అభ్యర్ధుల ఎంపిక కోసం మళ్ళీ సర్వేలు మొదలయ్యాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు కేసీయార్ మళ్ళీ సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లోను కేసీయార్ ఆదేశాలమేరకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. తనకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో అధినేత ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీయార్ ఒకటికి మూడు నాలుగుసార్లు సర్వేలు చేయించుకున్న విషయం తెలిసిందే.
అన్ని సర్వేలు చేయించుకున్న కేసీయార్ చివరకు ఏమిచేశారు ? ఎందుకు ఓడిపోయారన్నది వేరే విషయం. ఎందుకంటే సర్వేలు చేస్తున్నదెవరు ? సర్వే రిపోర్టుల్లో ఏముంది ? సర్వేల్లో ఎవరికి ప్లస్సుంది ఎవరికి మైనస్సుందన్న విషయాలు కేసీయార్ కు తప్ప మరొకరికి తెలీదు. అందుకని సర్వేల ఆధారంగానే కేసీయార్ టికెట్లు ఫైనల్ చేశారా లేకపోతే ఇంకేదైనా మార్గముందా అన్న విషయమై చర్చలు అనవసరం. ఇపుడు పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ సర్వేలు చేయిస్తున్నది మాత్రమే నిజం.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరబాట్లను మాత్రం మళ్ళీ రిపీట్ చేయకూడదని కేసీయార్ అనుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్ధుల ఎంపికలో సర్వే సంస్ధలతో పాటు పార్టీ ఇంటెలిజెన్స్ ను కూడా రంగంలోకి దించారట. అభ్యర్ధులుగా ఎంపిక చేయబోయే వారి నేపధ్యంతో పాటు వాళ్ళ ఆర్ధిక స్ధితిగతులను కూడా అంచనా వేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏల ట్రాక్ రికార్డు, వాళ్ళపైన ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోకుండా అచ్చంగా ఆర్ధిక పరిస్ధితులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అందుకనే రిజల్టు పూర్తిగా నెగిటివ్ గా వచ్చాయి.
అందుకనే పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో నేతల ట్రాక్ రికార్డుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే జనాల్లో మంచి ఇమేజి ఉండి, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న నేతలను పోటీలోకి దింపితే మంచి రిజల్టు వస్తుందని కేసీయార్ భావిస్తున్నారట. కారణం ఏమిటంటే అవసరమైన అభ్యర్ధులకు పార్టీయే నిధులను సర్దుబాటు చేయాలని కేసీయార్ అనుకున్నారట. కాబట్టి మంచి ట్రాక్ రికార్డున్న నేతలనే అభ్యర్ధులుగా ఎంపిక చేయటానికే సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on February 5, 2024 4:34 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…