Political News

ష‌ర్మిల‌తో సునీత భేటీ లో చర్చ ఇదేనటగా

క‌డ‌ప రాజ‌కీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌తో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె, డాక్ట‌ర్ సునీత భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్ర‌లో ఉన్న ష‌ర్మిల‌.. జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. సోమవా రం ఉద‌యం ఆమె క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌కర్త‌ల‌కంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు.

ఇరువురూ అల్పాహార విందు కూడా చేశారు. మొత్తం గంట‌కుపైగానే ఇరువురు చ‌ర్చ‌లు జ‌ర‌పడం రాజ‌కీ యంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టికే వివేకా దారుణ హ‌త్య త‌ర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోయిన విష‌యం తెలిసిందే. నిజాలు దాస్తున్నార‌ని.. నేర‌స్తుల‌కు కొమ్ముకాస్తున్నార‌ని.. ఇరువురు బ‌హిరంగ విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇక‌, సునీత ఏకంగా న్యాయ పోరాటానికి కూడా దిగారు. చెల్లికి అండ‌గా.. ష‌ర్మిల కూడా గ‌ళం విప్పారు. ఈ క్ర‌మంలో వీరి మ‌ధ్య మ‌రింత బంధం ఏర్ప‌డింది.

ఇది.. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఢీ అంటే ఢీ అంటున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు సునీత‌ను కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చి.. ఎలివేట్ చేయ‌డం ద్వారా కీల‌క‌మైన క‌డ‌ప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో వ‌చ్చే విష‌యంపై తాజాగా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా తాను రాకున్నా.. త‌న త‌ల్లి సౌభాగ్య‌మ్మ‌ను రంగంలోకి దింపడం ద్వారా.. ఇక్క‌డ వైసీపీ దూకుడుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

క‌డ‌ప ఎంపీ స్తానంపైనే ఇటు ష‌ర్మిల‌, అటు సునీత కూడా ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని.. కాబ‌ట్టి.. పార్టీలోకి రా.. చెల్లి! అని ఆమె ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. పార్టీలో చేర‌డంతోపాటు క‌డ‌ప ఎంపీ సీటును తీసుకుంటే గెలిపించే బాధ్య‌త కూడా తాను తీసుకుంటాన‌ని ష‌ర్మిల చెప్పిన‌ట్టు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 29, 2024 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

57 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago