తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలను, హోదాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణానది జల అంశంపై ప్రధాన చర్చసాగింది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నది పరివాహక ప్రాంతం సహా.. ఏయే ప్రాజెక్టులు ఉన్నాయి? ఎంత మందికి ప్రయోజనం చేకూరుతోంది? కేంద్రం ఎందుకు ఈ ప్రాజెక్టులను తమకు అప్పగించాలని కోరుతోంది? వంటి అనేక అంశాలపై చర్చ ప్రారంభించారు.
ఈ సమయంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పాలమూరు జిల్లాకు సంబంధించిన కృష్ణా నది జలాల మీద చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు(కేసీఆర్) ఇక్కడకు రాకుండా ఫామ్హౌస్లో ఉన్నాడు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ ఏమైనా ఉందా?. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68 శాతం వాటా నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని ఒక ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్ధతు పలికి.. ఒక సందేశాన్ని పంపాల్సిన సమయం, సందర్భంలో సభకు రాకుండా ఫామ్హౌస్లో దాక్కొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మిగతావారిని పంపించి పచ్చి అబద్దాలు ఆడిపిస్తున్నడు“ అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కు కేటాయించిన సీటు వంక వేలు చూపిస్తూ.. ఆ సీటు నాలుగు రోజులుగా ఖాళీగా ఉంటోందని, ఈ రోజు సీనియర్ నేత అయిన.. పద్మరావు అందులో కూర్చున్నారని సీఎం రేవంత్ అన్నారు. ఆయనకే ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు, హోదా అప్పగిస్తే.. మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ కోసం.. పద్మారావు కూడా ఎంతో శ్రమించారని.. కేసులు కూడా పెట్టించుకున్నారని అన్నారు. ఈ సమయంలో బీఆర్ ఎస్ నేతల నుంచి వ్యతిరేక విమర్శలు వచ్చాయి. అయితే.. రేవంత్ చేసిన వ్యాఖ్యలను మెజారిటీ సబ్యులు స్వాగతించడం గమనార్హం.
This post was last modified on February 12, 2024 5:21 pm
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…