Political News

మ‌న దేశ ఉత్త‌మ ప్ర‌ధాని ఆయ‌నేన‌ట‌!

భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు అనేక మంది నాయ‌కులు దేశాన్ని పాలించారు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. పేద‌రికాన్ని రూపు మాపేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. ప‌థ‌కాలు కూడా తీసుకువ‌చ్చారు. అందుకే వారిలో చాలా మందిని దేశం భార‌త‌రత్న వంటి స‌మున్న‌త స‌త్కారాలు అందించి.. గౌర‌వించింది. అయితే.. వీరంద‌రినీ తోసిరాజ‌ని.. ఇప్పుడు.. దేశ ఉత్త‌మ ప్ర‌ధానిగా ప్ర‌స్తుత పీఎం న‌రేంద్ర మోడీ నిలిచార‌ట‌.

ఈ మేర‌కు దేశంలో ప‌నిచేసిన ప్ర‌ధానుల ప‌నితీరును ఒడ‌బోసి.. తాజాగా ఇండియా టుడే సంస్థ ఒక స ర్వే చేసింది. ఈ క్ర‌మంలో దేశానికిసేవలందించిన అనేక మంది ప్ర‌ధానుల విష‌యంపై ప్ర‌జ‌ల‌ను క‌లిసిం ది. వీరి నుంచి తీసుకున్న స‌మాచారం ప్ర‌కారం.. తాజాగా.. ఉత్త‌మ ప్ర‌ధాని ఎవ‌ర‌నేది తేల్చి చెప్పింది. `ఇండియా మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే ప్రకారం.. దేశ ప్ర‌జ‌ల్లో 44 శాతం మంది ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి జై కొట్టారు.

ఇక‌, గ‌రీబీ హ‌ఠావో నినాదంతో దేశ‌వ్యాప్తంగాపే కూడు-గూడు-గుడ్డ‌ వంటి సంక్షేమ ప‌థ‌కాలు ప్రారంభించి అమ‌లు చేసిన ఇందిర‌మ్మ ఈ వ‌రుస‌లో మూడో స్థానానికి ప‌డిపోయారు. ఆమెకు కేవ‌లం 14 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే జై కొట్టారు. అదేస‌మ‌యంలో బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ‌పేయి.. 15 శాతం మంది ప్ర‌జ‌ల అభిమానం సొంతం చేసుకున్నారు. మౌన ముద్ర‌తో ప‌దేళ్ల పాటు దేశాన్ని పాలించిన‌.. మాజీ ప్ర‌ధాని.. ప్ర‌స్తుతం జీవించి ఉన్న మ‌న్మొహ‌న్ సింగ్ 11 శాతం మంది ప్ర‌జ‌ల మ‌ద్దతునే కూడ‌గ‌ట్టుకున్నారు.

కానీ, ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్రం.. 44 శాతం మంది ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్న‌ట్టు ఇండియా టుడే సంస్థ స‌ర్వే వెల్ల‌డించింది. దీనికి కార‌ణాలుగా ఆయ‌న దూర‌దృష్టి.. వ్యూహాల‌ను పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా జ‌మ్ము క‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తిని అందించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయ‌డం, సీఏఏ వంటి కీల‌క‌మైన పౌర‌స‌త్వానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం.. దేశాన్ని 5 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం.. అదేస‌మయంలో రామ‌మందిర నిర్మాణం వంటివి ఆయ‌న‌ను హీరోను చేసిన‌ట్టు స‌ర్వే సంస్థ వెల్ల‌డించింది.

Satya

Recent Posts

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

44 minutes ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

1 hour ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

1 hour ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

2 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

4 hours ago

3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…

4 hours ago