Political News

టీడీపీలో జీఎస్‌.. వైసీపీకి భారీ దెబ్బేనా…!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన నేప‌థ్యంలో జంపింగులు కామ‌న్‌గా మారిపోయాయి. టికెట్లు ద‌క్క‌ని వారు.. త‌మ‌కు న‌చ్చ‌ని సీటును ఇవ్వ‌లేద‌ని భావిస్తున్న‌వారు.. పార్టీలు మారుతున్నారు. ఈ జంపింగులకు ఎవ‌రూ అతీతులు కాకుండా పోయారు. ఇదిలావుంటే.. వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని విధాలా అండ‌గా ఉన్న గెదెల శ్రీను.. ఉర‌ఫ్ జీఎస్‌గా పిలుచుకునే యువ పారిశ్రామిక వేత్త‌.. త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన జీఎస్‌.. ఇటీవ‌ల శంఖారావం స‌భ‌కు వ‌చ్చిన నారా లోకేష్‌తో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. అయితే.. కొంత ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగు చూసింది.

ఎవ‌రీయ‌న‌..
ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్సస్‌ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు ఉర‌ఫ్ జీఎస్‌గా స్థానికంగా సుప‌రిచితులు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలు, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై తన విజన్‌ను వివరిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి శ్రీనుబాబు వెళుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గాని చెందిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, చివరి నిమిషంలో వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్య‌ర్థి ఎంవీవీ సత్యనారాయణకు మద్ధతు ప్రకటించారు.

త‌ర్వాత కాలంలో జీఎస్‌కు వైసీపీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన కూడా పార్టీతో అంటీ ముట్టనట్టు గానే ఇన్నేళ్లు ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు స‌మ‌యం చేరువైన తరుణంలో ఆయన యాక్టివ్‌ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళతారన్న జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల శంఖారావం స‌భ‌ల్లో జీఎస్‌.. టీడీపీ నేతలతో వరుసగా సమావేశం కావ‌డం.. నారా లోకేష్ బ‌స‌కు వెళ్లి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం.. ప్రాధాన్యం సంత‌రించుకుంది.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ సీనియర్‌ నేతలు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావుతోపాటు బొబ్బిలిలో బేబీ నాయనతోపాటు పలువురు కీలక నేతలతోనూ జీఎస్ ట‌చ్‌లో ఉన్నారు. టీడీపీలో చేరే క్రమంలోనే శ్రీనుబాబు ఆ పార్టీ నేతలతో సమావేశమవుతున్నట్టు తెలిసింది. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, ఉన్న‌త విద్యావంతుడు, యువ‌కుడు కావ‌డంతో టీడీపీలోకి ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on February 22, 2024 1:47 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

21 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

50 minutes ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

55 minutes ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago