Political News

అడ్డగోలు సంతకాలు పెట్టేది లేదు.. తేల్చేసిన సీఎం రేవంత్

రేవంత్ సర్కారు ఏర్పడి రోజులు గడుస్తున్నా.. కొన్ని అంశాల్లో దూకుడు ప్రదర్శించటం లేదన్న మాట తరచూ వినిపిస్తోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉందన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా మరో ప్రచారం మొదలైంది. రియల్ ఎస్టేట్ కు ఊపు తెప్పించేలా హెచ్ఎండీఏ నిర్ణయాల్ని ప్రకటించటం లేదని.. చివరకు ప్రాజెక్టుల అనుమతుల విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పించి హడావుడి నిర్ణయాలకు వెళ్లటం లేదు. ఈ తీరును కొందరు స్వాగతిస్తుంటే.. రియల్టర్లు మాత్రం తప్పు పడుతున్నారు.

డెవలప్ మెంట్ ప్రాజెక్టుల విషయంలో జోరును ప్రదర్శించాలని వారు కోరుతున్నారు. అయితే.. ఈ చర్చపై తాజాగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వ విధానాల్ని స్పష్టం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము అనాలోచిత నిర్ణయాలు తీసుకోమని.. తొందరపడి సంతకాలు పెట్టేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలక్రిష్ణ మాదిరి జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఆయన.. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పైనా సెటైర్లు వేయటం గమనార్హం.

‘సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్కయితది. మేం అపరమేధావులం కాదు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోం. ఏ నిర్ణయంలోనైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు.. వైఎస్సార్.. కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. పాలనను అర్థం చేసుకోకుండా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెడితే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలక్రిష్ణకు పట్టిన గతే పడుతుంది. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను క్రమపద్దతిలో పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు.. ఫైళ్ల మీద సంతకాల విషయంలో తాను ఎంత కచ్ఛితంగా ఉన్నానన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో చెప్పేశారని చెబుతున్నారు. అంతేకాదు.. ఏదైనా పనులు ఉంటే తనను కలవొద్దని.. పార్టీకి సంబంధించిన పనుల మీద మాత్రం తనను కలవొచ్చన్న రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

This post was last modified on February 19, 2024 12:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

1 hour ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

3 hours ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

3 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

4 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

5 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

5 hours ago