రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. గాంధిభవన్లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటి (పీఈసీ) ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ మిస్సయిన నేతలు, పార్లమెంటు టికెట్ హామీని పొందిన సీనియర్ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఇపుడు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయన్న అంచనాతోనే 17 స్ధానాలకు ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు అందాయి. వాటిని షార్ట్ లిస్టు చేయటం కోసమే పీఈసీ మీటయ్యింది. సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను సమావేశం కుదించింది. అంటే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లతో జాబితాను రెడీచేసింది. నియోజకవర్గాల వారీగా జాబితాలను రెడీచేసిన సమావేశం సీల్డ్ కవర్లో ఉంచింది.
ఆ సీల్డ్ కవర్ను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించింది. స్క్రీనింగ్ కమిటి ఈనెల 19వ తేదీన సమావేశం అవబోతోంది. నియోజకవర్గానికి అందిన మూడుపేర్లపైన కమిటి సభ్యులు చర్చిస్తారు. వీళ్ళల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చిత్తశుద్దితో పనిచేసిందెవరు ? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు ఎవరెంత పనిచేశారు ? అభ్యర్ధుల నేపధ్యం, పార్టీలో ట్రాక్ రికార్డు లాంటి అంశాలపై సర్వే మొదలైంది.
19వ తేదీన స్క్రీనింగ్ కమిటి సమావేశం నాటికి వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం తమ సర్వేని పూర్తిచేసి రిపోర్టు రెడీ చేస్తుందని పార్టీవర్గాలు చెప్పాయి. తమకు అందిన మూడుపేర్ల జాబితాలను, సునీల్ కనగోలు టీమ్ ఇచ్చే సర్వే రిపోర్టును పోల్చుకుని కమిటి మూడుపేర్లలో ప్రయారిటి ప్రకారం టిక్ పెడుతుంది. స్క్రీనింగ్ కమిటి రెడీచేసిన ప్రయారిటి లిస్టును ఢిల్లీకి పంపుతారు. మళ్ళీ అక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సమక్షంలో స్క్రీనింగ్ కమిటి సమావేశమై ప్రయారిటి జాబితాపై చర్చిస్తుంది. అక్కడ ఫైనల్ అయిన ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుకు జాబితా వెళుతుంది. అక్కడ అభ్యర్ధులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియంతా వీలైనంత తొందరగా పూర్తిచేసి అభ్యర్ధులను ప్రచారానికి దింపాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ చేశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2024 10:51 am
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…