ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లొ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. విహానంతరం హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో శనివారం రాత్రి ఘనమైన రిసెప్షన్ ఇచ్చారు. అయితే.. ఈ కార్యక్రమానికి రాజారెడ్డి మేనమామ, ఏపీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఆయన రిసెప్షన్కు వచ్చే సరికి గైర్హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. రాజారెడ్డి వివాహం తర్వాత.. ఏపీకి తిరిగి వచ్చిన షర్మిల.. పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలుచేపట్టారు. ఆమెను పోలీసులు అరెస్టు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో నియంత ప్రభుత్వం, నియంత పాలకుడు అని షర్మిల తెగ విమర్శలు గుప్పించారు. దీంతో నొచ్చుకున్న సీఎం జగన్ ఈ రిసెప్షన్కు దూరంగా ఉన్నారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు.. వైసీపీకి చెందిన నాయకులు కూడా ఎవరూ హాజరు కాకపోవడంతో అధిష్టానం నిలువరించిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక, రాజారెడ్డి, అట్లూరి ప్రియల రిసెప్షన్ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ ఆత్మ కేవీపీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
రాజస్థాన్లోని జోధ్పూర్ లో జరిగిన వివాహానికి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ గైర్హాజరు కావడం తెలిసిందే. శనివారం రాత్రి శంషాబాద్లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్కు సైతం వైఎస్ జగన్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అంతకుముందు గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ హాజరయారు. రాజకీయాలను రాజకీయంగానే చూడాలని పలువురు సూచిస్తున్నారు. కానీ, రాజకీయాలు వైఎస్ కుటుంబాన్ని ఎంత విడదీయాలో అంతా విడదీసేశాయని.. ఇక కలుసుకోవడం కల్లేనని అనేవారు కూడా ఉన్నారు. మరోవైపు.. రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
This post was last modified on February 25, 2024 10:12 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…