ఏపీ రాజధాని ‘అమరావతి’ విధ్వంసం.. ఇక్కడి రైతుల ఆవేదన, ఉద్యమం, ఆందోళనలు, పాదయాత్ర.. వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రకటన తదనంతర పరిణామాలను కధా వస్తువుగా చేసుకుని రూపొందించిన ‘రాజధాని ఫైల్స్’ సినిమాను అందరూ చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారం అండతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాజధానిపై వైసీపీ కుట్రలు, దారుణాలకు ‘రాజధాని ఫైల్స్’ చిత్రం అద్దం పట్టింది. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలి. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఈ చిత్ర విడుదలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ న్యాయస్థానంలో వారి ఆటలు సాగలేదు. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది… కాస్కో” అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇక, టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా.. సినిమా పై ఏకంగా రివ్యూనే రాసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించారని.. రైతుల ఆవేదన, బాధతో పాటు.. రాష్ట్రానికి అమరావతి ప్రయోజనం.. దానివల్ల ఒనకూరే లబ్ధిని కళ్లకు కట్టినట్టు వివరించారని.. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీలో ఉన్న ప్రజలతోపాటు.. అమరావతిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ దుర్మార్గాలకు అంతులేకుండా పోయిందని.. రైతులను ఎలా చిత్రహింసలకు గురి చేశారో.. ఈ సినిమా కళ్లకు కట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. టీడీపీ సీనియర్ నాయకుల కోసం.. తెనాలిలోని ఓ సినిమా హాల్ను శనివారం తొలి ఆట కోసం బుక్ చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…