Political News

మళ్ళీ సర్వేలు చేయిస్తున్న కేసీయార్

అభ్యర్ధుల ఎంపిక కోసం మళ్ళీ సర్వేలు మొదలయ్యాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు కేసీయార్ మళ్ళీ సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లోను కేసీయార్ ఆదేశాలమేరకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. తనకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో అధినేత ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీయార్ ఒకటికి మూడు నాలుగుసార్లు సర్వేలు చేయించుకున్న విషయం తెలిసిందే.

అన్ని సర్వేలు చేయించుకున్న కేసీయార్ చివరకు ఏమిచేశారు ? ఎందుకు ఓడిపోయారన్నది వేరే విషయం. ఎందుకంటే సర్వేలు చేస్తున్నదెవరు ? సర్వే రిపోర్టుల్లో ఏముంది ? సర్వేల్లో ఎవరికి ప్లస్సుంది ఎవరికి మైనస్సుందన్న విషయాలు కేసీయార్ కు తప్ప మరొకరికి తెలీదు. అందుకని సర్వేల ఆధారంగానే కేసీయార్ టికెట్లు ఫైనల్ చేశారా లేకపోతే ఇంకేదైనా మార్గముందా అన్న విషయమై చర్చలు అనవసరం. ఇపుడు పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ సర్వేలు చేయిస్తున్నది మాత్రమే నిజం.

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరబాట్లను మాత్రం మళ్ళీ రిపీట్ చేయకూడదని కేసీయార్ అనుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్ధుల ఎంపికలో సర్వే సంస్ధలతో పాటు పార్టీ ఇంటెలిజెన్స్ ను కూడా రంగంలోకి దించారట. అభ్యర్ధులుగా ఎంపిక చేయబోయే వారి నేపధ్యంతో పాటు వాళ్ళ ఆర్ధిక స్ధితిగతులను కూడా అంచనా వేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏల ట్రాక్ రికార్డు, వాళ్ళపైన ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోకుండా అచ్చంగా ఆర్ధిక పరిస్ధితులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అందుకనే రిజల్టు పూర్తిగా నెగిటివ్ గా వచ్చాయి.

అందుకనే పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో నేతల ట్రాక్ రికార్డుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే జనాల్లో మంచి ఇమేజి ఉండి, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న నేతలను పోటీలోకి దింపితే మంచి రిజల్టు వస్తుందని కేసీయార్ భావిస్తున్నారట. కారణం ఏమిటంటే అవసరమైన అభ్యర్ధులకు పార్టీయే నిధులను సర్దుబాటు చేయాలని కేసీయార్ అనుకున్నారట. కాబట్టి మంచి ట్రాక్ రికార్డున్న నేతలనే అభ్యర్ధులుగా ఎంపిక చేయటానికే సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on February 5, 2024 4:34 pm

Share

Recent Posts

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

17 minutes ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

18 minutes ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

1 hour ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

3 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

8 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

9 hours ago