Political News

తెలంగాణలో కొత్త సర్వే – కాంగ్రెస్ వైపే మొగ్గా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటి సీట్లు ఖాయమని ఒక సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అనే సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి ఓట్లేస్తారనే విషయంలో అభిప్రాయాలను సేకరించింది. దీని ప్రకారం ఏమి తేలిందంటే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో గెలుస్తుందని. బీఆర్ఎస్ 3-5 సీట్ల మధ్య గెలుస్తుందని, బీజేపీకి 2 నుండి 4 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది.

హైదరాబాద్ లో ఎలాగూ ఎంఐఎం గెలుచుకుంటుంది. అధికారపార్టీ అనే ట్యాగ్ లైన్ కాంగ్రెస్ కు బాగా కలిసొస్తోంది. ఏ రూపంలో అంటే సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలు రూపంలో. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని ర. 10 లక్షలకు పెంచటంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాల్లో మొగ్గు కనబడుతోందని తేలింది. రు. 500 కే గ్యాస్ సిలిండర్లు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని జనాలు నమ్ముతున్నట్లు సర్వేలో తేలింది.

రెండు హామీలను అమల్లోకి తెచ్చారు కాబట్టి, మరో రెండింటి కోసం జరుగుతున్న కసరత్తును జనాలు గమనిస్తున్నారు కాబట్టే హామీల అమలుపై జనాల్లో నమ్మకం పెరుగుతున్నదట. అలాగే నరేంద్రమోడి పరిపాలన అనే ట్యాగ్ లైన్ బీజేపీకి ఉపయోగపడబోతోందని సర్వేలో బయటపడింది. అయితే బీఆర్ఎస్ కు మాత్రం ఎలాంటి ట్యాగ్ లైన్ కనబడలేదు. ఈ సర్వేని ఫిబ్రవరి 11-17 మధ్య జరిగినట్లు సంస్ధ చెప్పింది.

తొందరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులు6 శాతం ఓట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయట. తాజా సర్వేని బట్టి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 6 శాతం ఓట్లను కోల్పోబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ముస్లింల ఓటుబ్యాంకు కూడా బీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళతున్నట్లు స్పష్టంగా కనబడిందట. ప్రధానమంత్రిగా మోడీయే ఉండాలని 34 శాతం జనాలు అభిప్రాయపడ్డారు. రాహుల్ కు మద్దతుగా 23 శాతం, ప్రియాంకగాంధికి అనుకూలంగా 11 శాతం, మమతాబెనర్జికి మద్దతుగా 10 శాతంమంది మొగ్గుచూపటం విశేషం.

Satya

Recent Posts

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

18 minutes ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

35 minutes ago

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

2 hours ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

12 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

15 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

16 hours ago