గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని అందులోను అధికారిక వ్యవహారాల కోసమే అని ఆమె చెప్పారు. అయితే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు నమ్మటంలేదు. రేవంత్ ను ఇపుడు బీఆర్ఎస్ తరపున ప్రజాప్రతినిధులు ఎవరు కలిసినా సంచలనమైపోతోంది.
కారణం ఏమిటంటే కచ్చితంగా ఏదోరోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మొదట్లో రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మెడక్ జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో బీఆర్ఎస్ లో సంచలనమైపోయింది. తాము నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసినట్లు నలుగురు ఎంఎల్ఏలు చెప్పుకున్నా ఎవరు నమ్మలేదు. వెంటనే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవటతో కలకలం రేగింది.
ముహూర్తం చూసుకుని పై ఐదుగురు ఎంఎల్ఏలు కాని లేకపోతే వీరిలో కొంతమందైనా సరే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ సమయంలోనే మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కలవటంతో ప్రధాన ప్రతిక్షంలో గందరగోళం పెరిగిపోతోంది. ఇపుడు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 58 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 48, ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లున్నారు. కాంగ్రెస్ కు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లలో చీలికరావటం ఖాయమనే టాక్ పెరిగిపోతోంది. మేయర్ తో కలిసి 28 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే మద్దతు ఇవ్వటానికి ఎంఐఎం ఎలాగూ సిద్ధంగానే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కుంభస్ధలాన్ని బద్దలు కొట్టినట్లే అనుకోవాలి. ఇప్పటికే సుమారు 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తోంది. కాబట్టి తొందరలోనే జీహెచ్ఎంసీలో కూడా హస్తం జెండా ఎగరటం ఖాయమనే అనుకుంటున్నారు. ఏమి జరిగినా కేసీయార్ ఏమీ అనేందుకు లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు ఈ కంపును మొదలుపెట్టిందే కేసీయార్ కాబట్టి.
This post was last modified on February 5, 2024 2:31 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…