టీడీపీ, జనసేనల పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ టీడీపీ గుర్తు సైకిల్ ను, జనసేన గ్లాస్ గుర్తును జగన్ అవమానించిన వైనంపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో జగన్ కు జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఓ పిట్టకథతో నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు.
విమానాలు తుడిచే ఓ వ్యక్తికి విమానం నడపడం ఎలా అనే పుస్తకం దొరికిందని ఆ వ్యక్తిని జగన్ తో పోలుస్తూ నాగబాబు చురకలంటించారు. విమానం ఇంజన్ స్టార్ట్ కావడం కోసం ఆకుపచ్చ బటన్ నొక్కాలని, విమానం కదిలేందుకు పచ్చ బటన్ నొక్కాలని రాసుందని సంక్షేమ పథకాలకు జగన్ బటన్లు నొక్కుతున్న వైనంపై విమర్శలు గుప్పించారు. విమానం వేగం అందుకోవడానికి నీలం బటన్, గాల్లో విమానం ఎగిరేందుకు ఆరెంజ్ బటన్ నొక్కాలని ఉండటంతో వెనకా ముందు ఆలోచించకుండా ఆ బటన్లను ఆ వ్యక్తి నొక్కేశాడని నాగబాబు చెప్పారు.
ఇక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం కిందకు దిగేందుకు ఈ పుస్తకం రెండో వాల్యూమ్ కొనుక్కోవాలి అనడంతో విమానాలు తుడిచే వ్యక్తి అవాక్కయ్యాడని నాగబాబు సెటైర్లు వేశారు. విమానం అయినా, అధికారం అయినా అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేని వాడు ఎక్కితే ఇలాగే ఉంటుందని, విమానం, రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం నడపడం అంటే బటన్ నొక్కడం కాదని, సమర్థత, అనుభవం కూడా ఉండాలని జగన్ పై నాగబాబు పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం జగన్ పై నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on February 21, 2024 1:33 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…