Political News

జనసేనలోకి ముద్రగడ..మాగంటితో భేటీ

ఏపీలో శాసన సభ ఎన్నికలకు ముందు వైసీపీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. వైసీపీలో తప్ప మరే పార్టీలో అయినా చేరతా అంటూ ముద్రగడ చెప్పడం…వైసీపీపై ఆయనకున్న వ్యతిరేకతను చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా

ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు నివాసానికి ముద్రగడ పద్మనాభం వెళ్లడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది.

ముద్రగడ పద్మనాభం తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయనతో వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. తాము కాంగ్రెస్ లో కలిసి చేశామని, ఆ తర్వాత టీడీపీలో చేరి పదవులు అనుభవించామని వెల్లడించారు. ముద్రగడ టీడీపీలోకి వచ్చినా….జనసేనలో చేరినా పర్వాలేదని ముద్రగడకు తాను చెప్పానని మాగంటి అన్నారు. అయితే, వపన్ కల్యాణ్ ను కలవబోతున్నానని, జనసేనలో చేరుతానని ఆయన తనతో చెప్పారని మాగంటి వెల్లడించారు.

టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే తామంతా కలిసి పని చేస్తామని మాగంటి చెప్పారు. వైసీపీ తనను మోసం చేసిందని, రాజ్యసభ సీటు ఇస్తామని ఆశజూపారని ముద్రగడ వాపోయారని అన్నారు. వందల కోట్ల రూపాయలు తనలాంటి వారి దగ్గర ఎక్కడుంటాయని ముద్రగడ అన్నారని చెప్పారు. వైసీపీలోకి వెళ్తే అమ్ముడుపోయానని అంటారని, ఇప్పటికే తనకొక గాయం తగిలిందని, ఆ గాయం మానేంత వరకు జనసేనలో ఉంటానని ముద్రగడ చెప్పారని మాగంటి అన్నారు.

This post was last modified on February 6, 2024 6:48 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

23 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago