Political News

ఈ మాజీ మంత్రి భలే లక్కీ

తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో అభ్యర్థుల పేర్లు చూసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనబడింది. అదేమిటంటే మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్ళగడ్డలో టికెట్ దక్కటం. అసలు అఖిలను పార్టీలో ఇంతవరకు ఉంచుకోవటమే చాలా ఎక్కువన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పేవి. కారణాలు తెలీటంలేదు కాని అఖిలను చంద్రబాబునాయుడు అనవసరంగా ఎంటర్ టైన్ చేస్తున్నారని కర్నూలు జిల్లాలోని నేతలు చాలాసార్లు కామెంట్లు చేశారు. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అయితే అఖిలను పార్టీలో నుండి పంపేయాలని గట్టిగా పోరాటం కూడా చేశారు.

అఖిల పరిస్ధితి పార్టీలో చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగంటే పార్టీలో ఆమెను కలుపుకుని వెళ్ళేవారు ఎవరూ లేరు. పార్టీ ఆపీసులోకి ఆమెను రానివ్వటం లేదు. అందుకనే ఆమె కూడా సపరేటుగా ఆపీసును పెట్టుకున్నారు. ఆమె మీద హత్యకు కుట్ర, కిడ్నాపులు, మోసాలు, ఫోర్జరీ, బెదిరింపుల్లాంటి అనేక కేసులు నమోదయ్యాయి. కిడ్నాపు కేసులో అరెస్టయి బెయిల్ మీదున్నారు. ఇంతటి వివాదాస్పద నేత జిల్లాలో ఇంకోరు లేరు. అందుకనే ఆమెతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడేవారు కాదు.

ఇలాంటి నేతకు ఎలాగూ టికెట్ రాదు కాబట్టి బయటకు వెళ్ళిపోవటమే మంచిదని చాలామంది అనుకున్నారు. అయితే తాజాగా ప్రకటించిన మొదటి జాబితాలోనే అఖిల పేరుండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఏ ప్రాతిపదికన అఖిలకు టికెట్ ఇచ్చారన్న విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. పార్టీలోనే కాదు చివరకు కుటుంబంలో కూడా అఖిలకు అందరు పూర్తిగా వ్యతిరేకమే. అఖిలకు టికెట్ ఇవ్వద్దని భూమా కుటుంబసభ్యులే చంద్రబాబుకు చెప్పారు. ఒకవేళ టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతుందని కూడా చెప్పారు.

అయినా సరే ఇంతమంది వ్యతరేకతను పట్టించుకోకుండా, గ్రౌండ్ లెవల్లో ఆమె మీదున్న వ్యతిరేకత తెలిసికూడా ఆమెకు టికెట్ ఇచ్చారంటే అఖిలను లక్కీ అనకుండా ఇంకేమనాలి. పార్టీకి కమిట్మెంట్ తో పనిచేస్తున్న వాళ్ళలో కొందరికి టికెట్ దక్కలేదు. మరికొందరికి పొత్తులో సీట్లు పోయాయి. ఇవన్నీ పార్టీకోణంలో ఆలోచిస్తే ఎవరు ఏమిచేయలేరు. కాని అసలు పార్టీని పక్కనపెట్టి కేవలం తన ఎదుగుదలను మాత్రమే చూసుకుంటున్న అఖిలకు టికెట్ దక్కటాన్నే జిల్లాలోని చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో.

This post was last modified on February 26, 2024 10:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

24 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago