మొదటి నుండి కూడా బీఆర్ఎస్ లో కేసీయార్ తర్వాత నలుగురు నేతలదే మొత్తం పెత్తనంగా ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నపుడు, అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఇదే పద్దతి నడిచింది. కాని ఒకే ఒక ఓటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు నలుగురు నాలుగు వైపుల పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీయార్ కొడుకు కేటీయార్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు మరో దగ్గరి బంధులు జోగినపల్లి సంతోష్ దారులు వేరయిపోయాయట.
అధికారంలో ఉన్నంత కాలం వీళ్ళు ఎలాగున్నా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళపైన కేసీయార్ అన్నీ వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకునే వారు. వీళ్ళకి కేసీయార్ బాధ్యతలు అప్పగించి ఓవరాల్ గా పర్యవేక్షణ చేసేవారు. దాంతో ఎక్కడైనా లోపాలున్నా, తప్పులు జరిగినా పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కాని ఓటమి తర్వాత నలుగురు నాలుగు దారులవ్వటంతో పార్టీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.
ఓటమిదెబ్బకు కేసీయార్ కూడా ఆత్మరక్షణలో పడిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కూడా కాలేదు. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సొస్తుందనే కేసీయార్ రావటంలేదని కాంగ్రెస్ నుండి సెటైర్లు పేలుతున్నాయి. తాజా అసెబ్లీ సమావేశాలనే తీసుకుంటే బీఆర్ఎస్ తరపున హరీష్ దే వన్ మ్యాన్ షో అయిపోయింది. కేసీయార్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగాయని రేవంత్ అండ్ కో ధ్వజమెత్తుతుంటే కేటీయార్ తిప్పికొట్టలేకపోయారు.
దాంతో తాజా సెషన్లో కేటీయార్ సైడయిపోయి హరీష్ బాగా హైలైట్ అయ్యారు. ఇక కవిత తన జాగృతి సంస్ధను పెట్టుకుని వ్యవహారాలు నడుపుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ విచారణ విషయంలో ఆమెలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పొరబాటున కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడటం లేదు. తనకు రెండో టర్మ్ రాజ్యసభ పదవి ఇవ్వనందుకు సంతోష్ అలిగారని పార్టీవర్గాల టాక్. పదేళ్ళ పాటు పార్టీలో, ప్రభుత్వంలో బాగా యాక్టివ్ గా ఉన్న సంతోష్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత, రాజ్యసభ ఎన్నిక తర్వాత అసలు కనబడటమే మానేశారని పార్టీలో టాక్ వినబడుతోంది. వీళ్ళ మధ్య సమన్వయం చేయటంలో కేసీయార్ కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదట. పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం ఎలుగంటుందో ఏమో చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…