ఔను.. ఈ మాట నిజమేనట. సాక్షాత్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా తాజాగా ఈ మాట అనేశారు. “ఆవిడ ఎందుకు ఏపీకి వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆస్తులు, అప్పులు.. అనేవి సీఎం జగన్, షర్మిల మధ్య లేనే లేవు. షర్మిలకు సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు. దివంగత వైఎస్సార్ జీవించి ఉన్నప్పు డే.. వీరికి ఆస్తులు పంచి ఇచ్చేశారు. ఈ విషయం మీకు(మీడియా) తెలియకపోయినా.. సీమ వాసులుగా మాకు తెలుసు. పత్రిక, మీడియాల్లో వాటా ఆమె లేదు. అవి సీఎం జగన్ సొంత వ్యాపారాలు“ అని రోజా వ్యాఖ్యానించారు.
కొన్నాళ్లుగా వైసీపీఅధినేత, సీఎం జగన్పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా.. నియంత పాలన అంటూ ఆమె విరుచుకుపడ్డారు. అయితే.. ఇంతగా షర్మిల దూకుడు చూపించడానికి కారణం.. సీఎం జగన్ షర్మిలకు ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తున్నారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూనే ఉంది. గతంలో ఒకసారి షర్మిల కూడా.. సాక్షి పత్రిక, మీడియాలో తనకు వాటా కూడా ఉందని ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో మీడియా ముందే వ్యాఖ్యానించారు.
అయితే.. ఇతర ఆస్తుల పంపకాల విషయంపై షర్మిల మాట్లాడలేదు. ఇక, వీరి మాతృమూర్తివిజయమ్మ కూడా.. ఎక్కడా నోరు విప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్తుల వివాదం వల్లే..షర్మిల విభేదించి ఉంటుందనే వాదన ప్రతిపక్షాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక, రాజకీయ పార్టీని బలోపేతం చేసిన తర్వాత.. ఆమెను వదిలించుకున్నారన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే.. ఈ వ్యాఖ్యలు ఆమె సొంతగా చేశారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఇది సీఎంజగన్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దీంతో రోజా వ్యాఖ్యల వెనుక తాడేపల్లి వర్గాలడైరెక్షన్ ఉండిఉంటుందనే సంహాలు వ్యక్తమవుతున్నాయి.
రోజా ఫైర్..
“తెలంగాణ బిడ్డని.. అక్కడి ప్రజలకు అండగా ఉంటానని.. నాలుగున్నరేళ్ల తరువాత షర్మిళ ఏపీకీ వచ్చి నానా యాగి చేస్తున్నారు. జగన్పై షర్మిళ విషం చిముతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిళని పావుగా వాడుతున్నారు. పవన్ కల్యాణ్ తన ఆస్థిలో అన్నాచెల్లెలు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలి. వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిలకు ఆస్తులు పంచారు. సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు“ అని రోజా అన్నారు.
This post was last modified on February 23, 2024 3:55 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…