Political News

తలసానికి ఉచ్చు బిగుసుకుంటోందా ?

అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే తర్వాత అందుకు మూల్యం చెల్లించక తప్పదంటారు పెద్దలు. ఇపుడీ విషయం ఎందుకంటే మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురించే. మంత్రిగా ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు తొందరలోనే మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. బీసీ బంధు విషయంలో కేసీయార్ హయాంలో అమలైన పథకాల్లో బీసీలకు గొర్రెల పంపిణీ పథకం కూడా ఒకటి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, బిల్లులు చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ.

ఇవి ఆరోపణలు మాత్రమే కావని నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అయ్యాయని, అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రిపోర్టులో స్పష్టంగా ఉంది. బాధ్యులను గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా కాగ్ సూచించింది. అప్పటికే పథకం అమలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీసులు పశుసంవర్ధక శాఖ ఉన్నతాదికారులపై కేసులు నమోదుచేశారు. వారితో పాటు మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాసయాదవ్ పేషీలో పనిచేసిన అధికారులపైన కూడా కేసులు నమోదయ్యాయి.

పోలీసులు జరిపిన విచారణలో చాలా విషయాలు వెలుగుచూశాయట. ఇది పూర్తిగా నిధుల దుర్వినియోగం, అవినీతి వ్యవహారం కాబట్టి తర్వాత పోలీసులు కేసును ఏసీబీకి బదిలీచేశారు. బాధ్యతలు తీసుకోగానే ఏసీబీ ఉన్నతాధికారులు ఏపీలోని ఒంగోలుకు వెళ్ళి విచారణ జరిపారు. అక్కడి వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఒంగోలుకు ఎందుకు వెళ్ళారంటే తెలంగాణా పథకంలో పంపిణీ చేసిన గొర్రెలను ఒంగోల నుండే సరఫరా చేశారు కాబట్టి. అసలు ఈ వ్యవహారమంతా బయటపడింది కూడా గొర్రెల సరఫరాదారుల నుండే.

ఎలాగంటే పథకం పంపిణీకి వీలుగా ఒంగోలులో గొర్రెల పంపిణీ దారులు 130 యూనిట్లను సరఫరా చేశారట. ఒక యూనిట్ అంటే 21 గొర్రెలు. దశలవారీగా సరఫరా అయిన యూనిట్ల గొర్రెలకు బిల్లులు మాత్రం చెల్లించలేదట. కొంతకాలం తర్వాత తమకు రావాల్సిన డబ్బుల గురించి గొర్రెల సరఫరాదారులు హైదరాబాద్ కు వచ్చి వాకాబు చేశారట. అయితే గొర్రెల పంపిణీదారులకు డబ్బులు ఎప్పుడో సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉందట.

దాంతో పంపిణీదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంది. దాంతో అప్పటి అవినీతంతా బయటపడింది. శాఖలోని చాలామంది మీద పోలీసులు ఇప్పటికే కేసులు నమోదుచేసి విచారిస్తున్నారు. అందరి వేళ్ళు తలసాని వైపే చూపుతున్నాయట. అందుకనే తలసాని మెడకు గొర్రెల ఉచ్చు బిగుసుకుంటోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on February 20, 2024 2:26 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

11 minutes ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

2 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

4 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

6 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

6 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

7 hours ago