భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకులు దేశాన్ని పాలించారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదరికాన్ని రూపు మాపేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పథకాలు కూడా తీసుకువచ్చారు. అందుకే వారిలో చాలా మందిని దేశం భారతరత్న వంటి సమున్నత సత్కారాలు అందించి.. గౌరవించింది. అయితే.. వీరందరినీ తోసిరాజని.. ఇప్పుడు.. దేశ ఉత్తమ ప్రధానిగా ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీ నిలిచారట.
ఈ మేరకు దేశంలో పనిచేసిన ప్రధానుల పనితీరును ఒడబోసి.. తాజాగా ఇండియా టుడే సంస్థ ఒక స ర్వే చేసింది. ఈ క్రమంలో దేశానికిసేవలందించిన అనేక మంది ప్రధానుల విషయంపై ప్రజలను కలిసిం ది. వీరి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. తాజాగా.. ఉత్తమ ప్రధాని ఎవరనేది తేల్చి చెప్పింది. `ఇండియా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం.. దేశ ప్రజల్లో 44 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి జై కొట్టారు.
ఇక, గరీబీ హఠావో నినాదంతో దేశవ్యాప్తంగాపే కూడు-గూడు-గుడ్డ వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేసిన ఇందిరమ్మ ఈ వరుసలో మూడో స్థానానికి పడిపోయారు. ఆమెకు కేవలం 14 శాతం మంది ప్రజలు మాత్రమే జై కొట్టారు. అదేసమయంలో బీజేపీ అగ్రనాయకుడు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి.. 15 శాతం మంది ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. మౌన ముద్రతో పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన.. మాజీ ప్రధాని.. ప్రస్తుతం జీవించి ఉన్న మన్మొహన్ సింగ్ 11 శాతం మంది ప్రజల మద్దతునే కూడగట్టుకున్నారు.
కానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం.. 44 శాతం మంది ప్రజల మద్దతు కూడగట్టుకున్నట్టు ఇండియా టుడే సంస్థ సర్వే వెల్లడించింది. దీనికి కారణాలుగా ఆయన దూరదృష్టి.. వ్యూహాలను పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా జమ్ము కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, సీఏఏ వంటి కీలకమైన పౌరసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తుండడం.. అదేసమయంలో రామమందిర నిర్మాణం వంటివి ఆయనను హీరోను చేసినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
This post was last modified on February 12, 2024 5:02 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…