Political News

కేసీఆర్ సీటును ప‌ద్మారావుకు ఇవ్వండి: రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి బాధ్య‌త‌ల‌ను, హోదాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావుకు ఇవ్వాల‌ని వ్యాఖ్యానించారు. సోమ‌వారం అసెంబ్లీలో కృష్ణాన‌ది జ‌ల అంశంపై ప్ర‌ధాన చ‌ర్చ‌సాగింది. ఈ క్ర‌మంలో మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేశారు. న‌ది ప‌రివాహ‌క ప్రాంతం స‌హా.. ఏయే ప్రాజెక్టులు ఉన్నాయి? ఎంత మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతోంది? కేంద్రం ఎందుకు ఈ ప్రాజెక్టుల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతోంది? వంటి అనేక అంశాల‌పై చ‌ర్చ ప్రారంభించారు.

ఈ స‌మ‌యంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పాలమూరు జిల్లాకు సంబంధించిన కృష్ణా నది జలాల మీద చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు(కేసీఆర్) ఇక్కడకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ ఏమైనా ఉందా?. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68 శాతం వాటా నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని ఒక ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్ధతు పలికి.. ఒక సందేశాన్ని పంపాల్సిన సమయం, సందర్భంలో సభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో దాక్కొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మిగతావారిని పంపించి పచ్చి అబద్దాలు ఆడిపిస్తున్నడు“ అని వ్యాఖ్యానించారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌తిపక్ష నాయ‌కుడు కేసీఆర్‌కు కేటాయించిన సీటు వంక వేలు చూపిస్తూ.. ఆ సీటు నాలుగు రోజులుగా ఖాళీగా ఉంటోంద‌ని, ఈ రోజు సీనియ‌ర్ నేత అయిన‌.. ప‌ద్మ‌రావు అందులో కూర్చున్నార‌ని సీఎం రేవంత్ అన్నారు. ఆయ‌న‌కే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత బాధ్య‌త‌లు, హోదా అప్ప‌గిస్తే.. మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. తెలంగాణ కోసం.. ప‌ద్మారావు కూడా ఎంతో శ్ర‌మించార‌ని.. కేసులు కూడా పెట్టించుకున్నార‌ని అన్నారు. ఈ స‌మయంలో బీఆర్ ఎస్ నేత‌ల నుంచి వ్య‌తిరేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మెజారిటీ స‌బ్యులు స్వాగ‌తించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 12, 2024 5:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Revanth

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago