కడప రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచలన ఘట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత భేటీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్రలో ఉన్న షర్మిల.. జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవా రం ఉదయం ఆమె కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు.
ఇరువురూ అల్పాహార విందు కూడా చేశారు. మొత్తం గంటకుపైగానే ఇరువురు చర్చలు జరపడం రాజకీ యంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా దారుణ హత్య తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోయిన విషయం తెలిసిందే. నిజాలు దాస్తున్నారని.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నారని.. ఇరువురు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఇక, సునీత ఏకంగా న్యాయ పోరాటానికి కూడా దిగారు. చెల్లికి అండగా.. షర్మిల కూడా గళం విప్పారు. ఈ క్రమంలో వీరి మధ్య మరింత బంధం ఏర్పడింది.
ఇది.. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. వైఎస్ జగన్ను ఢీ అంటే ఢీ అంటున్న షర్మిల.. ఇప్పుడు సునీతను కూడా రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చి.. ఎలివేట్ చేయడం ద్వారా కీలకమైన కడప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహం ఉందనే అంచనాలు వస్తున్నాయి. రాజకీయాల్లో వచ్చే విషయంపై తాజాగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తాను రాకున్నా.. తన తల్లి సౌభాగ్యమ్మను రంగంలోకి దింపడం ద్వారా.. ఇక్కడ వైసీపీ దూకుడుకు చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
కడప ఎంపీ స్తానంపైనే ఇటు షర్మిల, అటు సునీత కూడా ఎక్కువగా చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పుంజుకుంటుందనే సంకేతాలు వస్తున్నాయని.. కాబట్టి.. పార్టీలోకి రా.. చెల్లి! అని ఆమె ఆహ్వానించినట్టు తెలిసింది. పార్టీలో చేరడంతోపాటు కడప ఎంపీ సీటును తీసుకుంటే గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని షర్మిల చెప్పినట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 29, 2024 4:19 pm
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…