ప్రస్తుతం ఏపీలో మైలవరం శాసనసభ టికెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో మైలవరం అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించలేదు. టికెట్ పై చంద్రబాబు నుంచి హామీ వచ్చిన వెంటనే ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైలవరం టికెట్ ను ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు.
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. తమిళనాడు మాదిరిగా నాయకులు వంగి వంగి దండాలు పెట్టడం, పాదాభివందనాలు చేయడం, బూతులు మాట్లాడడం చెల్లదని అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని సంచలన విమర్శలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ కేసినేని నాని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు విభేదాలున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరతారని ప్రచారం జరిగినా…తాను వైసీపీలోనే ఉన్నానని ఆయన క్లారిటీనిచ్చారు. అయితే, మైలవరం ఇన్చార్జిగా మరో వ్యక్తిని జగన్ నియమించడంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు అధికారికంగా తాను టిడిపిలో చేరుతున్నానని ప్రకటించారు. మరి, టికెట్ హామీ లభించే వసంత టీడీపీలో చేరబోతోంటే…దేవినేని పరిస్థితి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on February 27, 2024 1:26 pm
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…