Political News

వడబోత మొదలైందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. గాంధిభవన్లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటి (పీఈసీ) ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ మిస్సయిన నేతలు, పార్లమెంటు టికెట్ హామీని పొందిన సీనియర్ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఇపుడు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయన్న అంచనాతోనే 17 స్ధానాలకు ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు అందాయి. వాటిని షార్ట్ లిస్టు చేయటం కోసమే పీఈసీ మీటయ్యింది. సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను సమావేశం కుదించింది. అంటే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లతో జాబితాను రెడీచేసింది. నియోజకవర్గాల వారీగా జాబితాలను రెడీచేసిన సమావేశం సీల్డ్ కవర్లో ఉంచింది.

ఆ సీల్డ్ కవర్ను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించింది. స్క్రీనింగ్ కమిటి ఈనెల 19వ తేదీన సమావేశం అవబోతోంది. నియోజకవర్గానికి అందిన మూడుపేర్లపైన కమిటి సభ్యులు చర్చిస్తారు. వీళ్ళల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చిత్తశుద్దితో పనిచేసిందెవరు ? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు ఎవరెంత పనిచేశారు ? అభ్యర్ధుల నేపధ్యం, పార్టీలో ట్రాక్ రికార్డు లాంటి అంశాలపై సర్వే మొదలైంది.

19వ తేదీన స్క్రీనింగ్ కమిటి సమావేశం నాటికి వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం తమ సర్వేని పూర్తిచేసి రిపోర్టు రెడీ చేస్తుందని పార్టీవర్గాలు చెప్పాయి. తమకు అందిన మూడుపేర్ల జాబితాలను, సునీల్ కనగోలు టీమ్ ఇచ్చే సర్వే రిపోర్టును పోల్చుకుని కమిటి మూడుపేర్లలో ప్రయారిటి ప్రకారం టిక్ పెడుతుంది. స్క్రీనింగ్ కమిటి రెడీచేసిన ప్రయారిటి లిస్టును ఢిల్లీకి పంపుతారు. మళ్ళీ అక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సమక్షంలో స్క్రీనింగ్ కమిటి సమావేశమై ప్రయారిటి జాబితాపై చర్చిస్తుంది. అక్కడ ఫైనల్ అయిన ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుకు జాబితా వెళుతుంది. అక్కడ అభ్యర్ధులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియంతా వీలైనంత తొందరగా పూర్తిచేసి అభ్యర్ధులను ప్రచారానికి దింపాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ చేశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 8, 2024 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

19 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

1 hour ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

7 hours ago