“రేపు నీ సాక్షికి కూడా అదే గతి పడుతుంది.. జగన్ రెడ్డీ! గుర్తు పెట్టుకో!! ” అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మీడియా సంస్థలకు చెందిన విలేకరులను కొట్టడం, ఒక మీడియా సంస్థ ఆఫీసుపై దాడి చేసిన నేపథ్యంలో బండారు పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “అధికారం శాస్వతం అనుకుంటున్నావు. కానీ, రేపు మారుతుంది. అప్పుడు నీ సాక్షి మీడియా, పత్రికల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఇప్పుడు జరిగిన దానికి నాలుగింతలు జరుగుతుంది” అని హెచ్చరించారు.
అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని దుయ్యబట్టారు. “రెండు నెలలు తర్వాత మేం అధికారంలో వస్తాం.. అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు? అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి పడుతుంది” అని బండారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న సీఎం జగన్పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈవెంట్ మేనేజర్ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
జగన్ క్షమాపణలు చెప్పాలి!
ఎయిర్ పోర్ట్ నుంచి శారదపీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని బండారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ పెడతారా? అని ప్రశ్నించారు. జగన్ ఏమన్నా.. పాకిస్థాన్కు వచ్చాడా? మేమేమన్నా.. పాకిస్థాన్లో ఉన్నామా? అనినిలదీశారు. “విశాఖ ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలి. బూతు రత్న కొడాలి నాని.. గంజాయి నాని.. ఆయన టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు.
This post was last modified on February 21, 2024 4:44 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…