వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. చేరబోతున్న ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గంలోని ప్రముఖులే కావడం గమనార్హం. విషయం ఏమిటంటే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరటానికి రంగం సిద్ధమైపోయిందని సమాచారం. మాగుంటకు వైసీపీలో టికెట్ దొరకలేదు కాబట్టి టీడీపీలో చేరబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నదే.
మరి నెల్లూరు ఎంపీగా పోటీచేయాలని కోరుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డికి టికెట్ ఖాయం చేశారు. అయినా ఎందుకు వైసీపీని కాదనుకుని టీడీపీలో చేరబోతున్నట్లు ? ఎందుకంటే పార్లమెంటు పరిధిలోకి వచ్చే నెల్లూరు, కావలి, ఉదయగిరిలో తాను చెప్పిన వాళ్ళకే అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని వేమిరెడ్డి పట్టుబట్టారట. అయితే జగన్ మాత్రం వేమిరెడ్డి అభ్యంతరం మేరకు నెల్లూరు సిటి టికెట్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ కు కాకుండా ఖలీల్ కు కేటాయించారు. అయితే ఖలీల్ ను కూడా వద్దని వేమిరెడ్డి పట్టుబట్టారు.
వేమిరెడ్డి చెప్పినట్లు అభ్యర్థులను మార్చటానికి జగన్ ఇష్టపడలేదు. అందుకనే పోటీ చేయకూడదని అనుకున్నారట. మరి వైసీపీ తరపున పోటీచేయనపుడు ఆల్టర్నేటివ్ ఏముంది ? టీడీపీ మాత్రమే కదా. అందుకనే తొందరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. మంగళవారం చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయ్యారని కూడా అంటున్నారు. ఇక ఆదాల విషయం విచిత్రంగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకున్నారు. ఆదాల అనుకున్నట్లే నెల్లూరు రూరల్ టికెట్ ను జగన్ కేటాయించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల విస్తృతంగా పనిచేసుకుంటున్నారు. అలాంటిది ఆదాల కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో ఎందుకు చేరాలని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. తాను వైసీపీలోనే కంటిన్యు అవుతాననే ఆదాల చెబుతున్నా పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ ఇద్దరు ఎంపీలు తొందరలోనే టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీలో టాక్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on February 14, 2024 1:09 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…