Political News

నూజివీడు – మైల‌వ‌రం – పెన‌మ‌లూరు సీట్లు వీళ్ల‌కే!

టీడీపీ, వైసీపీల్లో రాజ‌కీయ దుమారం పెరుగుతోంది. నాయ‌కుల జంపింగులు కూడా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు నుంచి ఎటు మారుతున్నారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, వేరే పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకునేది లేదు.. అని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీసుకున్న వైసీపీ కానీ, టీడీపీ కానీ.. స్వీయ నిబంధ‌న‌లు తోసిపుచ్చి.. పార్టీల్లోకి నాయ‌కుల‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును వైసీపీలోకి ఆహ్వానించారు.

దీంతో ఆయ‌న‌కు మైల‌వరం టికెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. ముద్ద‌ర‌బోయిన నూజివీడులో ప‌నిచేసిన అనుభ వం.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభ‌వం కూడా ఉన్నాయి. పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కూడా కావ‌డంతో వైసీపీ మైల‌వ‌రం వైపు ఆయ‌న‌ను పంపించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ ప‌రిశీల‌న చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, పెన‌మ‌లూరులో ఇప్ప‌టికే మంత్రి జోగి ర‌మేష్‌కు టికెట్ ఇచ్చేస్తామ‌ని చెప్పారు.

దీంతో వైసీపీ వైపు నుంచి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్లారిటీ ఉంది. ఇక‌, నూజివీడును సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావుకే ఇవ్వ‌నున్నారు. టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొన‌గా.. తాజాగా నూజివీడు పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా పెన‌మ‌లూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థికి ప‌గ్గాలు ఇస్తున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఇక‌, మిగిలింది.. మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు. పెన‌మ‌లూరు, మైల‌వ‌రం.

పెన‌మ‌లూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌ను ప‌క్క‌న పెడుతున్న‌ట్టు స‌మాచారం చేరిపోయింది. ఆయ‌న గురించి స్థానికంగా చంద్ర‌బాబు ఐవీఆర్ ఎస్ ద్వారా స‌ర్వే చేశార‌ని.. ఈ స‌ర్వేలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఫ‌లితం వ‌చ్చింద‌ని పార్టీ చెబుతోంది. దీంతో ఇక్కడ ఎవ‌రిని నియ‌మిస్తార‌నేది చూడాలి. మ‌రోవైపు.. మైల‌వ‌రం టికెట్‌ను ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌ను టీడీపీ ఆద‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ కేటాయించాల్సి ఉంది. వీటి నియామ‌కాల‌పై ఇంకా స్ప‌ష్టత రాలేదు. మ‌రోవైపు.. 20 రోజుల్లోనే ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంది. ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 21, 2024 11:03 pm

Share
Show comments

Recent Posts

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

2 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

5 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

5 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

8 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

9 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

9 hours ago