Political News

కాంగ్రెస్ కుంభస్ధలం కొట్టబోతోందా ?

గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని అందులోను అధికారిక వ్యవహారాల కోసమే అని ఆమె చెప్పారు. అయితే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు నమ్మటంలేదు. రేవంత్ ను ఇపుడు బీఆర్ఎస్ తరపున ప్రజాప్రతినిధులు ఎవరు కలిసినా సంచలనమైపోతోంది.

కారణం ఏమిటంటే కచ్చితంగా ఏదోరోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మొదట్లో రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మెడక్ జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో బీఆర్ఎస్ లో సంచలనమైపోయింది. తాము నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసినట్లు నలుగురు ఎంఎల్ఏలు చెప్పుకున్నా ఎవరు నమ్మలేదు. వెంటనే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవటతో కలకలం రేగింది.

ముహూర్తం చూసుకుని పై ఐదుగురు ఎంఎల్ఏలు కాని లేకపోతే వీరిలో కొంతమందైనా సరే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ సమయంలోనే మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కలవటంతో ప్రధాన ప్రతిక్షంలో గందరగోళం పెరిగిపోతోంది. ఇపుడు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 58 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 48, ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లున్నారు. కాంగ్రెస్ కు ఇద్దరు మాత్రమే ఉన్నారు.

అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లలో చీలికరావటం ఖాయమనే టాక్ పెరిగిపోతోంది. మేయర్ తో కలిసి 28 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే మద్దతు ఇవ్వటానికి ఎంఐఎం ఎలాగూ సిద్ధంగానే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కుంభస్ధలాన్ని బద్దలు కొట్టినట్లే అనుకోవాలి. ఇప్పటికే సుమారు 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తోంది. కాబట్టి తొందరలోనే జీహెచ్ఎంసీలో కూడా హస్తం జెండా ఎగరటం ఖాయమనే అనుకుంటున్నారు. ఏమి జరిగినా కేసీయార్ ఏమీ అనేందుకు లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు ఈ కంపును మొదలుపెట్టిందే కేసీయార్ కాబట్టి.

This post was last modified on February 5, 2024 2:31 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఖమ్మం టీడీపీ ఆఫీసుకు పెరిగిన డిమాండ్ !

తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు…

3 hours ago

కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…

4 hours ago

రామాయణంపై అప్పుడే వివాదాలు షురూ

గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…

4 hours ago

తండేల్ కోసం రెండు క్లయిమాక్సులు ?

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…

5 hours ago

ఆ మూడూ గెలవకుంటే .. మూడు ముక్కలాటే !

మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…

6 hours ago

ప్రభాస్ పాత్రపై కన్నప్ప క్లారిటీ

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…

7 hours ago