Political News

నూజివీడు – మైల‌వ‌రం – పెన‌మ‌లూరు సీట్లు వీళ్ల‌కే!

టీడీపీ, వైసీపీల్లో రాజ‌కీయ దుమారం పెరుగుతోంది. నాయ‌కుల జంపింగులు కూడా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు నుంచి ఎటు మారుతున్నారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, వేరే పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకునేది లేదు.. అని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీసుకున్న వైసీపీ కానీ, టీడీపీ కానీ.. స్వీయ నిబంధ‌న‌లు తోసిపుచ్చి.. పార్టీల్లోకి నాయ‌కుల‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును వైసీపీలోకి ఆహ్వానించారు.

దీంతో ఆయ‌న‌కు మైల‌వరం టికెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. ముద్ద‌ర‌బోయిన నూజివీడులో ప‌నిచేసిన అనుభ వం.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభ‌వం కూడా ఉన్నాయి. పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కూడా కావ‌డంతో వైసీపీ మైల‌వ‌రం వైపు ఆయ‌న‌ను పంపించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ ప‌రిశీల‌న చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, పెన‌మ‌లూరులో ఇప్ప‌టికే మంత్రి జోగి ర‌మేష్‌కు టికెట్ ఇచ్చేస్తామ‌ని చెప్పారు.

దీంతో వైసీపీ వైపు నుంచి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్లారిటీ ఉంది. ఇక‌, నూజివీడును సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావుకే ఇవ్వ‌నున్నారు. టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొన‌గా.. తాజాగా నూజివీడు పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా పెన‌మ‌లూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థికి ప‌గ్గాలు ఇస్తున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఇక‌, మిగిలింది.. మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు. పెన‌మ‌లూరు, మైల‌వ‌రం.

పెన‌మ‌లూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌ను ప‌క్క‌న పెడుతున్న‌ట్టు స‌మాచారం చేరిపోయింది. ఆయ‌న గురించి స్థానికంగా చంద్ర‌బాబు ఐవీఆర్ ఎస్ ద్వారా స‌ర్వే చేశార‌ని.. ఈ స‌ర్వేలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఫ‌లితం వ‌చ్చింద‌ని పార్టీ చెబుతోంది. దీంతో ఇక్కడ ఎవ‌రిని నియ‌మిస్తార‌నేది చూడాలి. మ‌రోవైపు.. మైల‌వ‌రం టికెట్‌ను ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌ను టీడీపీ ఆద‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ కేటాయించాల్సి ఉంది. వీటి నియామ‌కాల‌పై ఇంకా స్ప‌ష్టత రాలేదు. మ‌రోవైపు.. 20 రోజుల్లోనే ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంది. ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 21, 2024 11:03 pm

Share
Show comments

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

7 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

8 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

9 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

11 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

11 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

12 hours ago