Political News

మెరుస్తున్న ర‌త్నాలు.. పీవీ స‌హా ముగ్గురికి భార‌త‌ర‌త్న‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌ను తెచ్చుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. వేస్తున్న అడుగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవ‌లే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో ముగ్గురికి కూడా ర‌త్నాలు ప్ర‌క‌టించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజ‌కీయ వ్యూహం ఉండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌కు చెందిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం తాజాగా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని నేరుగా ప్ర‌ధాని మోడీ త‌న ఎక్స్ ఖాతాలోనే పేర్కొన్నారు. దేశానికి సంస్క‌ర‌ణ‌ల మార్గాన్ని చూపిన నేత‌గా.. దార్శ‌నికుడిగా.. పీవీ నిలుస్తార‌ని ప్ర‌ధాని కొనియాడారు. అంతేకాదు.. ఇది భార‌త దేశం త‌న‌ను తాను గ‌ర్వించుకునే క్ష‌ణాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

పీవీతోపాటు.. మాజీ ప్ర‌ధాని చ‌ర‌ణ్‌సింగ్‌, స‌హా.. వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడిగా పేరొందిన స్వామినాథ‌న్‌కు కూడ భార‌త ర‌త్న ప్ర‌క‌టించారు. నిజానికి వీరంతా కూడా.. ర‌త్నాల‌కు అర్హులే. అంతేకాదు.. వీరిలో పీవీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ప్ర‌ధాని కూడా. కానీ, ఇప్పుడు ఈయ‌న‌కు ర‌త్నం ఇవ్వ‌డం వెనుక పూర్తిగా ఆ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసిన‌ట్టు అయింది. అంతేకాదు.. స్వామి నాథ‌న్ కూడా.. కాంగ్రెస్ నాయ‌కుడే. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఇవ్వ‌డం వెనుక కూడా కాంగ్రెస్ టార్గెట్ ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. మొత్తంగా.. త‌మ వారికే ర‌త్నాలు మెరుస్తున్నా.. ఆ కాంతులు.. కాంగ్రెస్‌కు సోకక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

7 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

15 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago