ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనటానికి తెలంగాణా రాజకీయాలే ఉదాహరణ. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మరో ప్రతిపక్షం బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అంటు కమలనాథులు ఊదరగొడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోతుండటమే విచిత్రంగా ఉంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేపదే బీజేపీని కార్నర్ చేసేది. పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అంటు బాగా ప్రచారం చేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రచారం వల్ల కమలనాథులు బాగా ఒత్తిడికి గురయ్యారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేక నానా అవస్తలు పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రెండు నెలలు గడిచేటప్పటికి బీఆర్ఎస్ బాగా నీరసించిపోతోంది. ఇదే అదునుగా బీజేపీ కారు పార్టీ మీద మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు చాలామంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఏ రోజు ఏ ఎంఎల్ఏ బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారో తెలీటంలేదు. జంపింగుల విషయంలో కేసీయార్, కేటీయార్ లో అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం. ఇప్పటికి ఆరుగురు ఎంఎల్ఏలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ ను కలిశారు.
వీళ్ళు కాకుండా మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారు. అలాగే మాజీమంత్రి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా రేవంత్ ను కలిశారు. ఇలాంటి బీఆర్ఎస్ నేతల్లో చాలామంది తొందరలోనే కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయం. బీఆరఎస్ నేతలు ఇంతమంది రేవంత్ ను కలుస్తున్నా బీజేపీ నుండి ఎవరూ ఇంతవరకు రేవంత్ ను నేరుగా కలవలేదు. దీన్ని ఉదాహరణగా చూపించే బీఆర్ఎస్ పైన కమలనాథులు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని కిషన్ రెడ్డి అండ్ కో పదేపదే గోలచేస్తున్నారు.
This post was last modified on February 12, 2024 4:36 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…