కాంగ్రెస్ లో చేరికల జోష్ పెరిగిపోతోంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తంపార్టీలో చేరుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. అధికారపార్టీ నేత కంచర్ల చంద్రశేఖరరెడ్డి కూడా జాయిన్ అయ్యారు.
తొందరలోనే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. వీళ్ళదారిలోనే మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా హస్తంపార్టీలో చేరటానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది నేతలు కేవలం అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. చాలామంది నేతలకు సిద్ధాంతాలు పాడు ఏమీ ఉండటంలేదు. అధికారం ఉండాలి లేకపోతే అధికారపార్టీలో ఉండాలంతే. ఎందుకంటే తమ వ్యాపారాలను, ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేతల నుండి జనాలు ఏమీ ఆశించేందుకు లేదు.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి వస్తున్న నేతలందరినీ చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం ఖాయం. ఎందుకంటే మందెక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే సామెత అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కూడా అలాగే తయారవుతుంది. బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ముణిగిపోయిందంటే ఇలాంటి నేతలవల్లే అని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నపుడు అడ్డదిడ్డమైన సంపాదనకు లాకులెత్తిన కొందరు ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు తెచ్చారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే అలాంటి నేతలే ఇపుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఇక్కడ చేరిన తర్వాత మళ్ళీ తమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహంలేదు. కొద్దిరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గబ్బుపట్టిపోతుంది. తర్వాత ఎన్నికల్లో గెలిస్తే ఓకే అలాకాకుండా ఓడిపోతే మాత్రం మళ్ళీ ఇదే నేతలు అప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోవటం ఖాయం. కాబట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేర్చుకుంటే బాగుంటుంది లేకపోతే కాంగ్రెస్ కూడా ముణిగిపోవటం ఖాయం.
This post was last modified on February 21, 2024 8:54 am
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…