వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యమని.. రాసి పెట్టుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.. నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడున్న వాటి కంటే.. కూడా వేరేగా ప్లాన్-బి ఉందని తెలిపారు. “వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు. ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు” అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమతో పాటు బీజేపీ కూడా కలసి వస్తే.. బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న నాగబాబు.. పార్టీకేడర్తో మాట్లాడుతున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? ఎలా ప్రచారం చేయాలనే వ్యూహాలను వారికి నూరిపోస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ విడుదల చేస్తున్న జాబితాలు చిత్తు కాయితాలుగా ఉన్నాయి. ఒక్కడు కూడా పనికొచ్చే నాయకుడు లేడు. వైసీపీ ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదు” అని వ్యాఖ్యానించారు.
జనసేన-టీడీపీ గెలిచేందుకు ప్లాన్ బి ఉందన్నారు. అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో ఎన్నిచోట్ల పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో సమస్యలు ఎప్పుడూ ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నట్టు నాగబాబు చెప్పారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో జనసేన అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. ఎక్కడనుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కుతానని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…