Political News

సిట్టింగులకు షాక్ తప్పదా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే వీలున్నంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా వినలేదు. పైగా మూడు నెలలకు ముందే సిట్టింగులు అందరికీ టికెట్లను కేసీయార్ ప్రకటించేశారు.

వివిధ కారణాలతో చివరి నిముషంలో 12 చోట్ల సిట్టింగులను కాదని కొత్తవారికి టికెట్లిచ్చారు. ముందుగా టికెట్లు ప్రకటించిన సిట్టింగుల్లో చాలామంది ఓడిపోయారు. చివరినిముషంలో కొత్తవారికి టికెట్లిచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ 10 చోట్ల గెలిచింది. దీంతోనే సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్ళీ టికెట్లివ్వటం ఎంతపెద్ద తప్పో కేసీయార్ కు అర్ధమైంది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. ఎంఎల్ఏల మీద మంటతో జనాలు చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించటంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదంటే పార్లమెంటు ఎన్నికల్లో జాగ్రత్త పడాలని అర్ధమైనట్లుంది.

అందుకనే సిట్టింగ్ ఎంపీల్లో చాలామందిని మార్చేయాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల టాక్. అవకాశం ఉంటే అందరినీ మార్చేయాలని కాదు కూడదని అనుకుంటే ఎక్కడైనా మంచి ఇమేజి ఉన్న సిట్టింగులకు మాత్రం టికెట్ ఇవ్వాలని అనుకున్నారట. పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తొమ్మిది మంది ఎంపీలుగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎంఎల్ఏగా గెలిచిన కొత్తా ప్రభాకరరెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ లో చేరిన కారణంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేశారు.

అంటే స్ధూలంగా బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. వెంకటేష్ రాజీనామా ఆమోదిస్తే బలం ఏడుకు తగ్గుతుంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే మొత్తం 17 నియోజకవర్గాల్లో ఫ్రెష్ ఫేసెస్ ను రంగంలోకి దింపాలని కేసీయార్ ఆలోచిస్తున్నారట. దీనివల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ రావటంతో పాటు జనాలు కూడా హ్యాపీగా ఫీలవుతారని, అప్పుడు పార్టీపై వ్యతిరేకత తగ్గుతుందని అనుకుంటున్నారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను ఎంపీలుగా పోటీలోకి దింపే ఆలోచన కూడా లేదట. అందుకనే గట్టి నేతలకోసం కేసీయార్ సర్వేలు చేయించుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 8, 2024 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

3 minutes ago

మరో శుక్రవారం… మళ్ళీ అదే కథ

బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…

1 hour ago

ఫ్లెక్సీ టికెట్ ధరలు నిజంగా మేలు చేస్తాయా

టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…

2 hours ago

‘సీఎం’ విజయ్ కు లైన్ క్లియర్!

తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…

3 hours ago

ఎవ‌రీ అర్లేక‌ర్‌… ఎందుకింత ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేక‌ర్‌. ఈయ‌న త‌మిళ‌నాడుకు ఇంచార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా…

4 hours ago

కొర‌వ‌డిన రాజ్యాంగం: విజ‌య్ విష‌యంలో ఏం జ‌రుగుతోంది?

దేశంలో ప్ర‌జాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం…

4 hours ago