వైసీపీకి రాజీనామా చేసి.. అవసరమైతే.. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై కూడా పోరాటం చేస్తానని చెప్పిన మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ లో చేరతానని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలోతన భాగస్వామ్యం కూడా ఉంటుందని పేర్కొన్నా రు. అంతేకాదు..వైఎస్ షర్మిల వెంటే తాను కూడా నడుస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. షర్మిల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఇంత వరకు బాగానే జరిగినా.. తర్వాత అనూహ్యంగా పట్టుమని 15 రోజులు కూడా గడవకమేందు.. ఆళ్ల తిరిగి వైసీపీ చెంతకు చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అంతేకాదు.. మంగళగిరిలో తనకు టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదని.. మంగళగిరిలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా పొన్నూరులోనూ పార్టీ బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. కట్ చేస్తే.. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు.
అయితే.. తాజాగా ఆళ్ల వెడలిపోయిన వ్యవహారంపై కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల రియాక్ట్ అయ్యారు. తాజాగా విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆర్.కే అన్నతో నాకు ఉన్న అనుబంధం వేరు. ఆయన ఎన్ని ఒత్తిడులు ఉంటే పార్టీ మారారో నాకు తెలు సు. హీ ఈజ్ రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్. రామకృష్ణకు నాకు రాజకీయాలు లేవు.. నా మనస్సుకి దగ్గరైన వ్యక్తి రామకృష్ణ.. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం నాకు లేదు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ ఘటన ముగిసిందని.. అన్నారు.
This post was last modified on February 23, 2024 3:57 pm
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…