Political News

నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్ వేవ్‌!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువనేశ్వ‌రి గురించి పైకి పెద్ద‌గా ఏమీ విని పించ‌డం లేదు. క‌నిపించ‌డం కూడా లేదు. కానీ.. ఆమె సైలెంట్ వేవ్ సృష్టించే ప‌నిలో ఉన్నారు. చాలా నిరాడంబరంగా ఉండే భువ‌నేశ్వ‌రి.. అంతే నిరాడంబ‌రంగా ప‌క్కా వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో సాధ్య‌మైనంత మేర‌కు.. నారా భువ‌నేశ్వ‌రి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె ఇంతింతై .. అన్న‌ట్టుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

45 ఏళ్లలో .. ఏనాడూ నారా భువ‌నేశ్వ‌రి రాజ‌కీయాల్లోకి రాలేదు. త‌న తండ్రి అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలో అయితే.. ఎవ‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేవారు. నారా భువ‌నేశ్వ‌రి కూడా ఇలానే ఉండిపోయారు. 14 సంవ‌త్స‌రా లు.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలోనూ ఏ నాడూ రాజ‌కీయాల్లోకి రాలేదు. అయితే.. వైసీపీ హ‌యాంలో గ‌త ఏడాది చంద్ర‌బాబు జైలుకు వెళ్లిన‌ప్పుడు.. తొలిసారి రాజ‌కీయంగా ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చాయి. జైలు ద‌గ్గ‌ర నుంచి పార్టీ కార్యాల‌యం వ‌ర‌కు.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడారు.

రేటింగ్ వ‌ల్లే..
చంద్ర‌బాబు జైల్లో ఉన్న సంద‌ర్భాల్లో నారా లోకేష్ కంటే కూడా.. నారా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి ఇద్ద‌రూ యా క్టివ్‌గా ప్ర‌జ‌ల్లో ఉన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ కావొచ్చు.. చంద్ర‌బాబుకు అనుకూలంగా చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లోనూ నారా బువ‌నేశ్వ‌రి మాట్లాడారు. ఆమె మాట్లాడిన తీరు.. ప్ర‌జ‌ల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. టీవీ చానెళ్ల రేటింగ్ కూడా పెరిగింది. దీనికితోడు.. చంద్ర‌బాబు జైల్లో ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న జైలుకు వెళ్లార‌న్న వార్త‌ను చూసి త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

నిజం గెల‌వాలి.. పేరుతో నారా భువ‌నేశ్వ‌రి.. ప‌ర్య‌టించారు. ఆయా స‌మయాల్లోనూ ఆమె ప్ర‌సంగించారు. ఇది బాగానే ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌ర్వాత‌.. ఇక‌, తాను రాను అని చెప్పారు. అంతా బాబు చూసుకుంటార‌ని అన్నారు. కానీ, నారా భువ‌నేశ్వ‌రికి పెరిగిన గ్రాఫ్‌, మాట తీరు, ఆమెకు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. ఆమెను ప్రోత్స‌హించారు. ప్ర‌స్తుతం నారా భువ‌నేశ్వ‌రి నిజం గెల‌వాలి యాత్ర‌ల్లో జోరుగా పాల్గొంటున్నారు.

అంతేకాదు.. ఈ యాత్ర‌ల ద్వారా. ఆమె కేవ‌లం బాధిత కుటుంబాల‌కు న‌గ‌దు ఇచ్చి.. వారి బాధను పంచుకుని వెళ్లిపోతే.. పెద్ద విశేషం ఏం లేదు. కానీ, గ‌త వారం నుంచి నారా భువ‌నేశ్వ‌రి వ్యూహంలో ప్ర‌సంగాలు వ‌చ్చి చేరాయి. ప‌క్కా మాస్ డైలాగులు… వ‌చ్చి చేరుతున్నాయి. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. రాజ‌కీయాలు వ‌చ్చి చేరాయి. వైసీపీని ఓడించాల‌ని కోరుతున్నారు. తాను కూడా పోటీ చేయాల‌ని ఉంద‌న్నారు. దీంతో నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్ వేవ్ క‌నిపిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. వైసీపీ దీనిని ప‌ట్టించుకోలేదు. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 22, 2024 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

6 hours ago