Political News

కాంగ్రెస్ లో చేరికల జోష్..

కాంగ్రెస్ లో చేరికల జోష్ పెరిగిపోతోంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తంపార్టీలో చేరుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. అధికారపార్టీ నేత కంచర్ల చంద్రశేఖరరెడ్డి కూడా జాయిన్ అయ్యారు.

తొందరలోనే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. వీళ్ళదారిలోనే మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా హస్తంపార్టీలో చేరటానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది నేతలు కేవలం అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. చాలామంది నేతలకు సిద్ధాంతాలు పాడు ఏమీ ఉండటంలేదు. అధికారం ఉండాలి లేకపోతే అధికారపార్టీలో ఉండాలంతే. ఎందుకంటే తమ వ్యాపారాలను, ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేతల నుండి జనాలు ఏమీ ఆశించేందుకు లేదు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి వస్తున్న నేతలందరినీ చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం ఖాయం. ఎందుకంటే మందెక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే సామెత అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కూడా అలాగే తయారవుతుంది. బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ముణిగిపోయిందంటే ఇలాంటి నేతలవల్లే అని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నపుడు అడ్డదిడ్డమైన సంపాదనకు లాకులెత్తిన కొందరు ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు తెచ్చారు.

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే అలాంటి నేతలే ఇపుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఇక్కడ చేరిన తర్వాత మళ్ళీ తమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహంలేదు. కొద్దిరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గబ్బుపట్టిపోతుంది. తర్వాత ఎన్నికల్లో గెలిస్తే ఓకే అలాకాకుండా ఓడిపోతే మాత్రం మళ్ళీ ఇదే నేతలు అప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోవటం ఖాయం. కాబట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేర్చుకుంటే బాగుంటుంది లేకపోతే కాంగ్రెస్ కూడా ముణిగిపోవటం ఖాయం.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

6 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

6 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

6 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

7 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

8 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

9 hours ago