Political News

ఏపీలో బీఆర్ఎస్.. తోట యూట‌ర్న్‌

ఏపీలో రాజ‌కీయాలు వ‌డివడిగా మారుతున్నాయి. నాయ‌కులు త‌మ త‌మ దారుల్లో స్పీడ్‌గానే మూవ్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌(భార‌త రాష్ట్ర‌స‌మితి) ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశం లేక పోవ‌డం.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ.. తెలంగాణ‌కే ప‌రిమితం కావ‌డం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి ఏపీలో బీఆర్ఎస్ ఉంటే.. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. కాకినాడ లేదా.. రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్న‌తాధికారి కావ‌డంతో ఆయ‌న ఈ ప్లాన్ వేసుకున్నారు. కానీ.. బీఆర్ఎస్ పోటీ నుంచి విర‌మించుకున్న ద‌రిమిలా తోట‌.. త‌న రూటు మార్చుకున్నారు. జ‌న‌సేన వైపు ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల నుంచి ఆయ‌న జ‌న‌సేన‌తో చ‌ర్చలు కూడా జ‌రుపుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారికంగా ఏమీ బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు.. ఇదే బీఆర్ఎస్ కు చెందిన ఏపీ నాయ‌కుడు రావెల కిశోర్‌బాబు.. తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు.

ఇక‌… ఇప్పుడు.. తోట నేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌.. మెగా స్టార్ చిరును క‌లుసుకున్నారు. ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశామ‌ని చెబుతున్నా.. రాజ‌కీయంగా అంత‌ర్గ‌త చ‌ర్చ సాగిన‌ట్టు తెలుస్తోంది. తోట చంద్ర‌శేఖ‌ర్ .. ఈ నెల 4న జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్టు వార్త‌లు గుప్పు మంటున్నాయి. అదే రోజు మ‌రో కాపు నేత‌.. వైసీపీ ఎంపీ బాల‌శౌరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక‌, ఇప్ప‌టికే బాల‌శౌరికి మ‌చిలీప‌ట్నం ఎంపీ టికెట్‌ను ఖ‌రారు చేశారు.

ఇక‌, ఇప్పుడు తోట‌కు గుంటూరు వెస్ట్ సీటు ఖాయం చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వాను త‌ట్టుకుని మ‌రి.. ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి తోట నిల‌బ‌డే చాన్స్ మెండుగా ఉంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాల అభిప్రాయం. దీనికి తాజాగా చిరును ఆయ‌న క‌ల‌వ‌డం.. అభినందించ‌డం మ‌రింత ప్రాధాన్యం క‌లిగించేలా చేసింది. ఏదేమైనా.. ఏపీలో మార్పులు జోరుగానే సాగుతున్నాయి.

This post was last modified on February 2, 2024 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago