Political News

పవన్ కే షాకిచ్చారా ?

జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్ కే షాకిచ్చారా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం విశాఖపట్నంలో భీమిలి, యలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ప్రకటించినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజమని నమ్మిన మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించింది. మీడియాలో వచ్చిన వార్తలు చూసి పవన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. కారణం ఏమిటంటే పవన్ అసలు ఎవరినీ సమన్వయకర్తగా ప్రకటించలేదట.

తాను చేయని నియామకాలను తన పేరుతోనే పార్టీలో ఎవరు ప్రచారం చేశారు ? దాన్ని మీడియాలో ఎవరు హైలైట్ చేయించారనే విషయమై పవన్ వాకబు చేశారట. వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత ఈ ప్రచారానికి కారణం ఇద్దరు నేతలని గుర్తించారట. వైసీపీలో నుండి జనసేనలో చేరిన ఎంఎల్సీ వంశీ కృష్ణ శ్రీనివాసయాదవ్, సుందరపు సతీష్ గా తేలిందట. వంశీ భీమిలీలో, సతీష్ ఎలమంచిలిలో పోటీచేయాలని బాగా పట్టుదలగా ఉన్నారట. తామిద్దరం పై నియోజకవర్గాల నుండి పోటీచేయబోతున్నట్లు వీళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారట.

ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తుండటం, మరోవైపు పొత్తులు, సీట్ల సర్దబాట్లు తేలకపోవటంతో నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. అందుకనే వీళ్ళిద్దరు అడ్వాన్స్ అయిపోయి తమకు తామే ఇన్చార్జిలుగా చెప్పేసుకుంటు పవన్ నియమించినట్లుగా ప్రచారంలోకి తెచ్చినట్లు గుర్తించారు. తమను మాత్రమే సమన్వయకర్తలుగా నియమించారంటే గొడవలైపోతాయని మరో ఇద్దరి పేర్లను కూడా జతచేశారట. దాంతో వ్యవహారమంతా బాగా గబ్బుపట్టిపోయింది. మరిపుడు తాను చేయని నియామకాలను చేసినట్లుగా ప్రచారానికి కారణమైన వాళ్ళపై పవన్ ఏమి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

తాజాగా బయటపడిన వివాదంతో ఇప్పటివరకు జనసేన తరపున కొన్ని నియోజకర్గాల్లో సమన్వయకర్తలుగా ప్రచారంలో ఉన్న వారిపైన కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో జనసేన సమన్వయకర్తలను నియమాకం జరిగిందని ప్రచారం మొదలైందో వెంటనే టీడీపీ నేతల నుండి తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు లేచాయి. దాంతో రెండుపార్టీల్లోను గందరగోళం పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు ఇలాంటి గందరగోళాలు రెండుపార్టీలకు ఏమాత్రం మంచివికావని పవన్ అనుకుంటున్నారట. అందుకనే ఇలాంటి ప్రచారాలకు వీలైనంత తొందరలోనే ఫులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

This post was last modified on February 24, 2024 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

56 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

4 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

4 hours ago