Political News

మెరుస్తున్న ర‌త్నాలు.. పీవీ స‌హా ముగ్గురికి భార‌త‌ర‌త్న‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌ను తెచ్చుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. వేస్తున్న అడుగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవ‌లే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో ముగ్గురికి కూడా ర‌త్నాలు ప్ర‌క‌టించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజ‌కీయ వ్యూహం ఉండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌కు చెందిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం తాజాగా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని నేరుగా ప్ర‌ధాని మోడీ త‌న ఎక్స్ ఖాతాలోనే పేర్కొన్నారు. దేశానికి సంస్క‌ర‌ణ‌ల మార్గాన్ని చూపిన నేత‌గా.. దార్శ‌నికుడిగా.. పీవీ నిలుస్తార‌ని ప్ర‌ధాని కొనియాడారు. అంతేకాదు.. ఇది భార‌త దేశం త‌న‌ను తాను గ‌ర్వించుకునే క్ష‌ణాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

పీవీతోపాటు.. మాజీ ప్ర‌ధాని చ‌ర‌ణ్‌సింగ్‌, స‌హా.. వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడిగా పేరొందిన స్వామినాథ‌న్‌కు కూడ భార‌త ర‌త్న ప్ర‌క‌టించారు. నిజానికి వీరంతా కూడా.. ర‌త్నాల‌కు అర్హులే. అంతేకాదు.. వీరిలో పీవీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ప్ర‌ధాని కూడా. కానీ, ఇప్పుడు ఈయ‌న‌కు ర‌త్నం ఇవ్వ‌డం వెనుక పూర్తిగా ఆ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసిన‌ట్టు అయింది. అంతేకాదు.. స్వామి నాథ‌న్ కూడా.. కాంగ్రెస్ నాయ‌కుడే. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఇవ్వ‌డం వెనుక కూడా కాంగ్రెస్ టార్గెట్ ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. మొత్తంగా.. త‌మ వారికే ర‌త్నాలు మెరుస్తున్నా.. ఆ కాంతులు.. కాంగ్రెస్‌కు సోకక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 9, 2024 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై…

1 hour ago

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…

1 hour ago

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…

2 hours ago

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

4 hours ago

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌..…

4 hours ago

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…

5 hours ago