గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తనయుడు, అప్పటికే మంత్రిగా కూడా పని చేసిన నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్ను ఓడించి సంచలనం రేపిన నేత.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటన చేసి, ఆ తర్వాత పార్టీ స్టాండ్కు తగ్గట్లే యుటర్న్ తీసుకోవడంతో స్థానికంగా చాలా వ్యతిరేకతే ఎదుర్కొన్నారు రామకృష్ణారెడ్డి.
జగన్ ఏం చెబితే అది చేసిన ఈ నేతకు ఈసారి టికెట్ లేదని సంకేతాలు రావడంతో ఆయన కొన్ని రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ను తిట్టను అంటూ ఆయన సోదరి వైఎస్ షర్మిళ పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్ల. ఆ పార్టీ తరఫునే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకుంటే.. ఉన్నట్లుండి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
షర్మిళకు షాకిస్తూ.. నెల తిరక్కముందే తిరిగి వైసీపీలో చేరిపోయారు రామకృష్ణారెడ్డి. ఈ రోజే ఆయన సీఎం జగన్ను కలిసి తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ రోజుకు సోషల్ మీడియలో ఇదే హాట్ టాపిక్. అసలు వైసీపీ నుంచి ఎందుకు పోయినట్లు.. ఇంతలోనే ఎందుకు తిరిగొచ్చినట్లు అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా జగన్ వేసిన స్కెచ్లో భాగమా అనే చర్చ కూడా జరుగుతోంది. షర్మిళ పంచన చేరి ఆమె ఆలోచనలన్నీ తెలుసుకునేందుకే ఆయన్ని కోవర్టుగా పంపారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇదే ఉద్దేశంతో ‘‘ఏజెంట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి రిపోర్టింగ్ సర్’ అంటూ ఆళ్ల ఫొటో పెట్టి మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు తన కొడుకు ఎంగేజ్మెంట్ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి, మ్యారేజ్ టైంకి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయాడంటూ షర్మిళ అంటున్నట్లు కూడా ఒక మీమ్ రెడీ చేసి వదిలారు సోషల్ మీడియాలో. గత ఎన్నికల టైంలో, ఆ తర్వాత ఆళ్ల చేసిన విన్యాసాలతో ‘కరకట్ట కమల్ హాసన్’ అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన మరింతగా సోషల్ మీడియాకు టార్గెట్ కాబోతున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…