Political News

ఉత్తరాంధ్రకు భారీ క్రేజు

రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల టార్గెట్ ఉత్తరాంధ్ర మీదే ఉన్నట్లుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబునాయుడు ఇప్పటికే చాలాసార్లు ఉత్తరాంధ్రలో పర్యటించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలు సిద్ధం కూడా జగన్ ఉత్తరాంధ్రలోని భీమిలీ నియోజకవర్గంలోనే మొదలుపెట్టారు. తర్వాత కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఈ ప్రాంతం మీద దృష్టిపెట్టారు. ఇప్పటికే అరకు, నెల్లిమర్ల, వైజాగ్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈమె తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారు.

వీళ్ళు కాకుండా తాజాగా నారా లోకేష్ కూడా తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో మొదలుపెట్టారు. యువగళం పాదయాత్ర ముగింపు సభను భీమిలీలోనే పెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే మంగళవారం మళ్ళీ జగన్ వైజాగ్ లో పర్యటించబోతున్నారు. ఏ రకంగా చూసినా అన్నీ పార్టీలు ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమైపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.

పై మూడు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీలు, ఐదు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో శ్రీకాకుళం జిల్లాలో రెండు, వైజాగ్ సిటీలోని నాలుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన 28 సీట్లు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం ఎంపీ మినహా మిగిలిన నాలుగు నియోజవకర్గాల్లో వైసీపీ ఎంపీలే ఉన్నారు. ఇదే రిజల్టును వచ్చేఎన్నికల్లో కూడా రిపీట్ చేయించాలన్నది జగన్ పట్టుదల. అందుకనే ఇంతగా ఉత్తరాంధ్ర మీద కేంద్రీకరించారు.

ఇదే సమయంలో పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. ఒకపుడు ఉత్తరాంధ్రలో టీడీపీ చాలా బలంగా ఉండేది. అలాగే జనసేన కూడా తన ప్రభావాన్ని రాబోయే ఎన్నికల్లో చాటుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. అందుకనే పదేపదే పవన్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నది. వైజాగ్ సిటీలోని నాలుగు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 30 నియోజకవర్గాలు గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాయి. మరి ఇంతమంది దృష్టిపెట్టిన కారణంగా జనాలు ఏ పార్టీని ఆధరిస్తారో చూడాలి.

This post was last modified on February 13, 2024 4:49 pm

Share
Show comments

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

32 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

46 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago