Political News

ఏపీలో బీఆర్ఎస్.. తోట యూట‌ర్న్‌

ఏపీలో రాజ‌కీయాలు వ‌డివడిగా మారుతున్నాయి. నాయ‌కులు త‌మ త‌మ దారుల్లో స్పీడ్‌గానే మూవ్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌(భార‌త రాష్ట్ర‌స‌మితి) ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశం లేక పోవ‌డం.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ.. తెలంగాణ‌కే ప‌రిమితం కావ‌డం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి ఏపీలో బీఆర్ఎస్ ఉంటే.. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. కాకినాడ లేదా.. రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్న‌తాధికారి కావ‌డంతో ఆయ‌న ఈ ప్లాన్ వేసుకున్నారు. కానీ.. బీఆర్ఎస్ పోటీ నుంచి విర‌మించుకున్న ద‌రిమిలా తోట‌.. త‌న రూటు మార్చుకున్నారు. జ‌న‌సేన వైపు ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల నుంచి ఆయ‌న జ‌న‌సేన‌తో చ‌ర్చలు కూడా జ‌రుపుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారికంగా ఏమీ బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు.. ఇదే బీఆర్ఎస్ కు చెందిన ఏపీ నాయ‌కుడు రావెల కిశోర్‌బాబు.. తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు.

ఇక‌… ఇప్పుడు.. తోట నేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌.. మెగా స్టార్ చిరును క‌లుసుకున్నారు. ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశామ‌ని చెబుతున్నా.. రాజ‌కీయంగా అంత‌ర్గ‌త చ‌ర్చ సాగిన‌ట్టు తెలుస్తోంది. తోట చంద్ర‌శేఖ‌ర్ .. ఈ నెల 4న జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్టు వార్త‌లు గుప్పు మంటున్నాయి. అదే రోజు మ‌రో కాపు నేత‌.. వైసీపీ ఎంపీ బాల‌శౌరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక‌, ఇప్ప‌టికే బాల‌శౌరికి మ‌చిలీప‌ట్నం ఎంపీ టికెట్‌ను ఖ‌రారు చేశారు.

ఇక‌, ఇప్పుడు తోట‌కు గుంటూరు వెస్ట్ సీటు ఖాయం చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వాను త‌ట్టుకుని మ‌రి.. ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి తోట నిల‌బ‌డే చాన్స్ మెండుగా ఉంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాల అభిప్రాయం. దీనికి తాజాగా చిరును ఆయ‌న క‌ల‌వ‌డం.. అభినందించ‌డం మ‌రింత ప్రాధాన్యం క‌లిగించేలా చేసింది. ఏదేమైనా.. ఏపీలో మార్పులు జోరుగానే సాగుతున్నాయి.

This post was last modified on February 2, 2024 11:07 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

6 hours ago