వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యమని.. రాసి పెట్టుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.. నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడున్న వాటి కంటే.. కూడా వేరేగా ప్లాన్-బి ఉందని తెలిపారు. “వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు. ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు” అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమతో పాటు బీజేపీ కూడా కలసి వస్తే.. బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న నాగబాబు.. పార్టీకేడర్తో మాట్లాడుతున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? ఎలా ప్రచారం చేయాలనే వ్యూహాలను వారికి నూరిపోస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ విడుదల చేస్తున్న జాబితాలు చిత్తు కాయితాలుగా ఉన్నాయి. ఒక్కడు కూడా పనికొచ్చే నాయకుడు లేడు. వైసీపీ ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదు” అని వ్యాఖ్యానించారు.
జనసేన-టీడీపీ గెలిచేందుకు ప్లాన్ బి ఉందన్నారు. అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో ఎన్నిచోట్ల పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో సమస్యలు ఎప్పుడూ ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నట్టు నాగబాబు చెప్పారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో జనసేన అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. ఎక్కడనుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కుతానని ధీమా వ్యక్తం చేశారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…