Political News

కాంగ్రెస్ ఇక‌, ఒంట‌రి పోరే.. తేలిపోయింది!

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఒంట‌రి పోరు చేయాల్సి రావ‌డం ఖాయ‌మైపోయింది. ఇండియా కూట‌మిని ఏర్పాటు చేసి కేంద్రంలోని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపాల‌న్న ప్ర‌య‌త్నం చేసిన కాంగ్రెస్‌కు అడుగ‌డుగునా సంక‌టం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. పొత్తుల‌కు.. టికెట్ల కేటాయింపు ప్ర‌ధాన అవ‌రోధంగా మారిన ద‌రిమిలా.. ఒక్కొక్క పార్టీ క‌ట్టుత‌ప్పి.. ప‌క్క‌కు జ‌రిగిపోయాయి. మొత్తం 28 పార్టీల స‌మాహారంగా ఉన్న ఇండియా కూట‌మిలో కీల‌క‌మైన పెద్ద‌పార్టీలు దాదాపు త‌ప్పుకొన్నాయి.

బిహార్ అధికార పార్టీ జేడీయూ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పాగా వేసి ఆమ్ ఆద్మీపార్టీ, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌లు.. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చాయి. ఇక‌, చిన్నా చిత‌కా పార్టీలు కూడా.. కొన్ని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. వాటిని చేర్చుకునేందుకు తాము సిద్ధ‌మేన‌ని.. రాజ‌కీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండ‌ద‌ని.. ఎంత మంది వ‌చ్చినా.. బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయ‌ని.. తాజాగా అమిత్ షా వ్యాఖ్యానించా రు. దీంతో ఆర్ ఎల్ డీ స‌హా మ‌రో రెండు పార్టీలు బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.

ఇక‌, మ‌రో కీల‌క ఘ‌ట‌న కాంగ్రెస్‌కు కంట్లో న‌లుసుగా మారింది. పంజాబ్ లో ఇండియా కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. చండీగఢ్‌తో సహా మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ‘15 రోజుల్లోగా ఈ స్థానాల్లో ఆప్‌ అభ్యర్థులను ప్రకటిస్తుంది’ అని తెలిపారు.

మరోవైపు అస్సాంలో మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 3 స్థానాలకు కూడా ఆయ‌న రెండు రోజుల కింద‌టే ఆప్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. దిబ్రుగఢ్‌ నుంచి మనోజ్‌ దానోవర్‌, గువాహటి, తేజ్‌పుర్‌ స్థానాల నుంచి భాబెన్‌ చౌదరి, రిషిరాజ్‌ కౌంటిన్యలు పోటీ చేస్తారని వెల్లడించింది. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించు కుంది. అలాంటి సీట్ల‌లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం వెనుక‌.. ప‌క్కాగా.. ఇండియా కూట‌మి నుంచి తాము బ‌య‌ట‌కు వ‌స్తున్నామ‌న్న సంకేతాలు పంపిన‌ట్టు అయింది. దీంతో ఇక కాంగ్రెస్ ఒంట‌రి పోరు చేయాల్సి రాక‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏమేరకు మోడీని ఢీ కొంటారో చూడాలి.

This post was last modified on February 10, 2024 7:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

3 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

8 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

10 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

14 hours ago