ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లను తెచ్చుకుంటానని ప్రకటించిన దరిమిలా.. వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవలే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం.. తాజాగా మరో ముగ్గురికి కూడా రత్నాలు ప్రకటించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజకీయ వ్యూహం ఉండడం గమనార్హం.
తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం తాజాగా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలోనే పేర్కొన్నారు. దేశానికి సంస్కరణల మార్గాన్ని చూపిన నేతగా.. దార్శనికుడిగా.. పీవీ నిలుస్తారని ప్రధాని కొనియాడారు. అంతేకాదు.. ఇది భారత దేశం తనను తాను గర్వించుకునే క్షణాలని ప్రధాని పేర్కొన్నారు.
పీవీతోపాటు.. మాజీ ప్రధాని చరణ్సింగ్, సహా.. వ్యవసాయ సంస్కరణల పితామహుడిగా పేరొందిన స్వామినాథన్కు కూడ భారత రత్న ప్రకటించారు. నిజానికి వీరంతా కూడా.. రత్నాలకు అర్హులే. అంతేకాదు.. వీరిలో పీవీ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రధాని కూడా. కానీ, ఇప్పుడు ఈయనకు రత్నం ఇవ్వడం వెనుక పూర్తిగా ఆ పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసినట్టు అయింది. అంతేకాదు.. స్వామి నాథన్ కూడా.. కాంగ్రెస్ నాయకుడే. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయనకు ఇవ్వడం వెనుక కూడా కాంగ్రెస్ టార్గెట్ ఖచ్చితంగా కనిపిస్తోంది. మొత్తంగా.. తమ వారికే రత్నాలు మెరుస్తున్నా.. ఆ కాంతులు.. కాంగ్రెస్కు సోకకపోవడం గమనార్హం.
This post was last modified on February 9, 2024 2:03 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…