ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపో యారు. టికెట్ వ్యవహారంపై ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరంగ నాథరాజుకు వ్యతిరేకంగా ఓ వర్గం బలమైన గళం వినిపిస్తోంది. ఈ సారి ఆయనకు టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామని నాయకులు వ్యాఖ్యానించారు. తమను వాడుకుని వదిలేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా నియోజకవర్గంలోని పెనుగొండ మండలం, సిద్ధాంతంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా జత కట్టిన నాయకులు సమావేశమయ్యారు. సుమారు 100 మందికి పైగా ఉన్నవీరు.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. గత ఎన్నికలలో రాజుగారికోసం.. తాము అనేక త్యాగా లు చేశామని, కానీ, తమకు నిర్బంధాలు.. పోలీసుల కేసులే ఎదురయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో రాజుగారికి టికెట్ ఇవ్వద్దంటూ.. నాయకులు పట్టుబట్టారు.
రాజు గారికి కాకుండా.. ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామని.. ఎట్టి పరిస్థితిలోనూ రాజుగారిని ఓడిస్తా మని ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజ యం దక్కించుకున్న రంగనాథరాజు.. ఓ వర్గాన్ని ప్రోత్సహించారు. మరికొందరు నాయకులను పక్కన పెట్టారు. దీనిపై కొన్నాళ్లుగా నియోజకవర్గంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు అవికాస్తా.. రోడ్డున పడడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి.
This post was last modified on February 12, 2024 10:03 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…