తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా సీఎం అవుతారో చూస్తానని సవాల్ రువ్వారు. తాజాగా పోలీసు నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. “సీఎంగా ప్రమాణం చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో.. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే సంతోషం వస్తోంది” అని సీఎం రేవంత్ అన్నారు.
నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించామని.. కానీ, ఉద్యోగ నియామకాలం కోసం తొమ్మిదిన్న రేళ్లపాటు బీఆర్ఎస్కు ఆలోచన రాలేదని విమర్శించారు. “నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తూనే నాకు నిద్ర పడుతుంది. మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు.
వీల్ చైర్ సానుభూతి కోసమే..
అసెంబ్లీకి రావాల్సిన మాజీ సీఎం కేసీఆర్ సభకు డుమ్మా కొట్టి నల్లగొండకు వెళ్లాడని సీఎం రేవంత్ అన్నారు. వీల్ చైర్లో తిరుగుతూ.. సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని ఇవాళ అసెంబ్లీలో ఓ అటెండర్ నాకు చెప్పారు” అని రేవంత్ అన్నారు. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదని, మేడిగడ్డ మేడిపండు.. పొట్టవిప్పితే అన్నీ పురుగులే ఉన్నాయని విమర్శలు గుప్పించారు.
పదేళ్ల పాటు అధికారం కాంగ్రెస్దేనని రేవంత్ చెప్పారు. తానే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని.. కేసీఆర్ ఎలా వస్తాడో చూస్తామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 24గంటలూ కష్టపడి పనిచేస్తానని చెప్పారు. “మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తా అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా” అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on February 14, 2024 8:28 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…