Political News

మెరుస్తున్న ర‌త్నాలు.. పీవీ స‌హా ముగ్గురికి భార‌త‌ర‌త్న‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌ను తెచ్చుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. వేస్తున్న అడుగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవ‌లే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో ముగ్గురికి కూడా ర‌త్నాలు ప్ర‌క‌టించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజ‌కీయ వ్యూహం ఉండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌కు చెందిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం తాజాగా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని నేరుగా ప్ర‌ధాని మోడీ త‌న ఎక్స్ ఖాతాలోనే పేర్కొన్నారు. దేశానికి సంస్క‌ర‌ణ‌ల మార్గాన్ని చూపిన నేత‌గా.. దార్శ‌నికుడిగా.. పీవీ నిలుస్తార‌ని ప్ర‌ధాని కొనియాడారు. అంతేకాదు.. ఇది భార‌త దేశం త‌న‌ను తాను గ‌ర్వించుకునే క్ష‌ణాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

పీవీతోపాటు.. మాజీ ప్ర‌ధాని చ‌ర‌ణ్‌సింగ్‌, స‌హా.. వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడిగా పేరొందిన స్వామినాథ‌న్‌కు కూడ భార‌త ర‌త్న ప్ర‌క‌టించారు. నిజానికి వీరంతా కూడా.. ర‌త్నాల‌కు అర్హులే. అంతేకాదు.. వీరిలో పీవీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ప్ర‌ధాని కూడా. కానీ, ఇప్పుడు ఈయ‌న‌కు ర‌త్నం ఇవ్వ‌డం వెనుక పూర్తిగా ఆ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసిన‌ట్టు అయింది. అంతేకాదు.. స్వామి నాథ‌న్ కూడా.. కాంగ్రెస్ నాయ‌కుడే. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఇవ్వ‌డం వెనుక కూడా కాంగ్రెస్ టార్గెట్ ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. మొత్తంగా.. త‌మ వారికే ర‌త్నాలు మెరుస్తున్నా.. ఆ కాంతులు.. కాంగ్రెస్‌కు సోకక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 9, 2024 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago