Political News

ష‌ర్మిల‌తో సునీత భేటీ లో చర్చ ఇదేనటగా

క‌డ‌ప రాజ‌కీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌తో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె, డాక్ట‌ర్ సునీత భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్ర‌లో ఉన్న ష‌ర్మిల‌.. జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. సోమవా రం ఉద‌యం ఆమె క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌కర్త‌ల‌కంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు.

ఇరువురూ అల్పాహార విందు కూడా చేశారు. మొత్తం గంట‌కుపైగానే ఇరువురు చ‌ర్చ‌లు జ‌ర‌పడం రాజ‌కీ యంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టికే వివేకా దారుణ హ‌త్య త‌ర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోయిన విష‌యం తెలిసిందే. నిజాలు దాస్తున్నార‌ని.. నేర‌స్తుల‌కు కొమ్ముకాస్తున్నార‌ని.. ఇరువురు బ‌హిరంగ విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇక‌, సునీత ఏకంగా న్యాయ పోరాటానికి కూడా దిగారు. చెల్లికి అండ‌గా.. ష‌ర్మిల కూడా గ‌ళం విప్పారు. ఈ క్ర‌మంలో వీరి మ‌ధ్య మ‌రింత బంధం ఏర్ప‌డింది.

ఇది.. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఢీ అంటే ఢీ అంటున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు సునీత‌ను కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చి.. ఎలివేట్ చేయ‌డం ద్వారా కీల‌క‌మైన క‌డ‌ప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో వ‌చ్చే విష‌యంపై తాజాగా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా తాను రాకున్నా.. త‌న త‌ల్లి సౌభాగ్య‌మ్మ‌ను రంగంలోకి దింపడం ద్వారా.. ఇక్క‌డ వైసీపీ దూకుడుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

క‌డ‌ప ఎంపీ స్తానంపైనే ఇటు ష‌ర్మిల‌, అటు సునీత కూడా ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని.. కాబ‌ట్టి.. పార్టీలోకి రా.. చెల్లి! అని ఆమె ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. పార్టీలో చేర‌డంతోపాటు క‌డ‌ప ఎంపీ సీటును తీసుకుంటే గెలిపించే బాధ్య‌త కూడా తాను తీసుకుంటాన‌ని ష‌ర్మిల చెప్పిన‌ట్టు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 29, 2024 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

32 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago