Political News

మళ్ళీ సర్వేలు చేయిస్తున్న కేసీయార్

అభ్యర్ధుల ఎంపిక కోసం మళ్ళీ సర్వేలు మొదలయ్యాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు కేసీయార్ మళ్ళీ సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లోను కేసీయార్ ఆదేశాలమేరకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. తనకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో అధినేత ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీయార్ ఒకటికి మూడు నాలుగుసార్లు సర్వేలు చేయించుకున్న విషయం తెలిసిందే.

అన్ని సర్వేలు చేయించుకున్న కేసీయార్ చివరకు ఏమిచేశారు ? ఎందుకు ఓడిపోయారన్నది వేరే విషయం. ఎందుకంటే సర్వేలు చేస్తున్నదెవరు ? సర్వే రిపోర్టుల్లో ఏముంది ? సర్వేల్లో ఎవరికి ప్లస్సుంది ఎవరికి మైనస్సుందన్న విషయాలు కేసీయార్ కు తప్ప మరొకరికి తెలీదు. అందుకని సర్వేల ఆధారంగానే కేసీయార్ టికెట్లు ఫైనల్ చేశారా లేకపోతే ఇంకేదైనా మార్గముందా అన్న విషయమై చర్చలు అనవసరం. ఇపుడు పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ సర్వేలు చేయిస్తున్నది మాత్రమే నిజం.

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరబాట్లను మాత్రం మళ్ళీ రిపీట్ చేయకూడదని కేసీయార్ అనుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్ధుల ఎంపికలో సర్వే సంస్ధలతో పాటు పార్టీ ఇంటెలిజెన్స్ ను కూడా రంగంలోకి దించారట. అభ్యర్ధులుగా ఎంపిక చేయబోయే వారి నేపధ్యంతో పాటు వాళ్ళ ఆర్ధిక స్ధితిగతులను కూడా అంచనా వేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏల ట్రాక్ రికార్డు, వాళ్ళపైన ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోకుండా అచ్చంగా ఆర్ధిక పరిస్ధితులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అందుకనే రిజల్టు పూర్తిగా నెగిటివ్ గా వచ్చాయి.

అందుకనే పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో నేతల ట్రాక్ రికార్డుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే జనాల్లో మంచి ఇమేజి ఉండి, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న నేతలను పోటీలోకి దింపితే మంచి రిజల్టు వస్తుందని కేసీయార్ భావిస్తున్నారట. కారణం ఏమిటంటే అవసరమైన అభ్యర్ధులకు పార్టీయే నిధులను సర్దుబాటు చేయాలని కేసీయార్ అనుకున్నారట. కాబట్టి మంచి ట్రాక్ రికార్డున్న నేతలనే అభ్యర్ధులుగా ఎంపిక చేయటానికే సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on February 5, 2024 4:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిన్మయి vs ట్విట్టర్ యువత – ఆగేదెప్పుడు?

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…

12 minutes ago

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

37 minutes ago

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

51 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

57 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

1 hour ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

1 hour ago