Political News

ఆచంట వైసీపీలో మంట‌లు..

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నాయ‌కులు గ్రూపులుగా విడిపో యారు. టికెట్ వ్య‌వ‌హారంపై ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే శ్రీరంగ నాథ‌రాజుకు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తోంది. ఈ సారి ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామ‌ని నాయ‌కులు వ్యాఖ్యానించారు. త‌మ‌ను వాడుకుని వ‌దిలేశార‌ని నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుగొండ మండ‌లం, సిద్ధాంతంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజుకు వ్య‌తిరేకంగా జ‌త క‌ట్టిన నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. సుమారు 100 మందికి పైగా ఉన్న‌వీరు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అభ్య‌ర్థిని మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. గత ఎన్నిక‌ల‌లో రాజుగారికోసం.. తాము అనేక త్యాగా లు చేశామ‌ని, కానీ, త‌మ‌కు నిర్బంధాలు.. పోలీసుల కేసులే ఎదుర‌య్యాయ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో రాజుగారికి టికెట్ ఇవ్వ‌ద్దంటూ.. నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టారు.

రాజు గారికి కాకుండా.. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామ‌ని.. ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజుగారిని ఓడిస్తా మ‌ని ప్ర‌తిజ్ఞ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రిగిందంటే.. ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ యం ద‌క్కించుకున్న రంగ‌నాథ‌రాజు.. ఓ వ‌ర్గాన్ని ప్రోత్స‌హించారు. మ‌రికొంద‌రు నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టారు. దీనిపై కొన్నాళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌డు అవికాస్తా.. రోడ్డున ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నేది చూడాలి. 

This post was last modified on February 12, 2024 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago