కు రెడీ చేసేలోపే ఇంకో…

2 hours ago