మిగిలిన పార్లమెంట్ సీట్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభకు నాగబాబు పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం నాగబాబు ప్రకటనల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన నేతల్లో మొదలైన ప్రశ్న ఏమిటంటే నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా ? అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా అనకాపల్లిలో తూర్పుకాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజికవర్గాలు. ఈ రెండు సామాజికవర్గాలను కాదని మిగిలిన సామాజికవర్గాలకు చెందిన నేతలు ఏమీ చేయలేరు.
ఇపుడు నాగబాబు పైన చెప్పిన రెండు సామాజికవర్గాల్లో దేనికీ చెందరు. పైగా నాగబాబుది గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజికవర్గం. కాపులు అంటే అగ్రవర్ణాలకు చెందిన వారు. అదే తూర్పుకాపులు, కొప్పుల వెలమలు బీసీ సామాజికవర్గాల్లోకి వస్తారు. పైగా మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుని ఇపుడు అన్యాయం చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. గవర ఉపకులానికి చెందిన నేత కొణతాలకు అన్యాయం జరిగుతోందనే ప్రచారం బాగా పెరిగిపోతుంది.
ఇదే సమయంలో వైసీపీ తరపున ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు లోక్ సభకు పోటీచేయచ్చని అంటున్నారు. బూడి కొప్పుల వెలమ సామాజికవర్గం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కొప్పుల వెలమ, గవర్లు, తూర్పుకాపులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి నాగబాబుకు పై సామాజికవర్గం నుండి ఏ మేరకు సహకారం అందుతుందో అనుమానమే అని పార్టీలోనే చర్చ పెరిగిపోతోంది.
ఇపుడు బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోనే ఉన్న మాడుగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాడుగులలో గవర సామాజికవర్గం బలంగా ఉంది. కాబట్టి వైసీపీ నుండి బూడి, జనసేన తరపున నాగబాబు ఎంపీగా పోటీచేస్తే పోటీ టైట్ గా ఉండే అవకాశం ఉంది. పోటీ ఎంత టైట్ గా జరిగినా నాగబాబుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. టీడీపీ కూటమి తరపున పోటీచేసే ఎంపీ అభ్యర్ధిని బట్టి వైసీపీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయాలని జగన్ అనుకున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 22, 2024 5:56 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…