ఏపీలో కీలక నాయకులు, ప్రధాన పార్టీలుగా ఉన్న వారు ఢిల్లీకి క్యూ కట్టారు. ఒకరు తర్వాత ఒకరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం.. తరలి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి.. ప్రధానంగామూడు పార్టీలు కూడా.. బీజేపీ వైపు చూడడం.. ఆ పార్టీతో చేతులు కలిపేందుకు ఆసక్తి కనబరచడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి జీరోనే అయినప్పటికీ.. నాయకులు మాత్రం ఆపార్టీకి ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో వేచి ఉండి మరీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. చర్చలు కొలిక్కి వచ్చాయో.. మిత్రత్వం కలుపు కొందామని అభయం ఇచ్చారో లేదో ఇంకా సస్పెన్సుగానే ఉంది. కానీ, బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వేచి ఉండడం.. చర్చగా మారింది.
ఇక, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. ఢిల్లీబాట పడుతున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో విజయవాడ నుంచి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్కు వెళ్లిపోయారు. దీంతో జనసేన అధినేత కూడా.. బీజేపీ దగ్గరకు రాయబారానికి వెళ్లిపోనున్నారు. ఈ రెండు పార్టీల వ్యవహారం ఇలా ఉంటే.. ఇప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఢిల్లీ కి వెళ్తున్నారు.
సీఎం జగన్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర మంత్రి అమిత్షాను కలవనున్నట్టు వైసీపీ వర్గాలుచెబుతున్నాయి. అయితే.. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు, నిధుల కోసమే వెళ్తున్నారని చెబుతున్నా ఢిల్లీలో జరుగుతున్న ఏపీ రాజకీయ పరిణామాలపైనే ఆయన చర్చించేందుకు వెళ్తున్నారని.. రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. ఒక్క ఓటు, ఒక్క సీటు లేని బీజేపీ ముందు.. నాయకులు క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.
This post was last modified on February 8, 2024 7:40 pm
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…