Political News

న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు త‌న‌ను బెదిరిస్తున్న‌ట్టు ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె వేడుకున్నారు. ఈ మేర‌కు సునీత‌.. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, త‌న సోద‌రి ష‌ర్మిల‌కు కూడా ప్రాణ హాని ఉంద‌ని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం వెనుక సొంత మ‌నుషులే ఉన్నార‌ని, రాజ‌కీయ కార‌ణాలతోనే ఈ హ‌త్యకు పాల్ప‌డ్డా రని ఈ హ‌త్య కుట్ర‌కు పాల్ప‌డిన వారికి సొంత మ‌నుషులే అండ‌గా ఉన్నార‌ని కూడా సునీత ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న‌కు న్యాయం చేయాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి, కేసు విచార‌ణ‌ను తెలంగాణ హైకోర్టుకు మార్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు.. స‌హా ఆయనను అరెస్టు చేయాల‌నే డిమాండ్‌తో మ‌రో న్యాయ పోరాటం సమాంత‌రంగా చేస్తున్నారు.

ఇదిలావుంటే.. మ‌రోవైపు, సునీత‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల ష‌ర్మిల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లోనూ సునీత పాల్గొన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేయొచ్చ‌ని భావిస్తున్నారు. ఇదిలా సాగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా ఆమె బెదిరింపు మెసేజ్‌లు రావ‌డం.. ఆమెను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

చంపేస్తాం, లేపేస్తాం.. ఇక రోజులు లెక్క‌పెట్టుకో.. అంటూ.. త‌న‌ను ఫేస్‌బుక్ లో హెచ్చ‌రిస్తున్నార‌ని డాక్ట‌ర్ సునీత సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నార‌ని కూడా తెలిపారు. తనను, వైఎస్ షర్మిలను “లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తున్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫిర్యాదు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం.. సునీత రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళన‌కు దారితీస్తున్నాయి.

This post was last modified on February 2, 2024 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago