Political News

బొత్స వారి రాయ‌బారం.. వ‌ర్క‌వుట్ కాని వైసీపీ!

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ.. వైసీపీలో టికెట్ల పందేరం పెద్ద వివాదాన్నే రేపుతోంది. టికెట్లు ద‌క్కిన వారు కూడా.. త‌మ‌కు ఇచ్చిన స్థానాల‌ను చూసుకుని నిరాశ‌గా ఉన్నారు. ఇక‌, టికెట్లు ద‌క్క‌ని వారు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ల‌ను వైసీపీ సీనియ‌ర్ మంత్రి, ఇదే జిల్లాకు చెందిన షార్ప్ షూట‌ర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు అప్ప‌గించింది. అయితే.. ఆయన చేస్తున్న రాయ‌బారం ఎక్క‌డా వ‌ర్కవుట్ కావ‌డం లేదు. దీంతో ఏ క్ష‌ణాన ఈ జిల్లా నుంచి ఎవ‌రు జంప్ చేస్తారో అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగిందంటే..

విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొన్నాళ్లుగా తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. త‌మ‌కు అన్యాయంచేస్తున్నార‌ని.. కోల‌గ‌ట్ల ఒంటెత్తు పోక‌డ‌ల‌తో తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలోనే అనేక సార్లు పార్టీకి చెప్పినా అధిష్టానం రెస్సాండ్ కాలేదు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఆయా నేతలు పార్టీకి రాజీనామా లేఖలు పంపారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు త‌లెత్తిన ముస‌లాన్ని స‌రిచేయాల‌ని.. వైసీపీ అధిష్టానం మంత్రి బొత్స సత్యనారాయణకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే.. ఆయ‌న రంగంలోకి దిగి నాయ‌కుల‌ను ఎంత బుజ్జగించినా వారు స‌సేమిరా అంటున్నారు. అంతేకాదు.. త‌మ‌కు పార్టీలో క‌నీస గౌర‌వం కానీ, మ‌ర్యాద కానీ, లేద‌ని బొత్స‌తోనే వ్యాఖ్యానించారు.

ఇంత వరకు కోల‌గ‌ట్ల‌ దౌర్జన్యాలు, అక్రమాలు భరించామని, ఇక తమ వల్లకాదని నేతలు తేల్చి చెప్పారు. విజయనగరంలో వైసీపీ పతనమైపోతోందని పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్పినా ఫలితం లేదన్నారు. ఈ నెల 19వ తేదీన 10 వేల మందితో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నామని పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్ ప్రకటించడం గ‌మ‌నార్హం. దీంతో మంత్రి బొత్స వారిని మ‌రోసారి బుజ్జ‌గించేందుకు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి ఇదైనా ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

This post was last modified on February 15, 2024 11:58 am

Share
Show comments

Recent Posts

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

8 minutes ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

59 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

59 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

3 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

3 hours ago