“జగన్ కొత్తగా ఒక పథకాన్ని అమలు చేస్తున్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేలను ఒక చోట నుంచి మరో చోటకు మారుస్తున్నాడు. అంటే.. ఒక చోట పనికిరాని నాయకుడు, ఓడిపోయే నాయకుడు.. మరొకచోట గెలుస్తాడని ఆయన అనుకుంటున్నాడు. పక్కింటి చెత్త మనకు పనికి వస్తుందా? ఇది కూడా అంతే.. జగనే స్వయంగా తన సీటు మార్చుకుని బదిలీ అయి.. వేరే చోట నుంచి పోటీ చేసినా వైసీపీ పరాజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ సారి టీడీపీ-జనసేన గెలుపు ఖాయం. ఇది రాసిపెట్టుకోండి” అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
శంఖారావం పేరిట ఆదివారం ప్రారంభించిన యాత్ర.. సోమవారం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది. రోజుకు మూడు చోట్ల ఆయన సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నరసన్నపేటలో నారా లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అదేసమయంలో దేశాన్ని వదిలి పారిపోయేందుకు జగన్ కూడా సిద్ధంగానే ఉన్నాడని అందుకే.. సిద్ధం.. సిద్ధం.. అంటూ కామెంట్లు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని నారా లోకేష్ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. ఏటా 20 వేల మంది కొత్త ఉపాధ్యాయులకు అవకాశం ఇస్తామని చెప్పారు. “నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారు. 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్ మడమ తిప్పాడు. డీఎస్సీలో కేవలం 6వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో లక్షా 30 వేల పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం” అని ప్రకటించారు.
జగన్ దోపిడీకి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చని నారాలోకేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు 10 వేలు ఇచ్చినాఆశ్చర్యం లేదని.. అలా దోచుకున్నారని.. ప్రజలు కూడా డబ్బులు తీసుకుని.. ఓటు మాత్రం చంద్రబాబుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే.. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని తేల్చి చెప్పారు.
This post was last modified on February 12, 2024 4:40 pm
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…