Political News

నిన్న జ‌ర్న‌లిస్టు.. నేడు కార్యాల‌యం.. సంకటంలో మీడియా ..!

  1950లో పార్ల‌మెంటులో మీడియాపై చ‌ర్చ జ‌రిగింది. “మీడియాను మీరు నియంత్రిస్తున్నారు“ అంటూ.. అప్ప‌ట్లో జ‌నతాపార్టీ ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు. దీనికి స‌మాధానంగా ప్ర‌ధాని హోదాలో ఉన్న నెహ్రూ.. కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. “మీడియా నియంత్ర‌ణ ఈ దేశంలో సాధ్యం కాదు. అదే జ‌రిగితే.. ఇది ప్ర‌జాస్వామ్య దేశం కానేకాదు“ అని అన్నారు. ఆయ‌న ఉన్నన్నాళ్లూ అదే పంథాను పాటించారు. సొంత ప‌త్రిక‌ను న‌డుపుకొన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఏనాడూ.. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోలేదు. చైనాతో యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు నెహ్రూ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతూ.. సొంత ప‌త్రిక‌లో క‌ధనంతో పాటు.. ఎడిటోరియ‌ల్ కూడా రాశారు.

అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు 77 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. దేశంలో మీడియా ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌నీయాంశంగానే మారిపోయింది. ముఖ్యంగా త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశాలే కాదు.. ఆందోళ‌న‌ల‌కు కూడా దారితీస్తున్నాయి. నిజానికి 2014 నుంచి కూడా ఇలాంటి ప‌రిస్థితులు ఉన్నాయి. అధికారంలో ఎవ‌రు ఉన్నా.. మీడియాను నియంత్రించే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న‌ది నిర్వివాదాంశం. మీరు మా మీటింగుల‌కు రావొద్దంటూ.. గ‌త ప్ర‌భుత్వంలోనూ ఓ మీడియాకు ఆంక్ష‌లు విధించారు.

ఇక‌, ఇప్పుడున్న ప్ర‌భుత్వం కూడా.. కొన్ని మీడియా సంస్థ‌ల‌ను నేరుగానే విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, గ‌త రెండు రోజుల్లో ఎవ‌రూ ఊహించ‌డానికి కూడా వీల్లేని విధంగా మీడియాపై దాడులు జ‌రుగుతున్నాయి. ఓ ప‌త్రిక ఫొటో జ‌ర్న‌లిస్టును అధికార పార్టీ నాయ‌కులు త‌న్న‌డం.. ఆయ‌న గాయాల‌పాలై ఆసుప‌త్రిలో చికిత్స పొంద‌డం తెలిసింది. ఇది ఇంకా తెర‌మ‌రుగు కాక‌ముం దే.. మ‌రో ప్రాంతం(సీమ‌)లో ఎమ్మెల్యే అనుచ‌రులు ఏకంగా ఓ ప‌త్రికా కార్యాల‌యంపై రాళ్ల‌దాడి చేశారు. సిబ్బందిని బెదిరించారు. దీంతో వారు ప‌త్రికా కార్యాల‌యానికి .. తాళం వేసి ప‌రార‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, అదే ప‌త్రిక‌కు చెందిన మ‌రో విలేక‌రిపైనా.. దాడులు చేశారు. చావు తప్పిన‌ట్టు స‌ద‌రు విలేక‌రి తృటిలో త‌ప్పించుకున్నారు. ఈ ప‌రిణామాలు చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. ఇవి ప్ర‌జాస్వామ్య యుత‌మేనా? అనేచర్చ జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మీడియా కూడా అనే మాట ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వినిపిస్తోంది. యాజ‌మాన్యాలు అనుస‌రిస్తున్న విధానాలతో మీడియా మిత్రులు.. ఇప్పుడు తీవ్ర‌మైన సంక‌ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న దుస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. మ‌రి దీనిని అదుపు చేసేదెవ‌రు?  ఎప్పుడు లైన్‌లోకి వ‌స్తాయి? అనేది కాల‌మే నిర్ణ‌యించాలి.

This post was last modified on February 21, 2024 1:57 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

2 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

2 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

3 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

4 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

4 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

6 hours ago