Political News

జగన్ పై నాగబాబు పిట్ట కథ..వైరల్

టీడీపీ, జనసేనల పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ టీడీపీ గుర్తు సైకిల్ ను, జనసేన గ్లాస్ గుర్తును జగన్ అవమానించిన వైనంపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో జగన్ కు జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఓ పిట్టకథతో నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు.

విమానాలు తుడిచే ఓ వ్యక్తికి విమానం నడపడం ఎలా అనే పుస్తకం దొరికిందని ఆ వ్యక్తిని జగన్ తో పోలుస్తూ నాగబాబు చురకలంటించారు. విమానం ఇంజన్ స్టార్ట్ కావడం కోసం ఆకుపచ్చ బటన్ నొక్కాలని, విమానం కదిలేందుకు పచ్చ బటన్ నొక్కాలని రాసుందని సంక్షేమ పథకాలకు జగన్ బటన్లు నొక్కుతున్న వైనంపై విమర్శలు గుప్పించారు. విమానం వేగం అందుకోవడానికి నీలం బటన్, గాల్లో విమానం ఎగిరేందుకు ఆరెంజ్ బటన్ నొక్కాలని ఉండటంతో వెనకా ముందు ఆలోచించకుండా ఆ బటన్లను ఆ వ్యక్తి నొక్కేశాడని నాగబాబు చెప్పారు.

ఇక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం కిందకు దిగేందుకు ఈ పుస్తకం రెండో వాల్యూమ్ కొనుక్కోవాలి అనడంతో విమానాలు తుడిచే వ్యక్తి అవాక్కయ్యాడని నాగబాబు సెటైర్లు వేశారు. విమానం అయినా, అధికారం అయినా అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేని వాడు ఎక్కితే ఇలాగే ఉంటుందని, విమానం, రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం నడపడం అంటే బటన్ నొక్కడం కాదని, సమర్థత, అనుభవం కూడా ఉండాలని జగన్ పై నాగబాబు పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం జగన్ పై నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on February 21, 2024 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago