మొదటి నుండి కూడా బీఆర్ఎస్ లో కేసీయార్ తర్వాత నలుగురు నేతలదే మొత్తం పెత్తనంగా ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నపుడు, అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఇదే పద్దతి నడిచింది. కాని ఒకే ఒక ఓటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు నలుగురు నాలుగు వైపుల పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీయార్ కొడుకు కేటీయార్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు మరో దగ్గరి బంధులు జోగినపల్లి సంతోష్ దారులు వేరయిపోయాయట.
అధికారంలో ఉన్నంత కాలం వీళ్ళు ఎలాగున్నా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళపైన కేసీయార్ అన్నీ వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకునే వారు. వీళ్ళకి కేసీయార్ బాధ్యతలు అప్పగించి ఓవరాల్ గా పర్యవేక్షణ చేసేవారు. దాంతో ఎక్కడైనా లోపాలున్నా, తప్పులు జరిగినా పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కాని ఓటమి తర్వాత నలుగురు నాలుగు దారులవ్వటంతో పార్టీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.
ఓటమిదెబ్బకు కేసీయార్ కూడా ఆత్మరక్షణలో పడిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కూడా కాలేదు. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సొస్తుందనే కేసీయార్ రావటంలేదని కాంగ్రెస్ నుండి సెటైర్లు పేలుతున్నాయి. తాజా అసెబ్లీ సమావేశాలనే తీసుకుంటే బీఆర్ఎస్ తరపున హరీష్ దే వన్ మ్యాన్ షో అయిపోయింది. కేసీయార్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగాయని రేవంత్ అండ్ కో ధ్వజమెత్తుతుంటే కేటీయార్ తిప్పికొట్టలేకపోయారు.
దాంతో తాజా సెషన్లో కేటీయార్ సైడయిపోయి హరీష్ బాగా హైలైట్ అయ్యారు. ఇక కవిత తన జాగృతి సంస్ధను పెట్టుకుని వ్యవహారాలు నడుపుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ విచారణ విషయంలో ఆమెలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పొరబాటున కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడటం లేదు. తనకు రెండో టర్మ్ రాజ్యసభ పదవి ఇవ్వనందుకు సంతోష్ అలిగారని పార్టీవర్గాల టాక్. పదేళ్ళ పాటు పార్టీలో, ప్రభుత్వంలో బాగా యాక్టివ్ గా ఉన్న సంతోష్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత, రాజ్యసభ ఎన్నిక తర్వాత అసలు కనబడటమే మానేశారని పార్టీలో టాక్ వినబడుతోంది. వీళ్ళ మధ్య సమన్వయం చేయటంలో కేసీయార్ కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదట. పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం ఎలుగంటుందో ఏమో చూడాలి.
This post was last modified on February 20, 2024 10:26 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…