మిగిలిన పార్లమెంట్ సీట్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభకు నాగబాబు పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం నాగబాబు ప్రకటనల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన నేతల్లో మొదలైన ప్రశ్న ఏమిటంటే నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా ? అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా అనకాపల్లిలో తూర్పుకాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజికవర్గాలు. ఈ రెండు సామాజికవర్గాలను కాదని మిగిలిన సామాజికవర్గాలకు చెందిన నేతలు ఏమీ చేయలేరు.
ఇపుడు నాగబాబు పైన చెప్పిన రెండు సామాజికవర్గాల్లో దేనికీ చెందరు. పైగా నాగబాబుది గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజికవర్గం. కాపులు అంటే అగ్రవర్ణాలకు చెందిన వారు. అదే తూర్పుకాపులు, కొప్పుల వెలమలు బీసీ సామాజికవర్గాల్లోకి వస్తారు. పైగా మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుని ఇపుడు అన్యాయం చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. గవర ఉపకులానికి చెందిన నేత కొణతాలకు అన్యాయం జరిగుతోందనే ప్రచారం బాగా పెరిగిపోతుంది.
ఇదే సమయంలో వైసీపీ తరపున ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు లోక్ సభకు పోటీచేయచ్చని అంటున్నారు. బూడి కొప్పుల వెలమ సామాజికవర్గం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కొప్పుల వెలమ, గవర్లు, తూర్పుకాపులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి నాగబాబుకు పై సామాజికవర్గం నుండి ఏ మేరకు సహకారం అందుతుందో అనుమానమే అని పార్టీలోనే చర్చ పెరిగిపోతోంది.
ఇపుడు బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోనే ఉన్న మాడుగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాడుగులలో గవర సామాజికవర్గం బలంగా ఉంది. కాబట్టి వైసీపీ నుండి బూడి, జనసేన తరపున నాగబాబు ఎంపీగా పోటీచేస్తే పోటీ టైట్ గా ఉండే అవకాశం ఉంది. పోటీ ఎంత టైట్ గా జరిగినా నాగబాబుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. టీడీపీ కూటమి తరపున పోటీచేసే ఎంపీ అభ్యర్ధిని బట్టి వైసీపీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయాలని జగన్ అనుకున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 22, 2024 5:56 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…