Political News

పవన్ కే షాకిచ్చారా ?

జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్ కే షాకిచ్చారా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం విశాఖపట్నంలో భీమిలి, యలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ప్రకటించినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజమని నమ్మిన మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించింది. మీడియాలో వచ్చిన వార్తలు చూసి పవన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. కారణం ఏమిటంటే పవన్ అసలు ఎవరినీ సమన్వయకర్తగా ప్రకటించలేదట.

తాను చేయని నియామకాలను తన పేరుతోనే పార్టీలో ఎవరు ప్రచారం చేశారు ? దాన్ని మీడియాలో ఎవరు హైలైట్ చేయించారనే విషయమై పవన్ వాకబు చేశారట. వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత ఈ ప్రచారానికి కారణం ఇద్దరు నేతలని గుర్తించారట. వైసీపీలో నుండి జనసేనలో చేరిన ఎంఎల్సీ వంశీ కృష్ణ శ్రీనివాసయాదవ్, సుందరపు సతీష్ గా తేలిందట. వంశీ భీమిలీలో, సతీష్ ఎలమంచిలిలో పోటీచేయాలని బాగా పట్టుదలగా ఉన్నారట. తామిద్దరం పై నియోజకవర్గాల నుండి పోటీచేయబోతున్నట్లు వీళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారట.

ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తుండటం, మరోవైపు పొత్తులు, సీట్ల సర్దబాట్లు తేలకపోవటంతో నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. అందుకనే వీళ్ళిద్దరు అడ్వాన్స్ అయిపోయి తమకు తామే ఇన్చార్జిలుగా చెప్పేసుకుంటు పవన్ నియమించినట్లుగా ప్రచారంలోకి తెచ్చినట్లు గుర్తించారు. తమను మాత్రమే సమన్వయకర్తలుగా నియమించారంటే గొడవలైపోతాయని మరో ఇద్దరి పేర్లను కూడా జతచేశారట. దాంతో వ్యవహారమంతా బాగా గబ్బుపట్టిపోయింది. మరిపుడు తాను చేయని నియామకాలను చేసినట్లుగా ప్రచారానికి కారణమైన వాళ్ళపై పవన్ ఏమి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

తాజాగా బయటపడిన వివాదంతో ఇప్పటివరకు జనసేన తరపున కొన్ని నియోజకర్గాల్లో సమన్వయకర్తలుగా ప్రచారంలో ఉన్న వారిపైన కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో జనసేన సమన్వయకర్తలను నియమాకం జరిగిందని ప్రచారం మొదలైందో వెంటనే టీడీపీ నేతల నుండి తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు లేచాయి. దాంతో రెండుపార్టీల్లోను గందరగోళం పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు ఇలాంటి గందరగోళాలు రెండుపార్టీలకు ఏమాత్రం మంచివికావని పవన్ అనుకుంటున్నారట. అందుకనే ఇలాంటి ప్రచారాలకు వీలైనంత తొందరలోనే ఫులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

This post was last modified on February 24, 2024 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

32 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

50 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago