Political News

కేసీఆర్, రేవంత్ టీడీపీ ప్రొడక్ట్ లే: లోకేష్

టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ సీఎంలు అయ్యారని, వారిద్దరూ చంద్రబాబు శిష్యులేనని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు టీడీపీ ప్రొడక్టులేనంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లనుద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీడీపీ ఒక యూనివర్సిటీ వంటిదని, అందులోనుంచి వచ్చిన ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రులు అయ్యారని లోకేష్ అన్నారు. పసుపు జెండా చూస్తే నూతన ఉత్తేజం కలుగుతుంని, అది పార్టీ గొప్పదనం అని కార్యకర్తల్లో లోకేష్ ఉత్సాహం నింపారు. దేశంలో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు లోకేష్. టీడీపీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల రూపాయల భీమా అందించామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.100 కోట్లు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టామన్నారు.

చంద్రబాబుని తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారనని, తనపై కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసుతోపాటు పలు కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలపై జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని, బహిరంగచర్చకు సిద్ధమా? అని లోకేష్ ఛాలెంజ్ చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100కి పైగా కేసులు ఈ ప్రభుత్వం పెట్టిందని, అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులకు కార్యకర్తలు, నేతలు భయపడవద్దని, ఎవరిపై ఎన్ని ఎక్కువ కేసులుంటే వారికి నామినేటెడ్ పదవి ఇస్తానని లోకేష్ అన్నారు.

ఇక, చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేస్తే పవన్ కల్యాణ్ మనకు అండగా నిలబడ్డారని, హలో ఏపీ-బైబై వైసీపీ అని పవనన్న పిలుపునిచ్చారని గుర్తు చేసుకున్నారు. అపోహలకు తావులేకుండా ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపిచ్చారు.

This post was last modified on February 12, 2024 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

1 hour ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

4 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

11 hours ago