Political News

జగన్ పై నాగబాబు పిట్ట కథ..వైరల్

టీడీపీ, జనసేనల పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ టీడీపీ గుర్తు సైకిల్ ను, జనసేన గ్లాస్ గుర్తును జగన్ అవమానించిన వైనంపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో జగన్ కు జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఓ పిట్టకథతో నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు.

విమానాలు తుడిచే ఓ వ్యక్తికి విమానం నడపడం ఎలా అనే పుస్తకం దొరికిందని ఆ వ్యక్తిని జగన్ తో పోలుస్తూ నాగబాబు చురకలంటించారు. విమానం ఇంజన్ స్టార్ట్ కావడం కోసం ఆకుపచ్చ బటన్ నొక్కాలని, విమానం కదిలేందుకు పచ్చ బటన్ నొక్కాలని రాసుందని సంక్షేమ పథకాలకు జగన్ బటన్లు నొక్కుతున్న వైనంపై విమర్శలు గుప్పించారు. విమానం వేగం అందుకోవడానికి నీలం బటన్, గాల్లో విమానం ఎగిరేందుకు ఆరెంజ్ బటన్ నొక్కాలని ఉండటంతో వెనకా ముందు ఆలోచించకుండా ఆ బటన్లను ఆ వ్యక్తి నొక్కేశాడని నాగబాబు చెప్పారు.

ఇక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం కిందకు దిగేందుకు ఈ పుస్తకం రెండో వాల్యూమ్ కొనుక్కోవాలి అనడంతో విమానాలు తుడిచే వ్యక్తి అవాక్కయ్యాడని నాగబాబు సెటైర్లు వేశారు. విమానం అయినా, అధికారం అయినా అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేని వాడు ఎక్కితే ఇలాగే ఉంటుందని, విమానం, రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం నడపడం అంటే బటన్ నొక్కడం కాదని, సమర్థత, అనుభవం కూడా ఉండాలని జగన్ పై నాగబాబు పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం జగన్ పై నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on February 21, 2024 1:33 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

34 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

50 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago