కడప రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచలన ఘట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత భేటీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్రలో ఉన్న షర్మిల.. జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవా రం ఉదయం ఆమె కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు.
ఇరువురూ అల్పాహార విందు కూడా చేశారు. మొత్తం గంటకుపైగానే ఇరువురు చర్చలు జరపడం రాజకీ యంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా దారుణ హత్య తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోయిన విషయం తెలిసిందే. నిజాలు దాస్తున్నారని.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నారని.. ఇరువురు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఇక, సునీత ఏకంగా న్యాయ పోరాటానికి కూడా దిగారు. చెల్లికి అండగా.. షర్మిల కూడా గళం విప్పారు. ఈ క్రమంలో వీరి మధ్య మరింత బంధం ఏర్పడింది.
ఇది.. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. వైఎస్ జగన్ను ఢీ అంటే ఢీ అంటున్న షర్మిల.. ఇప్పుడు సునీతను కూడా రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చి.. ఎలివేట్ చేయడం ద్వారా కీలకమైన కడప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహం ఉందనే అంచనాలు వస్తున్నాయి. రాజకీయాల్లో వచ్చే విషయంపై తాజాగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తాను రాకున్నా.. తన తల్లి సౌభాగ్యమ్మను రంగంలోకి దింపడం ద్వారా.. ఇక్కడ వైసీపీ దూకుడుకు చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
కడప ఎంపీ స్తానంపైనే ఇటు షర్మిల, అటు సునీత కూడా ఎక్కువగా చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పుంజుకుంటుందనే సంకేతాలు వస్తున్నాయని.. కాబట్టి.. పార్టీలోకి రా.. చెల్లి! అని ఆమె ఆహ్వానించినట్టు తెలిసింది. పార్టీలో చేరడంతోపాటు కడప ఎంపీ సీటును తీసుకుంటే గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని షర్మిల చెప్పినట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 29, 2024 4:19 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…