భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకులు దేశాన్ని పాలించారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదరికాన్ని రూపు మాపేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పథకాలు కూడా తీసుకువచ్చారు. అందుకే వారిలో చాలా మందిని దేశం భారతరత్న వంటి సమున్నత సత్కారాలు అందించి.. గౌరవించింది. అయితే.. వీరందరినీ తోసిరాజని.. ఇప్పుడు.. దేశ ఉత్తమ ప్రధానిగా ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీ నిలిచారట.
ఈ మేరకు దేశంలో పనిచేసిన ప్రధానుల పనితీరును ఒడబోసి.. తాజాగా ఇండియా టుడే సంస్థ ఒక స ర్వే చేసింది. ఈ క్రమంలో దేశానికిసేవలందించిన అనేక మంది ప్రధానుల విషయంపై ప్రజలను కలిసిం ది. వీరి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. తాజాగా.. ఉత్తమ ప్రధాని ఎవరనేది తేల్చి చెప్పింది. `ఇండియా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం.. దేశ ప్రజల్లో 44 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి జై కొట్టారు.
ఇక, గరీబీ హఠావో నినాదంతో దేశవ్యాప్తంగాపే కూడు-గూడు-గుడ్డ వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేసిన ఇందిరమ్మ ఈ వరుసలో మూడో స్థానానికి పడిపోయారు. ఆమెకు కేవలం 14 శాతం మంది ప్రజలు మాత్రమే జై కొట్టారు. అదేసమయంలో బీజేపీ అగ్రనాయకుడు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి.. 15 శాతం మంది ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. మౌన ముద్రతో పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన.. మాజీ ప్రధాని.. ప్రస్తుతం జీవించి ఉన్న మన్మొహన్ సింగ్ 11 శాతం మంది ప్రజల మద్దతునే కూడగట్టుకున్నారు.
కానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం.. 44 శాతం మంది ప్రజల మద్దతు కూడగట్టుకున్నట్టు ఇండియా టుడే సంస్థ సర్వే వెల్లడించింది. దీనికి కారణాలుగా ఆయన దూరదృష్టి.. వ్యూహాలను పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా జమ్ము కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, సీఏఏ వంటి కీలకమైన పౌరసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తుండడం.. అదేసమయంలో రామమందిర నిర్మాణం వంటివి ఆయనను హీరోను చేసినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
This post was last modified on February 12, 2024 5:02 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…