Political News

ఒంటరి పోటీ..ఫైనల్ అయిపోయిందా ?

రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీచేయటానికి డిసైడ్ అయిపోయినట్లుంది. ఎందుకంటే మిత్రపక్షమని చెప్పుకుంటున్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. ఇపుడు అభ్యర్ధులను కూడా ఫైనల్ చేసుకుంటోంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయన్నది స్పష్టమైంది. బీజేపీ కూడా కలుస్తుందని అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు కాని కమలనాదుల నుండి అలాంటి సానుకూలత ఏమీ కనిపించటంలేదు. పైగా ఈమధ్య ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ లో పొత్తుల విషయం చర్చకు వచ్చిందట.

ఆ సందర్భంగా నరేంద్రమోడి మాట్లాడుతు బీజేపీ, జనసేనలు మాత్రమే మిత్రపక్షాలుగా ఎన్నికలకు వెళతాయని చెప్పారట. ఒకవేళ జనసేన గనుక కలిసిరాకపోతే బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తుందని కూడా చెప్పేశారని పార్టీవర్గాల సమాచారం. ఆ తర్వాత 175 అసెంబ్లీలకు, 25 పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో ఆశావహులను గుర్తించేందుకు ప్రాసెస్ మొదలైంది. జాతీయ నాయకత్వం నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే ప్రతి జిల్లాకు ముగ్గురు పరిశీలకులతో రాష్ట్ర అధ్యక్షరాలు కమిటీలను నియమించారు.

ఈ కమిటీలు అన్నీ జిల్లాల్లో తిరిగి పోటీచేసే విషయంలో ఆసక్తి ఉన్న నేతల నుండి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. తాజా అప్ డేట్ ఏమిటంటే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం బీజేపీ ఎన్నికల ఆపీసులను ఓపెన్ చేయబోతోంది. ఒంటరిపోటీకి రెడీ అయిపోయింది కాబట్టే రాష్ట్రంలో చాలాచోట్ల బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటు వాల్ పోస్టర్లను అంటిస్తోంది.

అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా పార్టీ నియమించింది. ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేయటానికి 4వ తేదీనుండి అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాధ్ సింగ్ తదితరులు రెగ్యులర్ గా పర్యటించబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 9,10 తేదీల్లో రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్యులతో రోడ్డుషోల్లాంటివి ప్లాన్ జరుగుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో టికెట్ల కోసం 2438 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారని సమాచారం. మరి వీటిని ఎప్పుడు వడపోస్తారో చూడాలి.

This post was last modified on February 1, 2024 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago