Political News

ఒంటరి పోటీ..ఫైనల్ అయిపోయిందా ?

రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీచేయటానికి డిసైడ్ అయిపోయినట్లుంది. ఎందుకంటే మిత్రపక్షమని చెప్పుకుంటున్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. ఇపుడు అభ్యర్ధులను కూడా ఫైనల్ చేసుకుంటోంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయన్నది స్పష్టమైంది. బీజేపీ కూడా కలుస్తుందని అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు కాని కమలనాదుల నుండి అలాంటి సానుకూలత ఏమీ కనిపించటంలేదు. పైగా ఈమధ్య ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ లో పొత్తుల విషయం చర్చకు వచ్చిందట.

ఆ సందర్భంగా నరేంద్రమోడి మాట్లాడుతు బీజేపీ, జనసేనలు మాత్రమే మిత్రపక్షాలుగా ఎన్నికలకు వెళతాయని చెప్పారట. ఒకవేళ జనసేన గనుక కలిసిరాకపోతే బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తుందని కూడా చెప్పేశారని పార్టీవర్గాల సమాచారం. ఆ తర్వాత 175 అసెంబ్లీలకు, 25 పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో ఆశావహులను గుర్తించేందుకు ప్రాసెస్ మొదలైంది. జాతీయ నాయకత్వం నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే ప్రతి జిల్లాకు ముగ్గురు పరిశీలకులతో రాష్ట్ర అధ్యక్షరాలు కమిటీలను నియమించారు.

ఈ కమిటీలు అన్నీ జిల్లాల్లో తిరిగి పోటీచేసే విషయంలో ఆసక్తి ఉన్న నేతల నుండి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. తాజా అప్ డేట్ ఏమిటంటే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం బీజేపీ ఎన్నికల ఆపీసులను ఓపెన్ చేయబోతోంది. ఒంటరిపోటీకి రెడీ అయిపోయింది కాబట్టే రాష్ట్రంలో చాలాచోట్ల బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటు వాల్ పోస్టర్లను అంటిస్తోంది.

అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా పార్టీ నియమించింది. ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేయటానికి 4వ తేదీనుండి అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాధ్ సింగ్ తదితరులు రెగ్యులర్ గా పర్యటించబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 9,10 తేదీల్లో రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్యులతో రోడ్డుషోల్లాంటివి ప్లాన్ జరుగుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో టికెట్ల కోసం 2438 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారని సమాచారం. మరి వీటిని ఎప్పుడు వడపోస్తారో చూడాలి.

This post was last modified on February 1, 2024 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

6 minutes ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

33 minutes ago

హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…

2 hours ago

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

3 hours ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

3 hours ago

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…

3 hours ago