Political News

చంద్ర‌బాబుదే గెలుపు: ఉండ‌వ‌ల్లి

త‌ర‌చుగా మీడియా స‌మావేశాలు రాష్ట్ర రాజకీయాల‌పై విశ్లేష‌ణ చేసే మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ తాజాగా.. ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అన్నారు. “చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయ‌నే గెలుస్తారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు” అని వ్యాఖ్యానించారు.

ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తాను మీడియా ముందుకు వ‌చ్చిన‌ట్టు అరుణ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో పార్ల‌మెంటుకు హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. “ఏపీ విభజన తప్పా, కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. టెర్రరిస్టులు పార్లమెంట్‌పై దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూయలేదు. ఏపీ విభజన సమయంలోనే తలుపులు మూసేశారు” అని అన్నారు. ఇది స‌రైన విధాన‌మేనా? అని నిప్పులు చెరిగారు.

ఇక‌, నిధుల గురించి మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 70 శాతం నిధులు ఇస్తోందన్న ఆయ‌న అదే చేత్తో కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు పూర్తయినప్ప‌టికీ విభజన హామీ చట్టం అమలు చేయడం లేదని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల మేర‌కు ఏపీ సీఎంజ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేయ‌డం కోసం.. కేంద్రాన్ని ఏమేర‌కు ప్ర‌శ్నించారో.. చెప్పాల‌ని కోరారు. 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు.. 9 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు.. ఈ దేశంలో ఒక పార్టీకి ఉండ‌డం గొప్ప విష‌య‌మ‌ని.. అయినా.. కూడా ఆయ‌న ఏమీ సాధించ‌లేక పోయార‌ని.. రేపు ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతార‌ని ప్ర‌శ్నించారు.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

55 minutes ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

8 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

10 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

12 hours ago