Political News

ఒంగోలుపై ఎవరి పట్టువారిదేనా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల టికెట్లను జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖాయంచేసేశారు. అయితే ఎంతకాలం కసరత్తు చేసినా ఒక నియోజకవర్గం మాత్రం కొరుకుడుపడట్లేదు. ఆ నియోజకవర్గమే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో మొదటినుండి ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి హవా బాగానే నడుస్తోంది. ఈయన జగన్ కు దగ్గరి బంధువు కూడా కావటంతో జిల్లాలో దాదాపు తిరుగులేకుండా ఉంది. ఇలాంటి నేపధ్యంలో జగన్ టికెట్లకు అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు.

జిల్లాలో చాలాసీట్లను ఫైనల్ చేసినా ఒంగోలు పార్లమెంటు సీటును మాత్రం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే బాలినేనే అని చెప్పాలి. విషయం ఏమిటంటే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే టికెట్ కేటాయించాలని బాలినేని పట్టుబట్టారు. మాగుంటకు టికెట్ ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకనే ప్రత్యామ్నాయంగా ఎవరిపేరును ప్రతిపాదిస్తున్న బాలినేని రెజెక్టు చేస్తున్నారు. ఇదే సమయంలో మాగుంటకు టికెట్ కోసం బాలినేని ఎంత పట్టుబడుతున్నా జగన్ నో అంటున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ మీదే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఆధారపడుంది.

మాగుంటకు ఎంపీగా టికెట్ ఇస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ నుండి పోటీచేస్తానని బాలినేని షరతు పెట్టారట. మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వకపోతే బాలినేని కూడా పోటీ చేయరన్నది స్పష్టమైంది. ఒంగోలు ఎంపీ, ఎంఎల్ఏ టికెట్ల మీదే మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఆధారపడుంది. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక జగన్, బాలినేని ఇద్దరు సతమతమవుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లను ఫైనల్ చేయగలుగుతున్న జగన్ ఒంగోలు ఎంపీ టికెట్ ను మాత్రం ఫైనల్ చేయలేక అవస్తలు పడుతున్నారు.

మాగుంట, బాలినేని ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే పార్టీకి జరగబోయే డ్యామేజి గురించి జగన్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలినేని వ్యవహారశైలితో జగన్ తో పాటు చాలామంది నేతలు బాగా విసిగిపోయున్నారు. అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేనికి ఉన్న పట్టు, దగ్గరి బంధువన్న కారణాలతోనే బాలినేని ఎంత కంపుచేసినా జగన్ భరిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on January 31, 2024 1:18 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

5 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

7 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

8 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

8 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

8 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

9 hours ago