Political News

ఒంగోలుపై ఎవరి పట్టువారిదేనా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల టికెట్లను జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖాయంచేసేశారు. అయితే ఎంతకాలం కసరత్తు చేసినా ఒక నియోజకవర్గం మాత్రం కొరుకుడుపడట్లేదు. ఆ నియోజకవర్గమే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో మొదటినుండి ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి హవా బాగానే నడుస్తోంది. ఈయన జగన్ కు దగ్గరి బంధువు కూడా కావటంతో జిల్లాలో దాదాపు తిరుగులేకుండా ఉంది. ఇలాంటి నేపధ్యంలో జగన్ టికెట్లకు అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు.

జిల్లాలో చాలాసీట్లను ఫైనల్ చేసినా ఒంగోలు పార్లమెంటు సీటును మాత్రం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే బాలినేనే అని చెప్పాలి. విషయం ఏమిటంటే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే టికెట్ కేటాయించాలని బాలినేని పట్టుబట్టారు. మాగుంటకు టికెట్ ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకనే ప్రత్యామ్నాయంగా ఎవరిపేరును ప్రతిపాదిస్తున్న బాలినేని రెజెక్టు చేస్తున్నారు. ఇదే సమయంలో మాగుంటకు టికెట్ కోసం బాలినేని ఎంత పట్టుబడుతున్నా జగన్ నో అంటున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ మీదే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఆధారపడుంది.

మాగుంటకు ఎంపీగా టికెట్ ఇస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ నుండి పోటీచేస్తానని బాలినేని షరతు పెట్టారట. మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వకపోతే బాలినేని కూడా పోటీ చేయరన్నది స్పష్టమైంది. ఒంగోలు ఎంపీ, ఎంఎల్ఏ టికెట్ల మీదే మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఆధారపడుంది. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక జగన్, బాలినేని ఇద్దరు సతమతమవుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లను ఫైనల్ చేయగలుగుతున్న జగన్ ఒంగోలు ఎంపీ టికెట్ ను మాత్రం ఫైనల్ చేయలేక అవస్తలు పడుతున్నారు.

మాగుంట, బాలినేని ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే పార్టీకి జరగబోయే డ్యామేజి గురించి జగన్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలినేని వ్యవహారశైలితో జగన్ తో పాటు చాలామంది నేతలు బాగా విసిగిపోయున్నారు. అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేనికి ఉన్న పట్టు, దగ్గరి బంధువన్న కారణాలతోనే బాలినేని ఎంత కంపుచేసినా జగన్ భరిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on January 31, 2024 1:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప‌దునైన ఆయుధంతో బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కూట‌మికి ఓ ప్ర‌ధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యాన్నే…

38 mins ago

మీడియా ముందే వ‌ల‌వ‌లా ఏడ్చేసిన ష‌ర్మిల..

మీడియా ముందే నాయ‌కులు వ‌ల‌వ‌లా ఏడ్చేయ‌డం కొత్త కాదు. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. త‌న స‌తీమ‌ణిని దూషించారంటూ..…

45 mins ago

ప‌వ‌న్‌తో పొత్తుకు జ‌గ‌న్ ఆరాటం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌రం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జ‌రిగే పోలింగ్‌తో పార్టీల రాజ‌కీయ జీవితాలు ముడిప‌డి ఉన్నాయి. అధికారం…

2 hours ago

ఉద్యోగులు పోటెత్తారు.. క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. !

ఏపీలో ఉద్యోగులు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 ల‌క్ష‌ల…

3 hours ago

తేజ – రానా ఏమిటీ మౌనం

ఒకప్పుడు చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో…

4 hours ago

ఉద్య‌మ‌కారుల గుడ్‌బై.. ఏకాకిగా కేసీఆర్‌!

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతూనే ఉంది. ముఖ్యంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్‌కు…

5 hours ago