ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ అవ్యాజమైన ప్రేమను కురిపిస్తోం ది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇక్కడ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో 15 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ఆయన శంకు స్థాపనలు చేయనున్నారు. వీటి విలువ రూ.230 కోట్లకుపైగానే ఉండనుంది. వీటికి సోమవారం(రేపు) ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. రూ.221.18 కోట్ల వ్యయంతో ఇప్పటికే పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి రైల్వేశాఖ మొత్తం 2,245 కోట్ల రూపాయలను కేటాయించడం గమనార్హం.
సరిగ్గా ఎన్నికలకు ముందు.. ఈ ప్రాజెక్టులు ప్రారంభం అవుతుండడం గమనార్హం. 2023, ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయితే.. ఇవన్నీ కూడా.. పక్కాగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తుండడం గమనార్హం.
10 స్తానాల్లో విజయం దక్కించుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బలమైన పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీకి తెలంగాణ నలుగురు ఎంపీలు ఉన్నారు. అయితే, ఈ సంఖ్యను 10కి చేర్చడం ద్వారా 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలన్నది.. బీజేపీ ఎత్తుగడ. ఈ క్రమంలోనే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం గమనార్హం.
This post was last modified on February 25, 2024 1:51 pm
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…