Political News

ఉత్తరాంధ్రకు భారీ క్రేజు

రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల టార్గెట్ ఉత్తరాంధ్ర మీదే ఉన్నట్లుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబునాయుడు ఇప్పటికే చాలాసార్లు ఉత్తరాంధ్రలో పర్యటించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలు సిద్ధం కూడా జగన్ ఉత్తరాంధ్రలోని భీమిలీ నియోజకవర్గంలోనే మొదలుపెట్టారు. తర్వాత కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఈ ప్రాంతం మీద దృష్టిపెట్టారు. ఇప్పటికే అరకు, నెల్లిమర్ల, వైజాగ్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈమె తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారు.

వీళ్ళు కాకుండా తాజాగా నారా లోకేష్ కూడా తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో మొదలుపెట్టారు. యువగళం పాదయాత్ర ముగింపు సభను భీమిలీలోనే పెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే మంగళవారం మళ్ళీ జగన్ వైజాగ్ లో పర్యటించబోతున్నారు. ఏ రకంగా చూసినా అన్నీ పార్టీలు ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమైపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.

పై మూడు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీలు, ఐదు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో శ్రీకాకుళం జిల్లాలో రెండు, వైజాగ్ సిటీలోని నాలుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన 28 సీట్లు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం ఎంపీ మినహా మిగిలిన నాలుగు నియోజవకర్గాల్లో వైసీపీ ఎంపీలే ఉన్నారు. ఇదే రిజల్టును వచ్చేఎన్నికల్లో కూడా రిపీట్ చేయించాలన్నది జగన్ పట్టుదల. అందుకనే ఇంతగా ఉత్తరాంధ్ర మీద కేంద్రీకరించారు.

ఇదే సమయంలో పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. ఒకపుడు ఉత్తరాంధ్రలో టీడీపీ చాలా బలంగా ఉండేది. అలాగే జనసేన కూడా తన ప్రభావాన్ని రాబోయే ఎన్నికల్లో చాటుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. అందుకనే పదేపదే పవన్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నది. వైజాగ్ సిటీలోని నాలుగు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 30 నియోజకవర్గాలు గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాయి. మరి ఇంతమంది దృష్టిపెట్టిన కారణంగా జనాలు ఏ పార్టీని ఆధరిస్తారో చూడాలి.

This post was last modified on February 13, 2024 4:49 pm

Share
Show comments

Recent Posts

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

16 mins ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

19 mins ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

2 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

2 hours ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

2 hours ago