ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లను తెచ్చుకుంటానని ప్రకటించిన దరిమిలా.. వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవలే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం.. తాజాగా మరో ముగ్గురికి కూడా రత్నాలు ప్రకటించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజకీయ వ్యూహం ఉండడం గమనార్హం.
తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం తాజాగా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలోనే పేర్కొన్నారు. దేశానికి సంస్కరణల మార్గాన్ని చూపిన నేతగా.. దార్శనికుడిగా.. పీవీ నిలుస్తారని ప్రధాని కొనియాడారు. అంతేకాదు.. ఇది భారత దేశం తనను తాను గర్వించుకునే క్షణాలని ప్రధాని పేర్కొన్నారు.
పీవీతోపాటు.. మాజీ ప్రధాని చరణ్సింగ్, సహా.. వ్యవసాయ సంస్కరణల పితామహుడిగా పేరొందిన స్వామినాథన్కు కూడ భారత రత్న ప్రకటించారు. నిజానికి వీరంతా కూడా.. రత్నాలకు అర్హులే. అంతేకాదు.. వీరిలో పీవీ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రధాని కూడా. కానీ, ఇప్పుడు ఈయనకు రత్నం ఇవ్వడం వెనుక పూర్తిగా ఆ పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసినట్టు అయింది. అంతేకాదు.. స్వామి నాథన్ కూడా.. కాంగ్రెస్ నాయకుడే. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయనకు ఇవ్వడం వెనుక కూడా కాంగ్రెస్ టార్గెట్ ఖచ్చితంగా కనిపిస్తోంది. మొత్తంగా.. తమ వారికే రత్నాలు మెరుస్తున్నా.. ఆ కాంతులు.. కాంగ్రెస్కు సోకకపోవడం గమనార్హం.
This post was last modified on February 9, 2024 2:03 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…