Political News

ష‌ర్మిల‌తో సునీత భేటీ లో చర్చ ఇదేనటగా

క‌డ‌ప రాజ‌కీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌తో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె, డాక్ట‌ర్ సునీత భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్ర‌లో ఉన్న ష‌ర్మిల‌.. జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. సోమవా రం ఉద‌యం ఆమె క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌కర్త‌ల‌కంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు.

ఇరువురూ అల్పాహార విందు కూడా చేశారు. మొత్తం గంట‌కుపైగానే ఇరువురు చ‌ర్చ‌లు జ‌ర‌పడం రాజ‌కీ యంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టికే వివేకా దారుణ హ‌త్య త‌ర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోయిన విష‌యం తెలిసిందే. నిజాలు దాస్తున్నార‌ని.. నేర‌స్తుల‌కు కొమ్ముకాస్తున్నార‌ని.. ఇరువురు బ‌హిరంగ విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇక‌, సునీత ఏకంగా న్యాయ పోరాటానికి కూడా దిగారు. చెల్లికి అండ‌గా.. ష‌ర్మిల కూడా గ‌ళం విప్పారు. ఈ క్ర‌మంలో వీరి మ‌ధ్య మ‌రింత బంధం ఏర్ప‌డింది.

ఇది.. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఢీ అంటే ఢీ అంటున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు సునీత‌ను కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చి.. ఎలివేట్ చేయ‌డం ద్వారా కీల‌క‌మైన క‌డ‌ప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో వ‌చ్చే విష‌యంపై తాజాగా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా తాను రాకున్నా.. త‌న త‌ల్లి సౌభాగ్య‌మ్మ‌ను రంగంలోకి దింపడం ద్వారా.. ఇక్క‌డ వైసీపీ దూకుడుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

క‌డ‌ప ఎంపీ స్తానంపైనే ఇటు ష‌ర్మిల‌, అటు సునీత కూడా ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని.. కాబ‌ట్టి.. పార్టీలోకి రా.. చెల్లి! అని ఆమె ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. పార్టీలో చేర‌డంతోపాటు క‌డ‌ప ఎంపీ సీటును తీసుకుంటే గెలిపించే బాధ్య‌త కూడా తాను తీసుకుంటాన‌ని ష‌ర్మిల చెప్పిన‌ట్టు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 29, 2024 4:19 pm

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

1 hour ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

2 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

3 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

3 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

6 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

7 hours ago