Political News

న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు త‌న‌ను బెదిరిస్తున్న‌ట్టు ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె వేడుకున్నారు. ఈ మేర‌కు సునీత‌.. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, త‌న సోద‌రి ష‌ర్మిల‌కు కూడా ప్రాణ హాని ఉంద‌ని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం వెనుక సొంత మ‌నుషులే ఉన్నార‌ని, రాజ‌కీయ కార‌ణాలతోనే ఈ హ‌త్యకు పాల్ప‌డ్డా రని ఈ హ‌త్య కుట్ర‌కు పాల్ప‌డిన వారికి సొంత మ‌నుషులే అండ‌గా ఉన్నార‌ని కూడా సునీత ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న‌కు న్యాయం చేయాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి, కేసు విచార‌ణ‌ను తెలంగాణ హైకోర్టుకు మార్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు.. స‌హా ఆయనను అరెస్టు చేయాల‌నే డిమాండ్‌తో మ‌రో న్యాయ పోరాటం సమాంత‌రంగా చేస్తున్నారు.

ఇదిలావుంటే.. మ‌రోవైపు, సునీత‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల ష‌ర్మిల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లోనూ సునీత పాల్గొన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేయొచ్చ‌ని భావిస్తున్నారు. ఇదిలా సాగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా ఆమె బెదిరింపు మెసేజ్‌లు రావ‌డం.. ఆమెను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

చంపేస్తాం, లేపేస్తాం.. ఇక రోజులు లెక్క‌పెట్టుకో.. అంటూ.. త‌న‌ను ఫేస్‌బుక్ లో హెచ్చ‌రిస్తున్నార‌ని డాక్ట‌ర్ సునీత సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నార‌ని కూడా తెలిపారు. తనను, వైఎస్ షర్మిలను “లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తున్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫిర్యాదు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం.. సునీత రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళన‌కు దారితీస్తున్నాయి.

This post was last modified on February 2, 2024 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

OTT రూటు… ఇది కరెక్టు పాయింటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…

15 minutes ago

బడ్జెట్ 10 కోట్లు… వసూళ్లు 200 కోట్లు

మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…

50 minutes ago

నవ్వుల నాగ‌బాబు… జ‌బ‌ర్ద‌స్త్‌ను లేప‌గ‌ల‌డా?

తెలుగు టీవీ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన షోగా జ‌బ‌ర్ద‌స్త్‌ను చెప్పొచ్చు. అందులో డ‌బుల్ మీనింగ్‌లు, బాడీ షేమింగ్‌ల గురించి అభ్యంత‌రాలు…

1 hour ago

ప్రొడ్యూసర్ కిరణ్ సక్సెస్ అయినట్టేనా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…

4 hours ago

ఆదిత్య ధర్ స్టోరీలు అమ్మేసుకున్న ఫ్రెండు

ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…

4 hours ago

కేరళలో వివాదం చేసి తెలుగులో స్పందించిన నటుడు

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…

5 hours ago