Political News

కేసీఆర్, రేవంత్ టీడీపీ ప్రొడక్ట్ లే: లోకేష్

టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ సీఎంలు అయ్యారని, వారిద్దరూ చంద్రబాబు శిష్యులేనని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు టీడీపీ ప్రొడక్టులేనంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లనుద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీడీపీ ఒక యూనివర్సిటీ వంటిదని, అందులోనుంచి వచ్చిన ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రులు అయ్యారని లోకేష్ అన్నారు. పసుపు జెండా చూస్తే నూతన ఉత్తేజం కలుగుతుంని, అది పార్టీ గొప్పదనం అని కార్యకర్తల్లో లోకేష్ ఉత్సాహం నింపారు. దేశంలో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు లోకేష్. టీడీపీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల రూపాయల భీమా అందించామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.100 కోట్లు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టామన్నారు.

చంద్రబాబుని తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారనని, తనపై కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసుతోపాటు పలు కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలపై జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని, బహిరంగచర్చకు సిద్ధమా? అని లోకేష్ ఛాలెంజ్ చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100కి పైగా కేసులు ఈ ప్రభుత్వం పెట్టిందని, అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులకు కార్యకర్తలు, నేతలు భయపడవద్దని, ఎవరిపై ఎన్ని ఎక్కువ కేసులుంటే వారికి నామినేటెడ్ పదవి ఇస్తానని లోకేష్ అన్నారు.

ఇక, చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేస్తే పవన్ కల్యాణ్ మనకు అండగా నిలబడ్డారని, హలో ఏపీ-బైబై వైసీపీ అని పవనన్న పిలుపునిచ్చారని గుర్తు చేసుకున్నారు. అపోహలకు తావులేకుండా ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపిచ్చారు.

This post was last modified on February 12, 2024 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…

3 hours ago

వెంకీ & నాని మల్టీస్టారర్ మిస్సయ్యిందా

పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…

3 hours ago

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…

5 hours ago

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం…

6 hours ago

రాజా సాబ్ కానుక సరే మరి శుభవార్త ?

ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…

6 hours ago

“ఎన్టీఆర్ భవన్ కాదండోయ్… ఛార్లెస్ శోభరాజ్ భవన్‌” – నాని

విజ‌య‌వాడ ప్ర‌స్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్ద‌రూ తోడ‌బుట్టిన అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా వైరం లేక‌పోయినా..…

7 hours ago