“రేపు నీ సాక్షికి కూడా అదే గతి పడుతుంది.. జగన్ రెడ్డీ! గుర్తు పెట్టుకో!! ” అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మీడియా సంస్థలకు చెందిన విలేకరులను కొట్టడం, ఒక మీడియా సంస్థ ఆఫీసుపై దాడి చేసిన నేపథ్యంలో బండారు పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “అధికారం శాస్వతం అనుకుంటున్నావు. కానీ, రేపు మారుతుంది. అప్పుడు నీ సాక్షి మీడియా, పత్రికల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఇప్పుడు జరిగిన దానికి నాలుగింతలు జరుగుతుంది” అని హెచ్చరించారు.
అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని దుయ్యబట్టారు. “రెండు నెలలు తర్వాత మేం అధికారంలో వస్తాం.. అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు? అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి పడుతుంది” అని బండారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న సీఎం జగన్పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈవెంట్ మేనేజర్ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
జగన్ క్షమాపణలు చెప్పాలి!
ఎయిర్ పోర్ట్ నుంచి శారదపీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని బండారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ పెడతారా? అని ప్రశ్నించారు. జగన్ ఏమన్నా.. పాకిస్థాన్కు వచ్చాడా? మేమేమన్నా.. పాకిస్థాన్లో ఉన్నామా? అనినిలదీశారు. “విశాఖ ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలి. బూతు రత్న కొడాలి నాని.. గంజాయి నాని.. ఆయన టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు.
This post was last modified on February 21, 2024 4:44 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…