Political News

సిట్టింగులకు షాక్ తప్పదా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే వీలున్నంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా వినలేదు. పైగా మూడు నెలలకు ముందే సిట్టింగులు అందరికీ టికెట్లను కేసీయార్ ప్రకటించేశారు.

వివిధ కారణాలతో చివరి నిముషంలో 12 చోట్ల సిట్టింగులను కాదని కొత్తవారికి టికెట్లిచ్చారు. ముందుగా టికెట్లు ప్రకటించిన సిట్టింగుల్లో చాలామంది ఓడిపోయారు. చివరినిముషంలో కొత్తవారికి టికెట్లిచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ 10 చోట్ల గెలిచింది. దీంతోనే సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్ళీ టికెట్లివ్వటం ఎంతపెద్ద తప్పో కేసీయార్ కు అర్ధమైంది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. ఎంఎల్ఏల మీద మంటతో జనాలు చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించటంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదంటే పార్లమెంటు ఎన్నికల్లో జాగ్రత్త పడాలని అర్ధమైనట్లుంది.

అందుకనే సిట్టింగ్ ఎంపీల్లో చాలామందిని మార్చేయాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల టాక్. అవకాశం ఉంటే అందరినీ మార్చేయాలని కాదు కూడదని అనుకుంటే ఎక్కడైనా మంచి ఇమేజి ఉన్న సిట్టింగులకు మాత్రం టికెట్ ఇవ్వాలని అనుకున్నారట. పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తొమ్మిది మంది ఎంపీలుగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎంఎల్ఏగా గెలిచిన కొత్తా ప్రభాకరరెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ లో చేరిన కారణంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేశారు.

అంటే స్ధూలంగా బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. వెంకటేష్ రాజీనామా ఆమోదిస్తే బలం ఏడుకు తగ్గుతుంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే మొత్తం 17 నియోజకవర్గాల్లో ఫ్రెష్ ఫేసెస్ ను రంగంలోకి దింపాలని కేసీయార్ ఆలోచిస్తున్నారట. దీనివల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ రావటంతో పాటు జనాలు కూడా హ్యాపీగా ఫీలవుతారని, అప్పుడు పార్టీపై వ్యతిరేకత తగ్గుతుందని అనుకుంటున్నారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను ఎంపీలుగా పోటీలోకి దింపే ఆలోచన కూడా లేదట. అందుకనే గట్టి నేతలకోసం కేసీయార్ సర్వేలు చేయించుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 8, 2024 10:48 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

1 hour ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

2 hours ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

3 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

4 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

5 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

5 hours ago