Political News

న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు త‌న‌ను బెదిరిస్తున్న‌ట్టు ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె వేడుకున్నారు. ఈ మేర‌కు సునీత‌.. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, త‌న సోద‌రి ష‌ర్మిల‌కు కూడా ప్రాణ హాని ఉంద‌ని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం వెనుక సొంత మ‌నుషులే ఉన్నార‌ని, రాజ‌కీయ కార‌ణాలతోనే ఈ హ‌త్యకు పాల్ప‌డ్డా రని ఈ హ‌త్య కుట్ర‌కు పాల్ప‌డిన వారికి సొంత మ‌నుషులే అండ‌గా ఉన్నార‌ని కూడా సునీత ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న‌కు న్యాయం చేయాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి, కేసు విచార‌ణ‌ను తెలంగాణ హైకోర్టుకు మార్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు.. స‌హా ఆయనను అరెస్టు చేయాల‌నే డిమాండ్‌తో మ‌రో న్యాయ పోరాటం సమాంత‌రంగా చేస్తున్నారు.

ఇదిలావుంటే.. మ‌రోవైపు, సునీత‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల ష‌ర్మిల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లోనూ సునీత పాల్గొన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేయొచ్చ‌ని భావిస్తున్నారు. ఇదిలా సాగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా ఆమె బెదిరింపు మెసేజ్‌లు రావ‌డం.. ఆమెను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

చంపేస్తాం, లేపేస్తాం.. ఇక రోజులు లెక్క‌పెట్టుకో.. అంటూ.. త‌న‌ను ఫేస్‌బుక్ లో హెచ్చ‌రిస్తున్నార‌ని డాక్ట‌ర్ సునీత సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నార‌ని కూడా తెలిపారు. తనను, వైఎస్ షర్మిలను “లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తున్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫిర్యాదు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం.. సునీత రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళన‌కు దారితీస్తున్నాయి.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

3 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

5 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

5 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

7 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

9 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

10 hours ago