Political News

పవన్ ప్రకటనలు వ్యూహాత్మకమేనా ?

జిల్లాల పర్యటనల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. డైరెక్టుగా అభ్యర్ధులని కాకుండా నియోజకవర్గాల ఇన్చార్జిల పేరుతో ప్రకటనలు చేస్తున్నారు. రాజమండ్రి పర్యటనలో పవన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ ను ఇన్చార్జిగా ప్రకటించారు. నిజానికి ఇపుడు దుర్గేష్ ను ఇన్చార్జిగా ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చాలాకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయటానికి దుర్గేష్ ఏర్పాటు చేసుకుంటున్నారు. టికెట్ తనకే వస్తుందన్న భరోసాతో చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ తన భుజానే మోస్తున్నారు.

కాబట్టి ఇపుడు అభ్యర్ది అని కాకుండా ఇన్చార్జని పవన్ ప్రకటించారంతే. రాజానగరం నియోజకవర్గాన్ని జనసేనే పోటీచేస్తుందని కూడా పవన్ ప్రకటించారు. కాకపోతే అభ్యర్ధని కాని లేకపోతే ఇన్చార్జని కాని ప్రకటించలేదు. మొన్నటికి మొన్న విశాఖపట్నం పర్యటనలో నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గం ఇన్చార్జిగా వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ ని నియమించారు. గాజువాకలో సుందరపు సతీష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్, ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ ను పవన్ ఇన్చార్జిగా ప్రెకటించారు. అందరికీ తెలుసు పవన్ చేస్తున్నది అభ్యర్ధుల ప్రకటనే అని.

ఒకపుడు చంద్రబాబునాయుడు దారిలోనే మిత్రపక్షం అధినేత నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. అప్పట్లో చంద్రబాబు నాలుగు నియోజకవర్గాల్లో డైరెక్టుగా అభ్యర్ధులనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఇపుడు పవన్ వరుసగా తన జిల్లాల పర్యటనలో ఇన్చార్జీలను ప్రకటిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎందుకిలా రకరకాలుగా ప్రకటిస్తున్నట్లు ? ఎందుకంటే పొత్తులో సీట్ల సర్దుబాటు ఫైనల్ చేసుకునే సమయంలో బీజేపీ కూడా దూరింది. దాంతో ఇద్దరు తమ ప్రకటనలను ఎక్కడివక్కడే ఆపేశారు.

అయితే బీజేపీతో పొత్తు విషయం ఆలస్యమయ్యేట్లు కనబడుతోంది. ముందు చంద్రబాబు ఎన్డీయేలో చేరాలి. ఆ తర్వాత పొత్తు, సీట్ల సర్దుబాటు జరగాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి చాలా రోజులు పట్టేట్లుంది. అందుకనే కచ్చితంగా టీడీపీ, జనసేన పోటీ చేస్తుందని నమ్మకం ఉన్న సీట్లను ఇద్దరూ ప్రకటించేస్తున్నారు. పవన్ లేటుగా జోరుపెంచారంతే. మరి పొత్తులు, సీట్ల సర్దుబాట్లను బీజేపీ ఎప్పుడు ఫైనల్ చేస్తుందో ఏమో చూడాల్సిందే.

This post was last modified on February 21, 2024 12:10 pm

Share

Recent Posts

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

26 minutes ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

31 minutes ago

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…

3 hours ago

స్థానికాల తరువాత మంత్రివర్గ మార్పులు తప్పవా?

మంత్రులు మౌనంగా ఉంటే స‌హించేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రుల‌కు ఆయ‌న ఈ విష‌యంలో…

4 hours ago

వారణాసి కానుకలు… తప్పని షరతులు

ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…

4 hours ago

సందీప్ కిషన్ కరికాల… 2 పార్టులు… నాలుగు నెలలు!

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…

4 hours ago