Political News

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇప్పుడు జ‌గ‌న్?

ఏపీలో కీల‌క నాయ‌కులు, ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న వారు ఢిల్లీకి క్యూ క‌ట్టారు. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సుల కోసం.. త‌ర‌లి వెళ్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ప్ర‌ధానంగామూడు పార్టీలు కూడా.. బీజేపీ వైపు చూడ‌డం.. ఆ పార్టీతో చేతులు క‌లిపేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి ఏపీలో బీజేపీ ప‌రిస్థితి జీరోనే అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం ఆపార్టీకి ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఢిల్లీలో ఉన్నారు. బుధవారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో వేచి ఉండి మ‌రీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయో.. మిత్ర‌త్వం క‌లుపు కొందామ‌ని అభ‌యం ఇచ్చారో లేదో ఇంకా స‌స్పెన్సుగానే ఉంది. కానీ, బీజేపీ పొత్తు కోసం చంద్ర‌బాబు వేచి ఉండ‌డం.. చ‌ర్చ‌గా మారింది.

ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కూడా.. ఢిల్లీబాట ప‌డుతున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం ఆయ‌న ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ కూడా ఖ‌రారు కావ‌డంతో విజ‌య‌వాడ నుంచి నాదెండ్ల మ‌నోహ‌ర్ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో జ‌న‌సేన అధినేత కూడా.. బీజేపీ ద‌గ్గ‌ర‌కు రాయ‌బారానికి వెళ్లిపోనున్నారు. ఈ రెండు పార్టీల వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. ఇప్పుడు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఢిల్లీ కి వెళ్తున్నారు.

సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయ‌న నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని, కేంద్ర మంత్రి అమిత్‌షాను క‌ల‌వ‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలుచెబుతున్నాయి. అయితే.. రాష్ట్ర బ‌డ్జెట్‌లో కేటాయింపులు, నిధుల కోస‌మే వెళ్తున్నార‌ని చెబుతున్నా ఢిల్లీలో జ‌రుగుతున్న ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల‌పైనే ఆయ‌న చ‌ర్చించేందుకు వెళ్తున్నార‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. ఒక్క ఓటు, ఒక్క సీటు లేని బీజేపీ ముందు.. నాయ‌కులు క్యూ క‌ట్ట‌డం ఆసక్తిగా మారింది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

2 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

4 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago