ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనటానికి తెలంగాణా రాజకీయాలే ఉదాహరణ. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మరో ప్రతిపక్షం బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అంటు కమలనాథులు ఊదరగొడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోతుండటమే విచిత్రంగా ఉంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేపదే బీజేపీని కార్నర్ చేసేది. పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అంటు బాగా ప్రచారం చేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రచారం వల్ల కమలనాథులు బాగా ఒత్తిడికి గురయ్యారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేక నానా అవస్తలు పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రెండు నెలలు గడిచేటప్పటికి బీఆర్ఎస్ బాగా నీరసించిపోతోంది. ఇదే అదునుగా బీజేపీ కారు పార్టీ మీద మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు చాలామంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఏ రోజు ఏ ఎంఎల్ఏ బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారో తెలీటంలేదు. జంపింగుల విషయంలో కేసీయార్, కేటీయార్ లో అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం. ఇప్పటికి ఆరుగురు ఎంఎల్ఏలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ ను కలిశారు.
వీళ్ళు కాకుండా మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారు. అలాగే మాజీమంత్రి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా రేవంత్ ను కలిశారు. ఇలాంటి బీఆర్ఎస్ నేతల్లో చాలామంది తొందరలోనే కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయం. బీఆరఎస్ నేతలు ఇంతమంది రేవంత్ ను కలుస్తున్నా బీజేపీ నుండి ఎవరూ ఇంతవరకు రేవంత్ ను నేరుగా కలవలేదు. దీన్ని ఉదాహరణగా చూపించే బీఆర్ఎస్ పైన కమలనాథులు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని కిషన్ రెడ్డి అండ్ కో పదేపదే గోలచేస్తున్నారు.
This post was last modified on February 12, 2024 4:36 pm
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు, ఫ్లడ్ లైట్లు వేసుకుని ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్…
తెలుగులో గత నాలుగైదేళ్లలో అత్యధిక సంఖ్యలో పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీలీలనే. ఐతే ఆమె సక్సెస్ రేట్ మాత్రం…
టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా రోజులుగా డ్రైగా ఉంది. సంక్రాంతి తర్వాత థియేటర్కి పండగ తెచ్చిన సినిమా ఒక్కటీ పడలేదు. ఏదో…
‘దృశ్యం’ అంటే తెలుగు ఆడియెన్స్కి ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేష్. రాంబాబుగా ఆయన పండించిన ఎమోషన్, టెన్షన్, తెలివి అన్నీ మన…
దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయని నాడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి…
స్టేజ్ మీద ఎక్కితే.. మైక్ అందుకుంటే చాలు ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది అదుపు తప్పేస్తుంటారు. తాము ఏం మాట్లాడుతున్నామో తెలియని…