గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తనయుడు, అప్పటికే మంత్రిగా కూడా పని చేసిన నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్ను ఓడించి సంచలనం రేపిన నేత.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటన చేసి, ఆ తర్వాత పార్టీ స్టాండ్కు తగ్గట్లే యుటర్న్ తీసుకోవడంతో స్థానికంగా చాలా వ్యతిరేకతే ఎదుర్కొన్నారు రామకృష్ణారెడ్డి.
జగన్ ఏం చెబితే అది చేసిన ఈ నేతకు ఈసారి టికెట్ లేదని సంకేతాలు రావడంతో ఆయన కొన్ని రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ను తిట్టను అంటూ ఆయన సోదరి వైఎస్ షర్మిళ పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్ల. ఆ పార్టీ తరఫునే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకుంటే.. ఉన్నట్లుండి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
షర్మిళకు షాకిస్తూ.. నెల తిరక్కముందే తిరిగి వైసీపీలో చేరిపోయారు రామకృష్ణారెడ్డి. ఈ రోజే ఆయన సీఎం జగన్ను కలిసి తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ రోజుకు సోషల్ మీడియలో ఇదే హాట్ టాపిక్. అసలు వైసీపీ నుంచి ఎందుకు పోయినట్లు.. ఇంతలోనే ఎందుకు తిరిగొచ్చినట్లు అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా జగన్ వేసిన స్కెచ్లో భాగమా అనే చర్చ కూడా జరుగుతోంది. షర్మిళ పంచన చేరి ఆమె ఆలోచనలన్నీ తెలుసుకునేందుకే ఆయన్ని కోవర్టుగా పంపారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇదే ఉద్దేశంతో ‘‘ఏజెంట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి రిపోర్టింగ్ సర్’ అంటూ ఆళ్ల ఫొటో పెట్టి మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు తన కొడుకు ఎంగేజ్మెంట్ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి, మ్యారేజ్ టైంకి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయాడంటూ షర్మిళ అంటున్నట్లు కూడా ఒక మీమ్ రెడీ చేసి వదిలారు సోషల్ మీడియాలో. గత ఎన్నికల టైంలో, ఆ తర్వాత ఆళ్ల చేసిన విన్యాసాలతో ‘కరకట్ట కమల్ హాసన్’ అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన మరింతగా సోషల్ మీడియాకు టార్గెట్ కాబోతున్నారు.
This post was last modified on February 20, 2024 4:32 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…