Political News

తెలంగాణపై మోడీ ఎన్నిక‌ల వ‌రాలు

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ‌పై కేంద్రంలోని బీజేపీ అవ్యాజ‌మైన ప్రేమ‌ను కురిపిస్తోం ది. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు ఇక్క‌డ శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణలో 15 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ఆయ‌న శంకు స్థాప‌న‌లు చేయ‌నున్నారు. వీటి విలువ రూ.230 కోట్లకుపైగానే ఉండ‌నుంది. వీటికి సోమ‌వారం(రేపు) ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను కేంద్ర ప్ర‌భుత్వం నిర్మించనుంది. రూ.221.18 కోట్ల వ్య‌యంతో ఇప్ప‌టికే పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించ‌నున్నారు. అదేవిధంగా 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయ‌నున్నారు. దీనికి సంబంధించి రైల్వేశాఖ మొత్తం 2,245 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ ప్రాజెక్టులు ప్రారంభం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. 2023, ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయితే.. ఇవ‌న్నీ కూడా.. ప‌క్కాగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

10 స్తానాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది బీజేపీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బ‌ల‌మైన పోటీ ఇవ్వాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పార్టీకి తెలంగాణ న‌లుగురు ఎంపీలు ఉన్నారు. అయితే, ఈ సంఖ్య‌ను 10కి చేర్చ‌డం ద్వారా 2028లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ద‌క్కించుకోవాల‌న్నది.. బీజేపీ ఎత్తుగ‌డ‌. ఈ క్ర‌మంలోనే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 25, 2024 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

49 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago