Political News

బీసీలకే టాప్ ప్రయారిటీనా ?

తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు కేటాయించాలని ప్రదేశ్ ఎలక్షన్ కమిటి(పీఇసీ) డిసైడ్ చేసింది. గాంధిభవన్లో జరిగిన పీఈసీ మీటింగులో తెలంగాణా ఇన్చార్జితో పాటు ఏఐసీసీ పరిశీలకులు, రేవంత్ రెడ్డి, మంత్రులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ మీటింగులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పదించారట మిగిలిన సభ్యులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అనుకున్నన్ని టికెట్లు ఇవ్వలేకపోయిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారట.

అప్పట్లో ఇవ్వలేకపోయిన టికెట్లను కనీసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అయినా ఇచ్చి జరిగిన నష్టాన్ని భర్తిచేయాలని రేవంత్ ప్రతిపాదించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అలాగే ఎస్సీల్లో మాదిగలకు 2, మాలలకు ఒక టికెట్ ఇవ్వాలని, యూత్ కాంగ్రెస్ కోటాలో ఒక టికెట్ కేటాయించాలని కూడా సమావేశం అభిప్రాయపడింది. సమావేశమే అభిప్రాయపడింది కాబట్టి పైన చెప్పినట్లే టికెట్ల కేటాయింపుకు ఎలాంటి అడ్డంకులు ఉండవనే అనుకుంటున్నారు. తెలంగాణాలో బీసీ సామాజికవర్గం చాలా ఎక్కువ. కాబట్టి జనాభా దామాషా ప్రకారం చూసినా బీసీలకు అధిక టికెట్లు ఇవ్వటంలో తప్పులేదన్నది రేవంత్ ఆలోచన.

మొత్తం 17 సీట్లలో రిజర్వుడు సీట్లుపోను మిగిలిన ఓసీ సీట్లలో తక్కువలో తక్కువ ఐదు సీట్లన్నా బీసీలకు ఇవ్వాలని పార్టీలో చర్చలు జోరందుకుంటున్నాయి. 17 నియోజకవర్గాలకు వచ్చిన 309 దరఖాస్తులన్నింటినీ పీఈసీ మీటింగ్ పరిశీలించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను విడదీసింది. ఒక్కో దరఖాస్తుపైన సమావేశం డీటైల్డ్ గా చర్చించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సహకరించిన వారికి, మొన్నటి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయిన వారికి, కష్టకాలంలో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారికి టాప్ ప్రయారిటి ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది.

వచ్చిన దరఖాస్తుల్లో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అత్యధికంగా 48 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తర్వాత వరంగల్ పార్లమెంటు టికెట్ కోసం 42 మంది, పెద్దపల్లి సీటుకు 29, భువనగిరికి 28, నాగర్ కర్నూలుకు 26 దరఖాస్తులు చేసుకున్నారు. అత్యంత తక్కువగా మహబూబ్ నగర్ సీటుకు కేవలం నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బహుశా ఈ సీటు వంశీచంద్ రెడ్డికి రిజర్వ్ అయిపోయిందనే ప్రచారం కారణంగానే ఎక్కువమంది ఇంట్రెస్టు చూపలేదేమో.

This post was last modified on February 7, 2024 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

53 minutes ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

2 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

11 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago