Political News

బాలినేని పంతం నెగ్గించుకున్నారా

ఒంగోలు ఎంఎల్ఏ, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లే ఉన్నారు. తన నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 25 వేల ఇళ్ళపట్టాలను పంపిణీ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది లేదని బాలినేని చాలాకాలంగా చెబుతున్నారు. ఇదే విషయమై పట్టుబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై బాలినేని చాలాసార్లు అలిగారు కూడా. సరే మార్గం ఏదైనా, ప్రయత్నాలు ఎలాచేసినా 25 వేల ఇళ్ళపట్టాలు పంపిణీ చేయటానికి రంగం సిద్ధమైంది.

ఈనెల 23వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఒంగోలుకు రాబోతున్నారు. భారీ బహిరంగసభ నిర్వహించి పట్టాల పంపిణీ చేయబోతున్నారు. భూసేకరణకు ప్రభుత్వం రు. 170 కోట్లు విడులచేసింది. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగనని చాలాకాలం క్రితమే బాలినేని ప్రకటించారు. దాని ప్రకారం భూసేకరణ, సౌకర్యాల ఏర్పాటు తదితరాల కోసం ప్రభుత్వం తాజాగా 170 కోట్లను విడుదలచేసింది. ఇప్పటికే జిల్లా అధికారులు భూమిని ఎంపికచేసి అవసరమైన ఏర్పాట్లు చేశారు. డబ్బులు మంజూరవ్వటమే మిగిలింది.

తాజాగా ఆ ముచ్చట కూడా అయిపోయింది కాబట్టే పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో జగన్ పాల్గొనబోతున్నారు. కాబట్టి బాలినేని లాంగ్ పెండింగ్ డిమాండ్ నెరవేరిందనే అనుకోవాలి. కాబట్టి ఇకనైనా తన అలకను వదిలేసి ఎన్నికల ప్రక్రియలో బాలినేని నూరుశాతం పాల్గొంటారని అనుకుంటున్నారు. బాలినేని రెండు అంశాలపై బాగా పట్టుబట్టారు. అవేమిటంటే ఒంగోలు పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ, ఒంగోలు ఎంపీ అభ్యర్ధికి మాగుంట శ్రీనివాసులరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వటం.

చాలాకాలం రెండింటిని జగన్ పెండింగ్ పెట్టారు. దాంతో బాలినేని కూడా చాలాసార్లు అలగటం, బుజ్జగింపులు తదితరాలన్నీ జరగాయి. మాగంటకు టికెట్ ఇచ్చేదిలేదని తేల్చిచెప్పిన జగన్ పేదలకు ఇళ్ళపట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగానే రు. 170 కోట్లను విడుదలచేసింది. దాంతో బాలినేని కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. ఇళ్ళపట్టాల పంపిణీ పూర్తయిపోతే జిల్లా రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నది. మరి ఒంగోలు ఎంపీగా ఎవరు పోటీచేస్తారు ? దాని ప్రభావం మిగిలిన అసెంబ్లీల్లో ఎలాగ పడుతుందో చూడాలి.

This post was last modified on February 21, 2024 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

2 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

3 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

4 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

5 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

6 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

6 hours ago