ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపో యారు. టికెట్ వ్యవహారంపై ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరంగ నాథరాజుకు వ్యతిరేకంగా ఓ వర్గం బలమైన గళం వినిపిస్తోంది. ఈ సారి ఆయనకు టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామని నాయకులు వ్యాఖ్యానించారు. తమను వాడుకుని వదిలేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా నియోజకవర్గంలోని పెనుగొండ మండలం, సిద్ధాంతంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా జత కట్టిన నాయకులు సమావేశమయ్యారు. సుమారు 100 మందికి పైగా ఉన్నవీరు.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. గత ఎన్నికలలో రాజుగారికోసం.. తాము అనేక త్యాగా లు చేశామని, కానీ, తమకు నిర్బంధాలు.. పోలీసుల కేసులే ఎదురయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో రాజుగారికి టికెట్ ఇవ్వద్దంటూ.. నాయకులు పట్టుబట్టారు.
రాజు గారికి కాకుండా.. ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామని.. ఎట్టి పరిస్థితిలోనూ రాజుగారిని ఓడిస్తా మని ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజ యం దక్కించుకున్న రంగనాథరాజు.. ఓ వర్గాన్ని ప్రోత్సహించారు. మరికొందరు నాయకులను పక్కన పెట్టారు. దీనిపై కొన్నాళ్లుగా నియోజకవర్గంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు అవికాస్తా.. రోడ్డున పడడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి.
This post was last modified on February 12, 2024 10:03 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…