Political News

వడబోత మొదలైందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. గాంధిభవన్లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటి (పీఈసీ) ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ మిస్సయిన నేతలు, పార్లమెంటు టికెట్ హామీని పొందిన సీనియర్ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఇపుడు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయన్న అంచనాతోనే 17 స్ధానాలకు ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు అందాయి. వాటిని షార్ట్ లిస్టు చేయటం కోసమే పీఈసీ మీటయ్యింది. సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను సమావేశం కుదించింది. అంటే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లతో జాబితాను రెడీచేసింది. నియోజకవర్గాల వారీగా జాబితాలను రెడీచేసిన సమావేశం సీల్డ్ కవర్లో ఉంచింది.

ఆ సీల్డ్ కవర్ను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించింది. స్క్రీనింగ్ కమిటి ఈనెల 19వ తేదీన సమావేశం అవబోతోంది. నియోజకవర్గానికి అందిన మూడుపేర్లపైన కమిటి సభ్యులు చర్చిస్తారు. వీళ్ళల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చిత్తశుద్దితో పనిచేసిందెవరు ? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు ఎవరెంత పనిచేశారు ? అభ్యర్ధుల నేపధ్యం, పార్టీలో ట్రాక్ రికార్డు లాంటి అంశాలపై సర్వే మొదలైంది.

19వ తేదీన స్క్రీనింగ్ కమిటి సమావేశం నాటికి వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం తమ సర్వేని పూర్తిచేసి రిపోర్టు రెడీ చేస్తుందని పార్టీవర్గాలు చెప్పాయి. తమకు అందిన మూడుపేర్ల జాబితాలను, సునీల్ కనగోలు టీమ్ ఇచ్చే సర్వే రిపోర్టును పోల్చుకుని కమిటి మూడుపేర్లలో ప్రయారిటి ప్రకారం టిక్ పెడుతుంది. స్క్రీనింగ్ కమిటి రెడీచేసిన ప్రయారిటి లిస్టును ఢిల్లీకి పంపుతారు. మళ్ళీ అక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సమక్షంలో స్క్రీనింగ్ కమిటి సమావేశమై ప్రయారిటి జాబితాపై చర్చిస్తుంది. అక్కడ ఫైనల్ అయిన ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుకు జాబితా వెళుతుంది. అక్కడ అభ్యర్ధులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియంతా వీలైనంత తొందరగా పూర్తిచేసి అభ్యర్ధులను ప్రచారానికి దింపాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ చేశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Satya

Recent Posts

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

22 minutes ago

తెలుగోళ్లు గిచ్చితే కానీ… తమిళ సినిమా మారలేదు

ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…

59 minutes ago

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

3 hours ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

5 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

7 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

8 hours ago