తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో అభ్యర్థుల పేర్లు చూసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనబడింది. అదేమిటంటే మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్ళగడ్డలో టికెట్ దక్కటం. అసలు అఖిలను పార్టీలో ఇంతవరకు ఉంచుకోవటమే చాలా ఎక్కువన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పేవి. కారణాలు తెలీటంలేదు కాని అఖిలను చంద్రబాబునాయుడు అనవసరంగా ఎంటర్ టైన్ చేస్తున్నారని కర్నూలు జిల్లాలోని నేతలు చాలాసార్లు కామెంట్లు చేశారు. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అయితే అఖిలను పార్టీలో నుండి పంపేయాలని గట్టిగా పోరాటం కూడా చేశారు.
అఖిల పరిస్ధితి పార్టీలో చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగంటే పార్టీలో ఆమెను కలుపుకుని వెళ్ళేవారు ఎవరూ లేరు. పార్టీ ఆపీసులోకి ఆమెను రానివ్వటం లేదు. అందుకనే ఆమె కూడా సపరేటుగా ఆపీసును పెట్టుకున్నారు. ఆమె మీద హత్యకు కుట్ర, కిడ్నాపులు, మోసాలు, ఫోర్జరీ, బెదిరింపుల్లాంటి అనేక కేసులు నమోదయ్యాయి. కిడ్నాపు కేసులో అరెస్టయి బెయిల్ మీదున్నారు. ఇంతటి వివాదాస్పద నేత జిల్లాలో ఇంకోరు లేరు. అందుకనే ఆమెతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడేవారు కాదు.
ఇలాంటి నేతకు ఎలాగూ టికెట్ రాదు కాబట్టి బయటకు వెళ్ళిపోవటమే మంచిదని చాలామంది అనుకున్నారు. అయితే తాజాగా ప్రకటించిన మొదటి జాబితాలోనే అఖిల పేరుండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఏ ప్రాతిపదికన అఖిలకు టికెట్ ఇచ్చారన్న విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. పార్టీలోనే కాదు చివరకు కుటుంబంలో కూడా అఖిలకు అందరు పూర్తిగా వ్యతిరేకమే. అఖిలకు టికెట్ ఇవ్వద్దని భూమా కుటుంబసభ్యులే చంద్రబాబుకు చెప్పారు. ఒకవేళ టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతుందని కూడా చెప్పారు.
అయినా సరే ఇంతమంది వ్యతరేకతను పట్టించుకోకుండా, గ్రౌండ్ లెవల్లో ఆమె మీదున్న వ్యతిరేకత తెలిసికూడా ఆమెకు టికెట్ ఇచ్చారంటే అఖిలను లక్కీ అనకుండా ఇంకేమనాలి. పార్టీకి కమిట్మెంట్ తో పనిచేస్తున్న వాళ్ళలో కొందరికి టికెట్ దక్కలేదు. మరికొందరికి పొత్తులో సీట్లు పోయాయి. ఇవన్నీ పార్టీకోణంలో ఆలోచిస్తే ఎవరు ఏమిచేయలేరు. కాని అసలు పార్టీని పక్కనపెట్టి కేవలం తన ఎదుగుదలను మాత్రమే చూసుకుంటున్న అఖిలకు టికెట్ దక్కటాన్నే జిల్లాలోని చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో.
This post was last modified on February 26, 2024 10:38 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…